తెలుగు టీవీ రైటర్స్ అసోసియేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్
తెలుగు టీవీ రైటర్స్ అసోసియేషన్ సభ్యులకు ఐడెంటిటీ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ఇటీవల ఫిల్మ్ఛాంబర్లో జరిగింది.
ఈ కార్యక్రమంలో ఫౌండర్ ప్రెసిడెంట్ ఉషారాణి, గౌరవ అధ్యక్షలు సాయి మాధవ్ బుర్రా, అధ్యక్షులు కొమ్మనాపల్లి గణపతిరావు, ప్రధాన కార్యదర్శి శశాంక్ తదితరులు పాల్గొన్నారు. క్రిష్ ముఖ్య అతిథిగా హాజరై కార్డులను పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘నాకు రచయితలు అంటే ఎంతో గౌరవం. టీవీ రచయితలు ఓపిక ఎక్కువ ఉంటుంది. నవల, సినిమా కథలు రాయడానికి చాలా సౌలభ్యం ఉంటుంది. కానీ టెలివిజన్కి రాయాలంటే చాలా సవాళ్లు ఉంటాయి’’ అని అన్నారు.
ఉషారాణి మాట్లాడుతూ ‘‘రైటర్స్ కోసం రైటర్స్ అనే నినాదంతో ఈ అసోసియేషన్ మొదలుపెట్టా. అంతా ఐక్యమత్యంగా ముందుకు వెళ్లాలని కోరుతున్నా’’ అని అన్నారు. సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ ‘‘69ఏళ్ల జాతీయ పురస్కారాల చరిత్రలో తెలుగు వారు ఎవరికీ ఉత్తమ నటుడు అవార్డుల రాలేదు. మొదటిసారి మనతెలుగు హీరో అల్లు అర్జున్కి ఈ అవార్డు వరించడం, నేను మాటలు రాసిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఆరు అవార్డులు రావడం ఎంతో ఆనందంగా ఉంది.
ఉత్తమ నటుడు ఘనత సాధించిన అల్లు అర్జున్ను చూస్తుంటే గర్వంగా ఉంది. తెలుగు టీవీ రైటర్స్ అసోసియేషన్ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే ఎంతో ఘనత సాధించామని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ట్రెజరర్ వెంకటేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్: బివి రామారావు, జాయింట్ సెక్రెటరీ: ప్రజా ప్రభాకర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర వర్మ, అంజన్ మేగోటి, ఫణి రాజ్, రాంప్రసాద్, తదితర తెలుగు టీవీ రచయితలు పాల్గొన్నారు.
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…