జూన్ 27న మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విష్ణు మంచు ‘కన్నప్ప’

Must Read

డైనమిక్ హీరో విష్ణు మంచు గత ఏడాది ‘కన్నప్ప’ అంటూ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ‘కన్నప్ప’ మూవీని డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన సంగతి తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ ప్రాజెక్ట్‌లో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్, బ్రహ్మానందం ఇలా ఎంతో మంది గొప్ప నటీనటులు కీలక పాత్రలను పోషించడంతో ప్యాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్‌ను దక్కించుకుంది.

‘కన్నప్ప’ సినిమాకి తెలుగులో వచ్చిన ఆదరణ, క్లైమాక్స్‌లో విష్ణు నటనకు వచ్చిన ప్రశంసల గురించి అందరికీ తెలిసిందే. మరోసారి ఈ విజువల్ వండర్‌ను ఆడియెన్స్‌కి అందించేందుకు విష్ణు మంచు రెడీ అయ్యారు. సినిమా రిలీజ్ అయి ఏడాది అవుతున్న సందర్భంగా మళ్లీ జూన్ 27న ‘కన్నప్ప’ని లిమిటెడ్ స్క్రీన్‌లలో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు విడుదల చేసిన రీ రిలీజ్ డేట్ పోస్టర్ వైరల్ అవుతోంది.

Latest News

ఘనంగా మహేష్ కాంపెల్లి ‘వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ’ టీజర్ లాంచ్ ఈవెంట్…

మహేష్ కాంపెల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ' చిత్ర టీజర్‌ను చిత్రబృందం నేడు ఘనంగా విడుదల చేసింది. మిస్టరీ, సస్పెన్స్, ఎమోషనల్...

More News