విష్ణు బొప్పన గారి వీబీ ఎంటర్టైన్మెంట్స్ 2023-2024 సంవత్సరాలకు గాను, బుల్లి తెర అవార్డుని ప్రధానం చేసింది. ఈ సందర్భంగా హైద్రాబాద్ లో ఘనంగా ఒక ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసి, సినీ రాజకీయ ప్రముఖుల సమక్షం లో అవార్డుల ప్రధానోత్సవం చేసారు. ఈ ఈవెంట్ కి సమర్పకులు, వర్చ్యుసా లైఫ్ స్పేసెస్ కి సంబందించిన వైగండ్ల వెంకటేశ్వర్లు , వీవీకే హోసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబందించిన విజయ్ కుమార్, ఐశ్వర్య సిల్క్స్ లక్ష్మి, మరియు అడ్వాకేట్ నాగేశ్వర్ రావు పూజారి.
ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు, దర్శకులు ఎస్ వీ కృష్ణ రెడ్డి, నిర్మాత కె అచ్చి రెడ్డి, నిర్మాత మరియు అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ. జేడీ లక్ష్మి నారాయణ, హీరో పూరి ఆకాష్, మరియు హీరోయిన్ అర్చన.
ఈ ఈవెంట్ లో సీనియర్ నటి శ్రీలక్ష్మి గారికి జీవన సాఫల్య పురస్కారం అందించారు. అంతే కాకుండా టీవీ ఆర్టిస్ట్స్ కి, సోషల్ మీడియా ఇన్ఫ్లుఎంసెర్స్ కి, యూట్యూబర్స్ కి కూడా అవార్డుని ప్రధానం చేశారు. అంతే కాకుండా, పది మంది పేద కళాకారులకి ఆర్ధిక సాయం కూడా అందించారు.
లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డు అందుకున్న శ్రీలక్ష్మి మాట్లాడుతూ, “వీబీ ఎంటర్టైన్మెంట్స్ బుల్లితెర అవార్డు వారికి నా ధన్యవాదాలు. ఇన్నేళ్ళుగా సినిమాల్లో నటిస్తున్న నన్ను గుర్తించి నాకు ఈ అవార్డు ని అందించారు. మొదటగా నేను మా గురువు గారి జంధ్యాల గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆ తర్వాత నేను పని చేసిన డైరెక్టర్స్ అందరికీ తాంక్స్. నా మీద ఎప్పటికప్పుడు విశేష ప్రజాధారణ చూపిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. మిమ్మల్ని ఇలాగే అలరిస్తూ ఉంటాను. మరొక్క సారి ఇక్కడున్న వారందరికీ వీబీ ఎంటర్టైన్మెంట్స్ కి ధన్యవాదాలు” అన్నారు.
ఈ ఈవెంట్ కి హాజరైన అతిథులందరికీ ఘానా స్వాగతం లభించింది. అందరికీ ఏ ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు నిర్వాహకులు.
శ్రీలక్ష్మి గారితో పాటు అవార్డ్స్ అందుకున్న వారు మరియు పాల్గొన్నవారు : మానస, వేద, బిగ్ బాస్ ఫేమ్ బేబక్క, 30 యియర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, దివ్య వాని, రీతూ చౌదరి, బులెట్ భాస్కర్, రామ సత్యనారాయణ, మా అసోషియేషన్ మెంబర్ మాణిక్యం, మాదాల రవి
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…