ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్ కుమార్ మెయిన్ లీడ్ గా, అఖిల్ రాజ్, దివిజ ప్రభాకర్ ఇతర ప్రధాన పాత్రలలో సతీష్ గోగాడ దర్శకత్వంలో ఫస్ట్ కట్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెం#1 గా రూపొందనున్న చిత్రం ‘అర్జునుడి గీతోపదేశం’. త్రిలోక్ నాథ్.కె, ప్రదీప్ రెడ్డి.వి నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది.
ముహూర్తపు సన్నివేశానికి కనుమెలి అమ్మిరాజు క్లాప్ కొట్టగా మల్లాల సీతారామరాజు కెమరా స్విచాన్ చేశారు. త్రిలోక్ నాథ్, పూజిత స్క్రిప్ట్ అందించగా లక్కంశెట్టి వేణు గోపాల్ తొలిషాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు.
రాజీవ్, ఆదిత్య శశికుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా, చైతన్య కందుల డీవోపీగా, అర్జున్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
మూవీ లాంచింగ్ ఈవెంట్ లో దర్శకుడు సతీష్ గోగాడ మాట్లాడుతూ.. దర్శకునిగా ఇది నా తొలి చిత్రం. ఈ కథ చెప్పినపుడు నటీనటులంతా చాలా పాజిటివ్ గా స్పందించారు. మార్చి 20 నుంచి మొదటి షెడ్యుల్ అమలాపురంలో మొదలుపెడుతున్నాం. తర్వాత వైజాగ్, హైదరాబాద్, చెన్నై లో తర్వాత షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాం.
నిర్మాత మాట్లాడుతూ.. ఫస్ట్ కట్ ఫిల్మ్ ఫ్యాక్టరీ లో ఇది మొదటి సినిమా. సతీష్ చెప్పిన కథ చాలా అద్భుతంగా అనిపించింది. ప్రేక్షకులందరినీ అలరించేలా ఈ సినిమా వుంటుంది” అన్నారు
రాజీవ్ మాట్లాడుతూ.. దర్శకుడు సతీష్ కి సినిమా అంటే చాలా పాషన్. కథ చెప్పినపుడు చాలా ప్లజెంట్ గా అనిపించింది. మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. యంగ్ టీంతో ఈ సినిమా చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ కావాలి’ అన్నారు.
దివిజ మాట్లాడుతూ.. చాలా మంచి కథ ఇది. ఇందులోలీడ్ రోల్ లో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. చాలా మంచి టీంతో కలసి ఈ సినిమా చేస్తున్నాం” అన్నారు.
తారాగణం: వరలక్ష్మి శరత్కుమార్, అఖిల్ రాజ్, దివిజ ప్రభాకర్, రాజీవ్, ఆదిత్య శశికుమార్ తదితరులు
సాంకేతిక విభాగం:
రచన & దర్శకత్వం: సతీష్ గోగాడ
నిర్మాతలు : త్రిలోక్ నాథ్.కె, ప్రదీప్ రెడ్డి.వి
సంగీతం: చరణ్ అర్జున్
డివోపీ: చైతన్య కంధుల
ఆర్ట్: కె.వి.రమణ
ఎడిటర్: అర్జున్
లైన్ ప్రొడ్యూసర్: నాని రెడ్డి కె
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరికృష్ణ బోగ
విజువల్ డిపార్ట్మెంట్: రామ్ ధనుష్ వర్మ
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రాము తాటిపాక
కొరియోగ్రఫర్: విజయ్ పోలంకి
పి.ఆర్.ఓ. వంశీ-శేఖర్
-"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్…
ఫోనిక్స్ పిక్చర్స్ బ్యానర్పై, మాస్టర్ జియాన్స్ సమర్పణలో సత్యం రాజేష్, రియా సచ్యదేవ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న “ఫ్రెండ్లీ ఘోస్ట్”…
ఐశ్వర్య సినీ క్రియేషన్స్ బ్యానర్పై సింధుసూర్య నిర్మిస్తున్న నూతన చిత్రం 'శివ గాడి జిందగీ'. సచిన్ రామ్ ప్రతాప్, హాసిని…
ది మేజ్" చిత్రంతో దర్శకుడిగా డాక్టర్ కాబోయి యాక్టర్ కావడం చూస్తుంటాం కానీ డా. రవికిరణ్ గడలాయ్ ఎం.డి, పాథాలజిస్ట్…
ఎంఎస్ రాజు గారు ‘అగధ’ సీక్వెల్ ఎప్పుడు అంటారో చూడాలి - హీరో శ్రవణ్ రెడ్డి శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్…
హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని…