ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

” డైరెక్టర్స్ డే” సందర్భంగా ఇద్దరు కొత్త దర్శకులను పరిచయం చేస్తూ శనివారం నాడు “ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్” సమర్పణలో రెండు సినిమాల షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి.

హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ ప్రాంగణంలో “ఖుషి టాకీస్” బ్యానర్ లో సీత ప్రయాణం కృష్ణతో..అనే చిత్రం, “మహీ మీడియా వర్క్స్” బ్యానర్ పై “త్రిగుణి” చిత్రం లాంఛనంగా ముహూర్తం షాట్ తో మొదలయ్యాయి. ఈ రెండు చిత్రాల ముహూర్తం షాట్స్ కి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా ప్రసిద్ధ దర్శకులు దాసరి మారుతి తొలి క్లాప్ కొట్టారు.

ఆ తర్వాత జరిగిన సభలో ఈ రెండు చిత్రాల తొలి పోస్టర్లను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి, చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్, విరాట పర్వం దర్శకుడు వేణు ఉడుగుల, తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి టి ప్రసన్నకుమార్, డార్లింగ్ స్వామి, రుద్రాపట్ల వేణుగోపాల్, రామ్ రావిపల్లి తదితరులు పాల్గొన్నారు.

ఆధ్యాంతం కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలతో నడిచే ఫ్యామిలీ డ్రామా కథాంశంతో రానున్న
“సీత ప్రయాణం కృష్ణ”తో అనే సినిమాలో నాయికా నాయకులుగా.. రోజా ఖుషి, దినేష్ నటిస్తున్నారు. వీరితో పాటు అనుపమ, సుమంత్, వైభవ్ తదితరులు నటిస్తున్నా రని ఈ చిత్ర దర్శకుడు దేవేందర్ చెప్పారు.

త్రిగుణి సినిమాలో హీరోగా కుషాల్, ఒక ప్రత్యేక పాత్రలో రోజా ఖుషి నటిస్తుండగా తక్కిన పాత్రలకు అందరూ కొత్త నటీనటులనే పరిచయం చేస్తున్నామని ఆ చిత్ర దర్శకుడు వైతహవ్య వడ్లమాని చెప్పారు.

చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో
బ్యానర్: ఖుషి టాకీస్
నటీనటులు: రోజా ఖుషి, దినేష్, సుమంత్, అనుపమ
సినిమాటోగ్రఫీ:రవీంద్ర
సంగీతం: హనుమాన్ త్సవటపల్లి
కో డైరెక్టర్: రాజేంద్ర
పోస్ట్ ప్రొడక్షన్: ఖుషి స్టూడియోస్
పీర్ఓ: హరీష్, దినేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చెర్రీ
ప్రొడక్షన్ కంట్రోలర్: రుద్రపట్ల వేణుగోపాల్
చీఫ్ అడ్వైజర్: రామ్ రావిపల్లి
సమర్పణ: ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ డా. రాజీవ్
నిర్మాత: రోజా భారతి
డైరెక్టర్ : దేవేందర్

చిత్రం: త్రిగుణి
బ్యానర్: మహి మీడియా వర్క్స్
నటీనటులు: రోజా ఖుషి, కుషాల్ తదితరులు
సినిమాటోగ్రఫీ:సలీం
సంగీతం: హనుమాన్ త్సవటపల్లి
కో డైరెక్టర్: రవి ఖుష్
పోస్ట్ ప్రొడక్షన్: ఖుషి స్టూడియోస్
పీర్ఓ: హరీష్, దినేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చెర్రీ
ప్రొడక్షన్ కంట్రోలర్: రుద్రపట్ల వేణుగోపాల్
చీఫ్ అడ్వైజర్: రామ్ రావిపల్లి
సమర్పణ: ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ డా. రాజీవ్
నిర్మాత: మహేశ్వరి
కథ: వంశీ
డైరెక్టర్ : వైతహవ్య వడ్లమాని

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

7 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

7 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

7 days ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

7 days ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

7 days ago

పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లందరికీ ఇది ఒక పాఠం — ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…

1 week ago