కమిట్మెంట్ ఉన్న ఇద్దరు పెద్ద మనుషులు చేసే మంచిపనుల వల్ల పదిమందికి ఉపయోగం ఉంటే ఆ పని జాతికి గర్వకారణం అంటారు. మెగాస్టార్ చిరంజీవి యం.పిగా ఉన్నప్పుడు 2012–14ల మధ్యకాలంలో గుంటూరు జిల్లా తెనాలి పక్కన ఉన్న కొల్లిపర మండలంలోని చక్రాయపాలెం గ్రామంలో చక్రాయపాలెం కమ్యూనిటి హాలును నిర్మించటానికి 25లక్షల రూపాయల యం.పి నిధులను కేటాయించారు.
ఆ నిధులు సరిపోక కమ్యూనిటి హాలు నిర్మాణం ఆగిపోయింది. చక్రాయపాలెం గ్రామాన్ని తన సొంత గ్రామంగా భావించే మచిలీపట్నం యం.పి వల్లభనేని బాలశౌరి ఆగిపోయిన కమ్యూనిటీ హాలు నిర్మాణం పూర్తి అవ్వటానికి కావాల్సిన 40లక్షల రూపాయల నిధులను అందించి నాలుగు నెలల్లో నిర్మాణాన్ని పూర్తిచేస్తాను అంటూ ముందుకొచ్చారు.
ఆ కమ్యూనిటీ హాలుకు మెగాస్టార్ చిరంజీవి హాలుగా నామకరణం చేస్తాం అని సోషల్ మీడియా వేదికగా ట్వీట్టర్లో తెలియచేశారు. ఇటువంటి మంచి పనులే కదా! చరిత్రలో నిలిచిపోయేది అని వారిద్దరి పెద్దమనసులను గురించి పలువురు ట్వీటుకుంటున్నారు.
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియో తన తాజా తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ఇసకపట్నం’ ట్రైలర్ను…
'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…