కామెడీ, హర్రర్ తో ‘తిండిబోతు దెయ్యం’

నూతన చిత్రనిర్మాణ సంస్థ శ్రీ శౌర్య క్రియేషన్స్ తన ప్రొడక్షన్ నెం.1గా ‘తిండిబోతు దెయ్యం’ అనే చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించింది. నరసింహ బోదాసు, మోనికా సమత్తార్, తన్నీరు వాసవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తన స్వీయ దర్శకత్వంలో నరసింహ బోదాసు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మంగళవారం ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ముహూర్తపు సన్నివేశానికి సూపర్ హిట్ కామెడీ చిత్రాల దర్శకులు, నంది అవార్డు గ్రహీత రేలంగి నరసింహారావు క్లాప్ నివ్వగా.. నిర్మాత శిరీష నరసింహ బోదాసు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్బంగా…

ప్రఖ్యాత దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ… కామెడీ అనేది ఎప్పుడూ ఎవర్ గ్రీన్ అంశమే. చలనచిత్ర సీమలో కామెడీకి తిరుగులేదు. ఉండదుకూడా. అయితే.. దీనిని చక్కగా డీల్ చేసి తీస్తే విజయభావుటా ఖాయం. కామెడీ టచ్ తో కూడిన చిత్రానికి హర్రర్ మిళితం చేస్తే.. ఇక చెప్పేదేముంటుంది? ప్రేక్షకుల మనసులను ఇట్టే దోచేయొచ్చు. ఇప్పుడు సినిమాల్లో నడుస్తున్న ట్రెండ్ కూడా ఇదే. నాకు తెలిసి దర్శకులు నరసింహ బోదాసు ఈ చిత్రానికి ఎంతో మంచి స్క్రిప్ట్ ను సమకూర్చుకుని ఉంటారు. కామెడీతో కూడిన హర్రర్ అంటున్నారు కాబట్టి ప్రేక్షకుల మనసులను గెలుచుకునే విధంగానే ఉంటుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే నరసింహ బోదాసు అందులో నేర్పరి. ఎలాంటి చిత్రాలకు ప్రేక్షకాదరణ ఉంటుందో ఆయనకు బాగా తెలుసు. అలాగే ఈ చిత్రానికి కథానాయికలు కూడా చక్కగా కుదిరారు. హీరోయిన్స్ ను చూస్తూంటే ముచ్చెటేస్తుంది. ఈ సినిమా వంద శాతం హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది. ముఖ్యంగా ఏ సినిమాకైనా ప్లానింగ్ ఎంతో అవసరం. ఈ సినిమాలో నరసింహ బోదాసు కు తోడు నందుటి అశోక్ గౌడ్ ఉన్నారు కాబట్టి చక్కటి ప్లానింగ్ తోనే ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని ఆశిస్తున్నాను. విడుదలకు ముందు సినిమాకు మంచి ప్రమోషన్ ఇచ్చుకుంటూ ..సోషల్ మీడియాను బాగా వాడుకుని ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఈ ‘తిండిబోతు దెయ్యం’ కనిపించాలని… వినిపించాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

నిర్మాత, దర్శకులు, హీరో ‘నరసింహ బోదాసు’ మాట్లాడుతూ.. కొన్ని ఏళ్ల పాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకుని మంచి చిత్రాలు నిర్మించాలని ఈ నూతన చిత్రనిర్మాణ సంస్థ శ్రీ శౌర్య క్రియేషన్స్ ను స్థాపించాం. ప్రొడక్షన్ నెం.1గా మా ‘తిండిబోతు దెయ్యం’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఈ సినిమాలో కొత్తదనం ఉంటుంది. అందరూ ఆదరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.

కథానాయికలు మౌనిక, వాసవి మాట్లాడుతూ.. ఈ కామెడీ.. హర్రర్ సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ తమ పాత్రలను చక్కగా పోషించి అందరి అభిమానాన్ని చాటుకుంటామని, ఈ సినిమా గొప్ప సక్సెస్ కావాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

కో – డైరెక్టర్ నందుటి అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. కామెడీ హర్రర్ తో వస్తున్న ఈ ‘తిండిబోతు దెయ్యం’ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడం ఖాయం. కొత్త జోనర్ లో, సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా సక్సెస్ ని త్వరలోనే చూస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.

ఇంకా ఈ సమావేశంలో డైలాగ్ రైటర్ శ్రీకాంత్ సాయి మాట్లాడుతూ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని, శ్రీ శౌర్య క్రియేషన్స్ ద్వారా మరిన్ని చిత్రాలు రావాలని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ చిత్రానికి….హీరో: నరసింహ బోదాసు, హీరోయిన్స్: కుమారి మోనికా సమత్తార్, కుమారి తన్నీరు వాసవి

బ్యానర్ నేమ్ : శ్రీ శౌర్య క్రియేషన్స్
స్టోరి, స్క్రీన్ ప్లే & డైరెక్షన్ : నరసింహ బోదాసు
ప్రొడ్యూసర్ : శిరీష నరసింహ బోదాసు
డైలాగ్స్ : శ్రీకాంత్ సాయి
డి.ఓ.పి : మహేందర్. ఎం
కో – డైరెక్టర్ : నందుటి అశోక్ గౌడ్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : బాలమురుగన్ గరిమెళ్ళ
పీఆర్వో : తిరుమలశెట్టి వెంకటేష్

TFJA

Recent Posts

మే 28న విడుదల కానున్న శ్రద్ధాదాస్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రికాల’

భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ ప్రపంచవ్యాప్తంగా…

16 hours ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుండి ‘ప్రియసఖి’ గీతం విడుదల.. హృదయాలను కొల్లగొడుతోన్న హేషమ్ అబ్దుల్ వహాబ్ మెలోడీ

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ చిత్ర బృందం తాజాగా రెండవ గీతం ‘ప్రియసఖి’ని విడుదల చేసింది. ఈ పాట తన…

21 hours ago

‘మా ఇంటి బంగారం’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

2 days ago

నివేదా థామస్ తమ్ముడు హీరోగా ” బెంగుళూరు మహానగరం లో బాలక”మొదటి షెడ్యూల్ పూర్తి

మంత్ర మూవీ మేకర్స్ , ఫాల్కన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా, మహి - రాజ్ ద్వీయ దర్శకత్వంలో బెంగళూరు మహానగరంలో బాలక…

2 days ago

ఘనంగా ‘బ్లాస్ట్ జోన్’ ప్రెస్ మీట్.. మే 28న థియేటర్లలో భారీ విడుదల!

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్లాస్ట్…

2 days ago

నూతన ఆంధ్ర ప్రదేశ్ ఎఫ్డిసి కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఎఫ్డిసి సభ్యులుగా ఎన్నికైన వారి ప్రమాణస్వీకారం అలాగే అధికార బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విజయవాడలో సినీ…

2 days ago