ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా ఘనంగా “స్కై” సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్, ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా “స్కై”. పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. “స్కై” సినిమా ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “స్కై” సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

మ్యూజిక్ డైరెక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ – సినిమా ఇండస్ట్రీ మీద ప్యాషన్ తో చిన్న స్థాయి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాను. ఈ చిత్రానికి వర్క్ చేసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ పృథ్వీ పెరిచెర్ల గారికి థ్యాంక్స్. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ సినిమాకు మంచి మ్యూజిక్ చేయగలిగాను. పాటలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. అన్నారు.

నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – ఈ ఈవెంట్ కు వచ్చే ముందు “స్కై” సినిమా కంటెంట్, సాంగ్స్ చూశాను. ఆ కంటెంట్ చూస్తుంటే ఈ మూవీలో ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ చూడబోతున్నామని తెలుస్తోంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. రసూల్ ఎల్లోర్ గారి విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఈ సినిమాకు పెట్టిన క్యాప్షన్ తోనే మూవీ ఎస్సెన్స్ తెలుస్తోంది. “స్కై” సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గుంటక మాట్లాడుతూ – ఈ రోజు మా మూవీ ప్రెస్ మీట్ కు వచ్చిన మధుర శ్రీధర్ గారికి థ్యాంక్స్. “స్కై” సినిమాను మేమంతా ఎంతో కష్టపడి ప్రొడ్యూస్ చేశాం. టీమ్ అందరూ ప్యాషనేట్ గా వర్క్ చేశారు. హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉన్న ఒక కొత్త ప్రేమ కథను మా మూవీలో మీరంతా చూడబోతున్నారు. ఫిబ్రవరి 6న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. అన్నారు.

డైరెక్టర్ పృథ్వీ పెరిచెర్ల మాట్లాడుతూ – “స్కై” సినిమా షూటింగ్ కు ముందే అన్ని సాంగ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం. డీవోపీ రసూల్ గారు ఇచ్చిన సజెషన్స్ తో సినిమాను అనుకున్న టైమ్ లో కంఫర్ట్ గా కంప్లీట్ చేయగలిగాం. ఆయన గైడెన్స్ మాకు చాలా ఉపయోగపడింది. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. మా సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం. అన్నారు.

హీరో మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ – ఈ సినిమా ద్వారా నేను హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. వాస్తవంగా ఈ చిత్రానికి నిజమైన హీరోలు మా డైరెక్టర్ పృథ్వీ, నిర్మాతలు నాగిరెడ్డి, శ్రీలక్ష్మి. మా సినిమా కోసం టీమ్ చాలా కష్టపడింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ కు తీసుకొస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శివ ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ తన ప్యాషన్ తో ఇండస్ట్రీలోకి రాగలిగాడు. మా సినిమా నుంచి రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్ అన్నింటికీ మంచి ఆదరణ దక్కింది. థియేట్రికల్ గా కూడా ఇదే సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటి కేఎల్ కే మణి బామ్మ మాట్లాడుతూ – ఈ చిత్రంలో నేను సోది చెప్పే బామ్మ క్యారెక్టర్ లో నటించాను. రసూల్ గారు అందరితో పాటు నన్ను కూడా అందంగా స్క్రీన్ మీద చూపించారు. ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నమ్ముతున్నాం. అన్నారు.

హీరోయిన్ శృతి శెట్టి మాట్లాడుతూ – ఈ చిత్రంలో హీరోయిన్ ది చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. అలాంటి డెప్త్ ఉన్న క్యారెక్టర్ నేను పర్ ఫార్మ్ చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. రసూల్ గారు మా అందరినీ కలర్ ఫుల్ గా చూపించారు. ఈ సినిమాలో నటించడం మా అందరికీ ఒక బ్యూటిఫుల్ జర్నీ ఇచ్చింది. మీరంతా థియేటర్స్ లో మూవీ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

డీవోపీ రసూల్ ఎల్లోర్ మాట్లాడుతూ – “స్కై” సినిమాకు అంతా కొత్త వాళ్లు పనిచేశారు. నాకున్న ఎక్సిపీరియన్స్ తో వాళ్లకు గైడెన్స్ ఇచ్చాను. చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు వర్క్ చేయడం ఒక ఫ్యామిలీ ఫీల్ కలిగింది. మంచి లవ్ స్టోరీతో వస్తున్న చిత్రమిది. ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్ ఆకట్టుకుంటాయి. ఈ టీమ్ తో మళ్లీ కలిసి వర్క్ చేయాలని ఉంది. అన్నారు.

నటీనటులు – మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ భారతి, రాకేశ్ మాస్టర్, ఎంఎస్, కేఎల్ కే మణి బమ్మ, తదితరులు

టెక్నికల్ టీమ్

బ్యానర్ – వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – పృథ్వీ పెరిచెర్ల
డీవోపీ – రసూల్ ఎల్లోర్
ఎడిటర్ – సురేష్ ఆర్స్
పబ్లిసిటీ డిజైనర్ – కృష్ణ డిజిటల్స్
డిజిటల్ మీడియా – వినీత్ గౌడ్
ప్రొడ్యూసర్స్ – నాగిరెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు
డైలాగ్స్ , స్టోరీ – పృథ్వీ పెరిచెర్ల, మురళీ కృష్ణంరాజు
మ్యూజిక్ – శివ ప్రసాద్
లిరిక్స్ – పృథ్వీ పెరిచెర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – స్వాతి పెన్మెత్స, లిఖిత గుంటక
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

TFJA

Recent Posts

‘మన డాక్టర్ బాబే’ చిత్రం నుంచి ‘సోగ్గాడిలా’ అంటూ సాగే సాంగ్ రిలీజ్

శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…

20 hours ago

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలలో ఘన విజయం సాధించిన మన ప్యానెల్

తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…

20 hours ago

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

5 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

6 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 weeks ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago