వెర్సటైల్ హీరో తిరువీర్, టీనా శ్రావ్య జంటగా ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ సినిమాను సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం నవంబర్ 7 న గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో గురువారం నాడు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
హీరో తిరువీర్ మాట్లాడుతూ .. ‘‘ప్రీ వెడ్డింగ్ షో’కి సపోర్ట్ చేసిన ఇండస్ట్రీకి థాంక్స్. నవంబర్ 7న ఈ చిత్రం రాబోతోంది. ‘జార్జి రెడ్డి’, ‘మసూద’ కూడా ఇదే నెలలో రిలీజ్ అయ్యాయి. విలన్ నుంచి కో ప్రొడ్యూస్ చేసే స్థాయికి నేను ఎదిగాను. ఇచ్చిన ప్రేమ, సపోర్ట్ వల్లే ఇదంతా సాధ్యమైంది. కథ మీద, సినిమా వచ్చిన తీరు మీదున్న నమ్మకం, ధైర్యంతోనే రెండ్రోజుల ముందే ప్రీమియర్లు వేశాం. అలా నమ్మకంతో వేసిన ప్రీమియర్లకు అద్భుతమైన స్పందన వచ్చింది. మూవీకి వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈ పాజిటివ్ టాక్ను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేలా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నాం. చెప్పింది చెప్పినట్టుగా తీసి రాహుల్ విజయం సాధించారు. సురేష్ గారి మ్యూజిక్ ఈ మూవీకి ప్రాణంగా నిలిచింది. మంచి చిత్రాలను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. నవంబర్ 7న వస్తున్న చిత్రాలన్నీ పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు.
దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘గత ఏడాది నవంబర్ 7న ఫస్ట్ షాట్ చిత్రీకరించాం. ఇప్పుడు నవంబర్ 7న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఈ ఏడాదిలో టీం అంతా కలిసి ఫ్యామిలీలా పని చేశాం. గత రెండు నెలలుగా నేను చాలా టెన్షన్ పడ్డాను. భారీ ఓపెనింగ్స్ రావు.. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటూ ఉండేవాడిని. కానీ ప్రీమియర్లకు అద్భుతమైన స్పందన రావడం, మీడియా, ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ఆనందంగా అనిపించింది. ‘ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకు ఆడియెన్స్ పెట్టే ఖర్చుకు ఏ మాత్రం నిరాశచెందరు. ఈ మూవీని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇలా అందరితో కలిసి చూస్తే మరింతగా నచ్చుతుంది. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన తిరువీర్ గారికి, నిర్మాతలకు, నా టీంకి థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత సందీప్ అగరం మాట్లాడుతూ .. ‘మా డైరెక్టర్ రాహుల్ నన్ను నిర్మాతగా మార్చారు. ఈ కథే మా అందరినీ వెతుక్కుంటూ వచ్చింది. నాకు ఏ మాత్రం కష్టం తెలియకుండా ఈ మూవీని రాహుల్, తిరువీర్ భుజానికి ఎత్తుకున్నారు. నేను చేసే ప్రతీ సినిమాకు సురేష్ బొబ్బిలి అన్ననే తీసుకోవాలని అనుకుంటున్నాను’ అని అన్నారు.
హీరోయిన్ టీనా శ్రావ్య మాట్లాడుతూ .. ‘‘ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రానికి మీడియా మంచి సపోర్ట్ ఇస్తోంది. మాకు అండగా నిలిచిన నిర్మాతలందరికీ థాంక్స్. నాకు హేమ అనే మంచి పాత్రను ఇచ్చిన రాహుల్ గారికి థాంక్స్. తిరువీర్ గారి సహకారం నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ మూవీలో నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సురేష్ గారి పాటలకు నేను పెద్ద ఫ్యాన్ని. ప్రీమియర్లకు అద్భుతమైన స్పందన వచ్చింది.’ అని అన్నారు.
సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ .. ‘‘ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా షూటింగ్ అయిపోయిన తరువాత నన్ను ఈ ప్రాజెక్ట్లోకి తీసుకున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన తిరువీర్ అన్నకు థాంక్స్. ఆయన ఎంతో సహజంగా నటిస్తారు. ఇలానే కొత్త వారికి అవకాశాలు ఇస్తూ మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. టీనా, నరేంద్ర, యామినీ, రోహన్ ఇలా అందరూ అద్బుతంగా నటించారు. రాహుల్ అద్భుతమైన దర్శకుడు. ఒక చిన్న పాయింట్ పట్టుకుని సినిమాని గొప్పగా తీశారు’ అని అన్నారు.
మాస్టర్ రోహన్ మాట్లాడుతూ .. ‘‘ప్రీ వెడ్డింగ్ షో’ ప్రీమియర్ చూసి అభినందించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ప్రతీ ఒక్క తెలుగు ప్రేక్షకుడికి ఈ మూవీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన రాహుల్ అన్నకి థాంక్స్. నాకు సపోర్ట్ చేసిన తిరువీర్ అన్నకి థాంక్స్. నవంబర్ 7న మా చిత్రం థియేటర్లోకి రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…