బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్ మరియు సి ఆర్ ఎస్ క్రియేషన్స్ పతాకం పై జబర్దస్త్ అభి, ఛత్రపతి శేఖర్, స్వాతి మందల్ ముఖ్య తారాగణం తో యంగ్ టాలెంటెడ్ దర్శకుడు గంగ సప్త శిఖర దర్శకత్వంలో కె కె చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి మరియు చంద్ర సుబ్బగారి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ది డెవిల్స్ చైర్ (The Devil’s chair). అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క మొదటి పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా దర్శకుడు గంగ సప్త శిఖర మాట్లాడుతూ “సరైన హారర్ చిత్రం వచ్చి చాలా రోజులు అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా మంచి హారర్ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. హారర్ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు మా ది డెవిల్స్ చైర్ (The Devil’s chair) పర్ఫెక్ట్ సినిమా. సరికొత్త పాయింట్ తో టెక్నికల్ గా అద్భుతంగా ఉండే చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మా చిత్రం మంచి హిట్ అవ్వాలి” అని కోరుకున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ “మా ది డెవిల్స్ చైర్ (The Devil’s chair) చిత్రం మంచి కంటెంట్ ఉన్న చిత్రం. అద్భుతమైన ఏ ఐ టెక్నాలజీ తో సరికొత్త కథ తో నిర్మిస్తున్నాము. ప్రతి సీన్ ను అద్భుతంగా రిచ్ విజువల్స్ తో రూపొందిస్తున్నాం. షూటింగ్ అంతా పూర్తి అయింది. మా చిత్రాన్ని 2025 ఫిబ్రవరి చివరి వరం లో విడుదల చేస్తాము” అని తెలిపారు.
చిత్రం పేరు : ది డెవిల్స్ చైర్ (The Devil’s chair)
జానర్: హారర్ డ్రామా
రచయిత మరియు దర్శకుడు: గంగా సప్తశిఖర
నిర్మాణ సంస్థ: బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్, సి ఆర్ ఎస్ క్రియేషన్స్
నిర్మాతలు: KK చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి, చంద్ర సుబ్బగారి .
ముఖ్య నటులు:
జబర్దస్త్ అభి
ఛత్రపతి శేఖర్
స్వాతి మందల్
వెంకట్ దుగ్గి రెడ్డి
చంద్ర ఎస్
మురళి సర్వన్నగారి
అద్వైత చౌదరి
సాంకేతిక నిపుణులు
సంగీతం: బిషేక్
ఎడిటింగ్ & DI: హేమంత్ నాగ్
సినిమాటోగ్రఫీ: గంగా సప్తశిఖర
'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…