యారో సినిమాస్, డోలాముఖి సబ్బల్ట్రాన్ ఫిల్మ్స్ తమ లేటెస్ట్ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశాయి. ఇది రెండు నిర్మాణ సంస్థలకు సెకండ్ ప్రొడక్షన్ వెంచర్. వెరీ ట్యాలెంటెడ్ తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో చేస్తున్న ఈ కంప్లీట్ ఎంటర్ టైనర్ తో వంశీరెడ్డి దొండపాటిని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ప్రముఖ రైటర్, డైరెక్టర్ వేణు ఊడుగుల అడిషినల్ కంట్రిబ్యూషన్ తో బూసం జగన్ మోహన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంటర్ టైన్మెంట్, ఎమోషనల్ డెప్త్ తో కూడిన అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బ్యానర్స్పై రెండో ప్రొడక్షన్గా ఈ చిత్రం కథాపరంగా, ప్రొడక్షన్ క్యాలిటీలో న్యూ స్టాండర్డ్స్ ని సెట్ చేయడానికి సిద్ధంగా ఉంది.
శ్రీనివాస్ గౌడ్ అనే పాత్రను అతని భార్య శ్రీలత నుంచి విడాకులు తీసుకున్నట్లు సూచించే స్టాంప్ పేపర్తో యూనిక్ స్టయిల్ లో అనౌన్స్మెంట్ చేశారు.
ఈ సినిమా షూటింగ్ అక్టోబర్లో ప్రారంభం కానుంది. కొత్త టాలెంట్ని డిస్కవర్ చేయడానికి నటీనటుల కోసం టీమ్ ఓపెన్ కాస్టింగ్ కాల్ని అనౌన్స్ చేసింది
ఈ సినిమా టెక్నికల్ టీం, ఇతర వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు.
నటీనటులు: తరుణ్ భాస్కర్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వంశీరెడ్డి దొండపాటి
నిర్మాతలు: బూసం జగన్ మోహన్ రెడ్డి & వేణు ఊడుగుల
బ్యానర్స్: యారో సినిమాస్ & డోలాముఖి సబ్బల్ట్రాన్ ఫిల్మ్స్
పీఆర్వో: వంశీ-శేఖర్
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…