ప్రముఖ నటి, నిర్మాత శ్రీమతి సి. కృష్ణ వేణి మృతి పట్ల TFPC తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

ప్రముఖ తెలుగు సినిమా నటీమణి, నిర్మాత , గాయని, శోభనాచల స్టూడియో (చెన్న ) యజమాని అయిన శ్రీమతి సి. కృష్ణ వేణి (జననం 1924) ఫిబ్రవరి 16, 2025న హైదరాబాద్లో 102 సంవత్సరాల వయసులో మరణించారని, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి వారి కుటుంబానికి తీవ్ర సంతాపం తెలియజేస్తూ శ్రీమతి సి. కృష్ణ వేణి గారు, నిర్మాత శ్రీమతి ఎన్.ఆర్. అనురాధ దేవి తల్లి అని. శ్రీమతి సి. కృష్ణ వేణి తెలుగు సినిమా చరిత్రలో మిగిలి ఉన్న చివరి దిగ్గజాలలో ఒకరు అని, ఆమె “ధృవ విజయం” (1930) చిత్రంలో బాలనటిగా తన కెరీర్ను ప్రారంభించి, కచ దేవయాని (1938)లో హీరోయిన్గా అరంగేట్రం చేసిందని తెలియజేశారు. ఆమె మీర్జాపురం రాజు గారిని వివాహం చేసుకుని, అతని స్టూడియో “శోభనాచల స్టూడియోస్” పగ్గాలు చేపట్టింది. వారు తీసిన “మనదేశం” (1949) సినిమాలో శ్రీ ఎన్. టి. రామారావు గారిని సినిమా రంగానికి పరిచయం చేసారు. ఆమె మనదేశం (1949), మల్లిపెల్లి (1939), భీష్మ, బ్రహ్మరత్నం. గొల్లభామ (1947) వంటి ప్రముఖ చిత్రాలలో నటించారు. ఆమె శ్రీ ఎ.ఎన్.ఆర్ తో కలిసి “కీలుగుర్రం” (1949లో ద్విభాషా చిత్రం) చిత్రంలో నటించారు. దివంగత హీరో రాజ్కుమార్తో కన్నడ చిత్రాలు (భక్త కుంబర) మరియు తమిళ భాషలో కూడా సినిమాలు నిర్మించారు . శ్రీ ఎస్.వి. రంగారావు, శ్రీమతి అంజలి, శ్రీ ఘంటసాల, శ్రీ రమేష్ నాయుడు మరియు గాయని పి. లీల మరియు శ్రీమతి జిక్కి వంటి గొప్ప కళాకారులను వారి కెరీర్లలో ఉన్నత స్థాయికి తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.

ఆమె అమూల్యమైన సేవలకు గాను, శ్రీమతి సి. కృష్ణ వేణిని అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డుతో సత్కరించింది. ఆమెను అమెరికాలోని “తానా” సత్కరించింది. హైదరాబాద్లో జరిగిన ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల్లో శ్రీ బండారు దత్తాత్రేయ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు మరియు ఇతర ప్రముఖులు ఆమెను ఎంతో ఆధరిస్తూ సత్కరించారు. విజయవాడలో జరిగిన ఆమె “మనదేశం” చిత్రం వజ్రోత్సవ వేడుకల్లో శ్రీమతి సి. కృష్ణ వేణిని గారిని భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు, గారు తెలుగు చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన అద్భుతమైన సేవలను కొనియాడుతూ సత్కరించారు.

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక రత్నాన్ని కోల్పోయిందని ప్రస్తావిస్తూ వారి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తూ శ్రీమతి సి. కృష్ణ వేణి గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారు దేవుడిని ప్రార్ధించారు.

(టి. ప్రసన్న కుమార్)
గౌరవ కార్యదర్శి

Tfja Team

Recent Posts

గ్రాండ్‌గా జరిగిన ‘MRP – నీకెంత నాకెంత’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జూలై 17న రిలీజ్

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…

2 weeks ago

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను” టీజర్ రిలీజ్

తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…

2 weeks ago

నా కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా ‘రక్త చరిత్ర’-రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ

"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…

2 weeks ago

యతిరాజు పాత్రలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన శివాజీ

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…

2 weeks ago

సావిత్రి గారంటే తెలుగుతనం, అమ్మతనం ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో జయప్రద

సావిత్రి గారు అద్భుతాలకే అద్భుతం - ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో పద్మశ్రీ డా. బ్రహ్మానందం ఆంగ్లంలోకి…

2 weeks ago

‘ఐ, నోబడీ’ ప్రివ్యూ ప్రెస్ మీట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్*

‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ -మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్…

2 weeks ago