ఏప్రిల్ 22, 2020న బైసరన్ లోయలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను దారుణంగా చంపి, 20 మందికి పైగా గాయపరిచిన పహల్గామ్ ఉగ్రవాద దాడిపై తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని మరియు విచారాన్ని వ్యక్తం చేస్తోందని ఇందుమూలంగా తెలియజేయడమైనది. ఈ దాడిని యావత్ దేశం ఖండించింది, తమ బాధను వ్యక్తం చేసింది మరియు దోషులను వెంటనే శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరింది మరియు ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వానికి తమ మద్దతు ఎల్లప్పుడు ఉంటుంది అని ప్రతిజ్ఞ చేసింది.
ప్రభుత్వానికి పూర్తి మద్దతును అందిస్తున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉగ్రవాద నిర్మూలనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న గట్టి ప్రయత్నాలు మరియు కఠినమైన చర్యలను గుర్తిస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎల్లప్పుడు ప్రభుత్వానికి అండగా ఉంటుంది అని తెలియజేసింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ తమ విచారాన్ని వ్యక్తం పరుస్తూ మరియు బాధితులకు నివాళులు అర్పిస్తూ, ప్రభుత్వానికి మరియు బాధితుల కుటుంబాలకు తన మద్దతును తెలియజేయడానికి 2025 ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం సాయంత్రం 6.00 గంటలకు హైదరాబాద్లోని ఫిలిం నగర్ లోని రామానాయుడు కళామండపం నుండి కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహిస్తుందని తెలియజేయడమైనది.
(టి. ప్రసన్న కుమార్)
గౌరవ కార్యదర్శి
డైనమిక్ హీరో విష్ణు నటించిన ‘కన్నప్ప’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. గత ఏడాది రిలీజ్ అయిన…
-మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు - దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్ కె ఫిలిమ్స్,…
కరునాడ చక్రవర్తి డా. శివరాజ్కుమార్, డాలీ ధనంజయ, హేమంత్ ఎం రావు ప్రాజెక్ట్ '666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్' -…
▪️ వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'వనజీవి రామయ్య' మూవీ టీమ్ సమక్షంలో ఘనంగా వనజీవి 90 వ జయంతి సందర్భంగా…
హైదరాబాద్:ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలను ఎండగట్టే ఉత్కంఠ రేపుతూ ఆసక్తికరంగా సాగే కథనంతో తెలుగు తెరపైకి ఓ సినిమా రాబోతుంది. రాజేష్…
▪️తెలుగు సినీ పరిశ్రమలో తొలి పూర్తి స్థాయి AI మూవీ▪️విడుదలకు సిద్ధమవుతూ ప్రచార పర్వం ప్రారంభంహైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో…