2024 తెలంగాణ టెలివిజన్ అవార్డుల కమిటీని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం- చైర్మన్‌గా శరత్ మరార్ నియామకం

తెలంగాణ ప్రభుత్వం టెలివిజన్ రంగంలో ప్రతిభను గుర్తించి సత్కరించేందుకు తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్‌ 2024” నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ అవార్డ్స్‌కు సంబంధించిన విధానాలు, నియమావళి, లోగో రూపకల్పన వంటి అంశాలను ఖరారు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

15 మంది సభ్యుల కమిటీకి TGFDC MD కన్వీనర్‌గా ఉంటారు. నిర్మాత శరత్ మరార్ ఛైర్మన్‌గా, ఈ కమిటీలో టెలివిజన్ పరిశ్రమ నుండి కె. బాపినీడు, మంజుల నాయుడు, పి. కిరణ్ సహా ప్రముఖ సభ్యులు ఉంటారు.

అన్ని విభాగాలలో పారదర్శకత, సమగ్రత, సృజనాత్మక నైపుణ్యాన్ని నిర్ధారించడానికి అవార్డుల ఫ్రేమ్ వర్క్, విజన్ ని రూపొందించే బాధ్యతను ప్యానెల్‌కు అప్పగించారు.

ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సినీ, టెలివిజన్‌ రంగాల్లో ప్రతిభా ప్రదర్శనకు కేంద్రంగా ఎదుగుతోంది. ‘తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్‌ 2024’ ద్వారా స్థానిక సృజనాత్మక ప్రతిభను గౌరవించే వేదికను అందిస్తున్నాం. ఇది సృజనాత్మకతను, స్థానిక ప్రతిభను ప్రోత్సహించే ప్రభుత్వ సంకల్పానికి ప్రతీక.

ఈ చొరవ రాష్ట్ర ప్రభుత్వం చలనచిత్రం, టెలివిజన్, ఎంటర్టైన్మెంట్ ఎకోసిస్టంను బలోపేతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగం.

సినిమా, టెలివిజన్‌, ఎంటర్టైన్మెంట్ రంగాల అభివృద్ధికి ప్రభుత్వ కృషిలో భాగంగా ఈ అవార్డులు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు. కథనం, సాంకేతిక నైపుణ్యం, నటనలో ఉన్నతతను గుర్తించే ఈ అవార్డులు, తెలంగాణ టెలివిజన్‌ పరిశ్రమ స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లే మైలురాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

TFJA

Recent Posts

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి సెల్యూట్ చేస్తూ హీరో తిరువీర్ “భగవంతుడు” మూవీ నుంచి ‘శరణమన్న శరణం’ సాంగ్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ…

12 hours ago

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకప్పుడు అగ్ర కథానాయిక గా వెలుగొందారు మంజుల. ఎన్టీఆర్ తో మనుషులంతా ఒక్కటే, మగాడు,…

2 days ago

ఫుల్ మార్క్స్ సాధించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్

'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రాబోతుందో తెలుసుకోవాలనే…

3 days ago

“ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్ లాంచ్ అగ్ర నటి పాయల్ రాజ్ పుత్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది

హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా అయినా భారతదేశంలోనే…

3 days ago

అపోలో నూతన ఆసుపత్రిని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అపోలో హాస్పిటల్స్ భారతదేశంలో తన 76వ ఆసుపత్రిని ప్రారంభించింది. హైదరాబాద్‌లో సాంకేతికంగా అధునాతనమైన ఈ ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని ఆవిష్కరించింది.…

3 days ago

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్, రిసిప్ శెట్టి ఫిలిమ్స్, బ్యానర్ లో ఎమ్ అచ్చిబాబు సమర్పణలో‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా…

5 days ago