క్రిస్మ‌స్ బ‌రిలో వృష‌భ‌… అత్య‌ద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియ‌న్స్‌కి అంతా రెడీ!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రూ ఎదురుచూస్తున్న వృష‌భ రిలీజ్ డేట్‌ని క‌న్‌ఫ‌ర్మ్ చేశారు మేక‌ర్స్. ఈ ఏడాది క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇంత‌కుమునుపెన్న‌డూ ప్రేక్ష‌కులు ఆస్వాదించ‌ని విజువ‌ల్స్ తో అత్య‌ద్భుతంగా సిద్ధ‌మ‌వుతోంది వృష‌భ‌.
తండ్రీ కొడుకుల మ‌ధ్య అంద‌మైన, గాఢ‌మైన అనుబంధాన్ని ఆవిష్క‌రిస్తూ, ప్రేమ‌, విధి, ద్వేషం వంటి ఎమోష‌న్స్ ని స‌మ‌ర్థ‌వంతంగా డీల్ చేసిన సినిమా వృష‌భ‌. నంద‌కిశోర్ ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తుంది.

అత్యంత భారీ వ్య‌యంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. గ్రాండ్ విజువ‌ల్ ఎఫెక్ట్స్, ప్ర‌తి చిన్న విష‌యాన్నీ జాగ్ర‌త్త‌గా డీల్ చేయాల్సిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయించారు మేక‌ర్స్. క్వాలిటీ విష‌యంలో మేం ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. సినిమా ల‌వ‌ర్స్ కి ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్ పీరియ‌న్స్ ఇవ్వాల‌న్న‌దే మా నిబ‌ద్ధ‌త‌. అందుకే సినిమాను క్రిస్మ‌స్ బ‌రిలో తీసుకొస్తున్నాం. ప‌ర్ఫెక్ట్ ఫెస్టివ‌ల్ గిఫ్ట్ అవుతుంది. విశ్వ‌వ్యాప్తంగా ఉన్న లాల్ ఏట్ట‌న్ అభిమానుల‌కు, మూవీ ల‌వర్స్ కి క‌న్నుల‌పండువ‌గా ఉంటుంది అని చెప్పారు మేక‌ర్స్.
క్రిస్మ‌స్ బ‌రిలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నామ‌నే విష‌యాన్ని మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేసి అనౌన్స్ చేశారు నిర్మాత‌లు.

మోహ‌న్‌లాల్‌, స‌మ‌ర్జిత్ లంకేష్‌, రాగిణి ద్వివేది, న‌య‌న్ సారిక‌, అజ‌య్‌, నేహా స‌క్సేనా ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శామ్ సీయ‌స్ సంగీతం అందిస్తున్నారు. అకాడెమీ అవార్డ్ విన్న‌ర్ ర‌సూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ చేస్తున్నారు. ఎస్ ఆర్ కె, జ‌నార్ద‌న్ మ‌హ‌ర్షి, కార్తిక్ డైలాగులు అందిస్తున్నారు. పీట‌ర్ హెయిన్స్, స్టంట్ శివ‌, గ‌ణేష్‌, నిఖిల్ హై ఆక్టేన్ యాక్ష‌న్‌ని కొరియోగ్ర‌ఫీ చేశారు.

క‌నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్.య‌స్‌ స‌మ‌ర్పిస్తున్నారు. వ్యాస్ స్టూడియోస్ నిర్మిస్తోంది. శోభా క‌పూర్‌, ఏక్తా ఆర్ క‌పూర్‌, సి.కె.ప‌ద్మ‌కుమార్‌, వ‌రుణ్ మాథుర్‌, సౌర‌భ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్‌, ప్ర‌వీర్ సింగ్‌, విశాల్ గుర్ణ‌ని, జుహి ప‌రేఖ్ మెహ‌తా నిర్మిస్తున్నారు. విమ‌ల్ ల‌హోటి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

యాక్ష‌న్‌, ఎమోష‌న్‌, విజువ‌ల్ గ్రాండియ‌ర్ క‌ల‌గ‌లిసిన అత్య‌ద్భుత‌మైన ఎపిక్ సినిమాటిక్ జ‌ర్నీగా వృష‌భ‌ను తీర్చిదిద్దుతున్నారు. మ‌ల‌యాళం, తెలుగులో ఏక స‌మ‌యంలో చిత్రీక‌రించారు. హిందీ, క‌న్న‌డ‌లోనూ విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

TFJA

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

5 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

7 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago