సర్వైవల్ కామెడీ జానర్లో పూర్తి వినోదాత్మక చిత్రంగా ‘నమో’ అనే సినిమా రాబోతోంది. విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలు విస్మయ హీరోయిన్గా శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఏ ప్రశాంత్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంతో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీ జూన్ 7న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
విశ్వంత్, అనురూప్ కాంబోలో హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ మూవీ నుంచి వదిలిన పోస్టర్, టీజర్ అన్నీ కూడా ఆడియెన్స్ను ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ను ప్రకటించారు. జూన్ 7న సినిమాను విడుదల చేయబోతోన్నట్టుగా రిలీజ్ చేసిన పోస్టర్లో హీరోలిద్దరూ వింత ఎక్స్ప్రెషన్స్ పెట్టి కనిపిస్తున్నారు.
ఈ చిత్రానికి కెమెరామెన్గా రాహుల్ శ్రీవాత్సవ్ మ్యూజిక్ డైరెక్టర్గా క్రాంతి ఆచార్య వడ్లూరి ఎడిటర్గా సనల్ అనిరుధన్ పని చేశారు.
తారాగణం : విశ్వంత్ దుద్ధుంపూడి, అనురూప్ కటారి, విస్మయ తదితరలు
సాంకేతిక బృందం
బ్యానర్ : శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
నిర్మాత : ఏ. ప్రశాంత్
దర్శకులు : ఆదిత్య రెడ్డి కుందూరు
కెమెరామెన్ : రాహుల్ శ్రీవాత్సవ్
సంగీతం : క్రాంతి ఆచార్య వడ్లూరి
ఎడిటర్ : సనల్ అనిరుధన్
పీఆర్వో : ఎస్ ఆర్ ప్రమోషన్స్ (సాయి సతీష్)
విజయ్ ఆంటోని, శశి దర్శకత్వంలో వచ్చిన ‘బిచ్చగాడు’, అందులోని అమ్మ పాటకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇప్పటికీ అమ్మ…
ప్రఖ్యాత దర్శకులు దాసరి నారాయణరావు మరణానంతరం ఆయన పేరిట ప్రతి ఏటా ఘనంగా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తున్న ప్రముఖ నిర్మాత…
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది…
యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ…
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకప్పుడు అగ్ర కథానాయిక గా వెలుగొందారు మంజుల. ఎన్టీఆర్ తో మనుషులంతా ఒక్కటే, మగాడు,…
'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రాబోతుందో తెలుసుకోవాలనే…