సూపర్ స్టార్ మహేష్ బాబు కల్ట్ క్లాసిక్ ‘ఖలేజా’ ప్రీ సేల్ సక్సెస్ మీట్

సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా మే 30 న ఖలేజా చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ-రిలీజ్ కు రంగం సిద్దం అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఖలేజా రీ రిలీజ్ సందర్భంగా ప్రీ సేల్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఖలేజా నిర్మాతలు శింగనమల రమేశ్, సి. కళ్యాణ్, కృష్ణ గారి సోదరులు ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరి రావు, కమెడియన్ అలీ, సునీల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆదిశేషగిరి రావు గారు మాట్లాడుతూ… నిర్మాతలిద్దరితో చాలా మంచి అనుబంధం ఉందన్నారు. పోకిరి సినిమాతో రీ రిలీజ్ మొదలైందన్నారు. ఈ సినిమాను సుబ్బారావు రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. రీరిలీజ్ వలన నిర్మాతలు సంతోషంగా ఉంటున్నారు, ఖలేజాకు మంచి ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు.

నిర్మాత సీ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఖలేజా సినిమా రీ రిలీస్ అవుతున్న సందర్భంగా కనకరత్న మూవీస్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. సినిమా చాలా కష్టపడి తీసినట్లు చెప్పారు. సినిమాలో ప్రతీ సీన్ చాలా అద్భుతంగా ఉంటుందన్నారు. సినిమాలో త్రివిక్రమ్, మహేష్ బాబు, నమ్రత అందరూ ఒక టీంలా పనిచేశారు అన్నారు. ఇప్పటికి 1500 సార్లు బుల్లి తెరమీద ప్రదర్శించి రికార్డ్ సృష్టించిన సినిమా ఖలేజా అని సీ కళ్యాణ్ చెప్పారు. ఇప్పటికి యూత్ ఈ సినిమాను చూడడానికి ఇష్టపడుతున్నారు. సినిమాలో ఉన్న సీతారాం పాత్ర మహేష్ బాబు కు చాలా దగ్గర ఉంటుందన్నారు. సినిమాను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అన్నారు. మే 30 వ తేదీన థియేటర్ లు బద్దలు అవుతాయి అన్నారు. రీ రిలీజ్ సినిమాల్లో ఈ సినిమా సరికొత్త రికార్డ్ క్రేయేట్ చేస్తుంది అన్నారు. అలాగే నిర్మాత శింగనమల రమేష్ మాట్లాడుతూ.. సినిమా అందరిని అలరిస్తుంది అని చెప్పారు.

అలీ మాట్లాడుతూ.. సినిమాను తీయడానికి నిర్మాతలు చాలా కష్టపడ్డారు అన్నారు. ఖలేజా సినిమా టీవీ లలో రికార్డ్ క్రియేట్ చేసింది అన్నారు. ఏ దేశం వెళ్లిన ఖలేజా గురించి మాట్లాడుతారు అని అన్నారు. సినిమాను త్రివిక్రమ్, మహేష్ బాబు ప్రాణం పెట్టి చేశారు అన్నారు. ఈ సినిమాను రీ రిలీజ్ అనడం కన్నా డైరెక్ట్ రిలీజ్ అంటే బెటర్ అని అన్నారు. సినిమాకు ఇప్పటికి కల్ట్ ఫాన్స్ ఉన్నారు అని, మే 30 థియేటర్ లో చూద్దాం అని అన్నారు.

ఏసియన్ సునీల్ నారాయణ మాట్లాడుతూ.. ఈ సినిమా ఫ్రెష్ రిలీజ్ లా ఉందన్నారు. ఓపెన్ చేసిన నిముశాలలొనే టికెట్స్ బుక్ అవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

నటీనటులు: మహేష్ బాబు, అనుష్క శెట్టి, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు, షఫీ తదితరులు
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతలు :శింగనమల రమేశ్, సి. కళ్యాణ్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ : యష్ భట్, సునీల్ పటేల్
ఎడిటర్ : ఎ. శ్రీకర్ ప్రసాద్
పీఆర్ఓ: హరీష్, దీనేష్

Tfja Team

Recent Posts

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి సెల్యూట్ చేస్తూ హీరో తిరువీర్ “భగవంతుడు” మూవీ నుంచి ‘శరణమన్న శరణం’ సాంగ్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ…

12 hours ago

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకప్పుడు అగ్ర కథానాయిక గా వెలుగొందారు మంజుల. ఎన్టీఆర్ తో మనుషులంతా ఒక్కటే, మగాడు,…

2 days ago

ఫుల్ మార్క్స్ సాధించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్

'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రాబోతుందో తెలుసుకోవాలనే…

3 days ago

“ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్ లాంచ్ అగ్ర నటి పాయల్ రాజ్ పుత్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది

హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా అయినా భారతదేశంలోనే…

3 days ago

అపోలో నూతన ఆసుపత్రిని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అపోలో హాస్పిటల్స్ భారతదేశంలో తన 76వ ఆసుపత్రిని ప్రారంభించింది. హైదరాబాద్‌లో సాంకేతికంగా అధునాతనమైన ఈ ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని ఆవిష్కరించింది.…

3 days ago

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్, రిసిప్ శెట్టి ఫిలిమ్స్, బ్యానర్ లో ఎమ్ అచ్చిబాబు సమర్పణలో‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా…

5 days ago