సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “రాజయోగం” . ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్నారు. ఒక వైవిధ్యమైన కథాంశంతో దర్శకుడు రామ్ గణపతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.
తాజాగా ఈ సినిమాలోని ‘చూడు చూడు’ పాటను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ పాటకు రెహమాన్ సాహిత్యాన్ని అందించగా అరుణ్ మురళీధరన్ స్వరపర్చారు. కౌషిక్ మీనన్, నిత్యా మమ్మెన్ పాడారు.
ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ…”రాజయోగం” టైటిల్ చాలా బాగుంది. ట్రైలర్ చూశాను గ్రాండ్ గా సినిమాను తెరకెక్కించారు. చూడు చూడు పాటను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. పాట సౌండింగ్, పిక్చరైజేషన్ ఆకట్టుకున్నాయి. పేరుకు తగ్గట్లే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
ఇటీవల దర్శకుడు మారుతి విడుదల చేసిన “రాజయోగం” ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పాటలు, ట్రైలర్ బాగుండటంతో సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి.
అజయ్ ఘోష్, ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, సిజ్జు, మధునందన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – విజయ్ సి కుమార్, ఎడిటర్ – కార్తీక
శ్రీనివాస్, సంగీతం – అరుణ్ మురళీధరన్, డైలాగ్స్ – చింతపల్లి రమణ, పీఆర్వో – జీఎస్కే మీడియా, సహ నిర్మాతలు – డాక్టర్ శ్యామ్ లోహియా, నందకిషోర్ దారక్, నిర్మాత – మణి లక్ష్మణ్ రావు, రచన దర్శకత్వం – రామ్
గణపతి.
'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…