ఫూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకం పై వంశీ దర్సకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన మరో కళాత్మక కావ్యం ” సితార ” . ఈ చిత్రం విదుదలయ్యి నేటికి 40 సంవత్సరాలు అయ్యింది.
ఏప్రిల్ 27, 1984 న ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో విడులయ్యింది . పూర్ణోదయా చిత్రాలైన తాయరమ్మా బంగరయ్య , శంకరాభరణం, సీతాకొకచిలక చిత్రాలకు దర్శక శాఖలో పని చేసిన వంశీ లో ఉన్న ప్రతిభను గుర్తించిన ఏడిద, వంశీ కి ఈ అవకాశం ఇచ్చారు . వంశీ రచించిన ” మహల్లో కోకిల ” నవల ఆదారంగా ఈ చిత్రం నిర్మించడం జరిగింది.
ఆప్పుడప్పుడే నటునిగా పైకి వస్తున్న హీరో సుమన్ ఈ చిత్ర కదానాయకుడు . ఈ చిత్రంతో భానుప్రియ చిత్రసీమకు పరిచయం అయ్యింది . ఒకప్పుడు రాజభోగం అనుభవించిన రాజా గారి వంశం ఇప్పుడు దీన స్థితిలో ఉన్నా , బయట ప్రపంచానికి మాత్రం తమ పరిస్తితులు తెలియనియ్యకుండా రాజవంశపు ఆచారాలు , ఘోషాలు, అలాగే ప్రదర్శిస్తూ ఉండే యువరాజా వారి పాత్రను ప్రముఖ నటుడు శరత్ బాబు అత్యత్భుతంగా పోషించి , తన సినీ కెరీర్లోనే ఓ గొప్ప పాత్రగా మిగిలి పోయేలా నటించారు . అలాగే శుభలేఖ సుదాకర్, ఏడిద శ్రీరాం , జే.వీ . సొమయాజులు , సాక్షి రంగారావు , రాళ్ళపల్లి , తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.
ఈ చిత్రానికి వంశీ దర్శక ప్రతిభకు అణుగుణంగా మేస్త్రో ఇళయరాజా స్వరపరిచిన సంగీతం ఓ ప్రాణం. పాటలన్నీ ఒక ఎత్తైతే , ఈ చిత్రంలో వచ్చే silent visuals కి ఆయన చేసిన రీ రికార్డింగ్ చిత్రాన్ని మరో ఎత్తుకి తీసుకు వెళ్ళింది, అలాగే ఎం.వీ. రఘు చాయాగ్రహణం , అనిల్ మల్నాడ్ ఎడిటింగ్.
సితార అప్పట్లో 11 కేంద్రాల్లొ 100 రోజులు ప్రదర్శింపబడింది . అలాగే 3 జాతీయ అవార్డులు గెలుచుకొంది . ఉత్తమ తెలుగు చిత్రం , వెన్నెల్లో గోదారీ అందం పాటకు గాను , ఎస్.జానకి కి ఉత్తమ నేపద్య గాయని , అనిల్ మల్నాడ్ కి ఉత్తమ ఎడిటర్ అవార్డులు గెలుచుకున్నారు . Indian Panorama లో ప్రదర్శింపబడిన ఈ చిత్రం రష్యన్ భాషలో డబ్ చేసి అక్కడ విడుదల చెయ్యబడింది. అలాగే ఎన్నో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంది . ఇప్పటికీ ఈ చిత్రం తెలుగు చలన చిత్రాల్లో ఓ Cult Classic గా మిగిలిపోయింది .
మోస్ట్ టాలెంటెడ్, ఎనర్జిటిక్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నా వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్పై యతి నిర్మాతగా…
‘కోర్ట్’, ‘బ్యాండ్ మేళం’ అంటూ యంగ్ అండ్ టాలెంట్ నటుడు హర్ష్ రోషన్ వరుస విజయాలతో దూసుకుపోతోన్నారు. హర్ష్ రోషన్,…
దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ ఫ్రాంచైజీ "మిర్జాపూర్ : ది మూవీ" టీజర్ విడుదలైంది. ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన…
▪️ ప్రసాద్ ల్యాబ్స్లో సినీ ప్రముఖుల సమక్షంలో వేడుక▪️ జూలై 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల▪️ హీరోయిన్గా వెండితెరకు ఈటీవీ…
కేఎం (కృష్ణమోహన్), పూజా సుందర్ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం 'ఇట్స్ లైఫ్ బ్రో'. కేఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సోమశేఖర్…
ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్…