ఫూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకం పై వంశీ దర్సకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన మరో కళాత్మక కావ్యం ” సితార ” . ఈ చిత్రం విదుదలయ్యి నేటికి 40 సంవత్సరాలు అయ్యింది.
ఏప్రిల్ 27, 1984 న ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో విడులయ్యింది . పూర్ణోదయా చిత్రాలైన తాయరమ్మా బంగరయ్య , శంకరాభరణం, సీతాకొకచిలక చిత్రాలకు దర్శక శాఖలో పని చేసిన వంశీ లో ఉన్న ప్రతిభను గుర్తించిన ఏడిద, వంశీ కి ఈ అవకాశం ఇచ్చారు . వంశీ రచించిన ” మహల్లో కోకిల ” నవల ఆదారంగా ఈ చిత్రం నిర్మించడం జరిగింది.
ఆప్పుడప్పుడే నటునిగా పైకి వస్తున్న హీరో సుమన్ ఈ చిత్ర కదానాయకుడు . ఈ చిత్రంతో భానుప్రియ చిత్రసీమకు పరిచయం అయ్యింది . ఒకప్పుడు రాజభోగం అనుభవించిన రాజా గారి వంశం ఇప్పుడు దీన స్థితిలో ఉన్నా , బయట ప్రపంచానికి మాత్రం తమ పరిస్తితులు తెలియనియ్యకుండా రాజవంశపు ఆచారాలు , ఘోషాలు, అలాగే ప్రదర్శిస్తూ ఉండే యువరాజా వారి పాత్రను ప్రముఖ నటుడు శరత్ బాబు అత్యత్భుతంగా పోషించి , తన సినీ కెరీర్లోనే ఓ గొప్ప పాత్రగా మిగిలి పోయేలా నటించారు . అలాగే శుభలేఖ సుదాకర్, ఏడిద శ్రీరాం , జే.వీ . సొమయాజులు , సాక్షి రంగారావు , రాళ్ళపల్లి , తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.
ఈ చిత్రానికి వంశీ దర్శక ప్రతిభకు అణుగుణంగా మేస్త్రో ఇళయరాజా స్వరపరిచిన సంగీతం ఓ ప్రాణం. పాటలన్నీ ఒక ఎత్తైతే , ఈ చిత్రంలో వచ్చే silent visuals కి ఆయన చేసిన రీ రికార్డింగ్ చిత్రాన్ని మరో ఎత్తుకి తీసుకు వెళ్ళింది, అలాగే ఎం.వీ. రఘు చాయాగ్రహణం , అనిల్ మల్నాడ్ ఎడిటింగ్.
సితార అప్పట్లో 11 కేంద్రాల్లొ 100 రోజులు ప్రదర్శింపబడింది . అలాగే 3 జాతీయ అవార్డులు గెలుచుకొంది . ఉత్తమ తెలుగు చిత్రం , వెన్నెల్లో గోదారీ అందం పాటకు గాను , ఎస్.జానకి కి ఉత్తమ నేపద్య గాయని , అనిల్ మల్నాడ్ కి ఉత్తమ ఎడిటర్ అవార్డులు గెలుచుకున్నారు . Indian Panorama లో ప్రదర్శింపబడిన ఈ చిత్రం రష్యన్ భాషలో డబ్ చేసి అక్కడ విడుదల చెయ్యబడింది. అలాగే ఎన్నో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంది . ఇప్పటికీ ఈ చిత్రం తెలుగు చలన చిత్రాల్లో ఓ Cult Classic గా మిగిలిపోయింది .
-"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్…
ఫోనిక్స్ పిక్చర్స్ బ్యానర్పై, మాస్టర్ జియాన్స్ సమర్పణలో సత్యం రాజేష్, రియా సచ్యదేవ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న “ఫ్రెండ్లీ ఘోస్ట్”…
ఐశ్వర్య సినీ క్రియేషన్స్ బ్యానర్పై సింధుసూర్య నిర్మిస్తున్న నూతన చిత్రం 'శివ గాడి జిందగీ'. సచిన్ రామ్ ప్రతాప్, హాసిని…
ది మేజ్" చిత్రంతో దర్శకుడిగా డాక్టర్ కాబోయి యాక్టర్ కావడం చూస్తుంటాం కానీ డా. రవికిరణ్ గడలాయ్ ఎం.డి, పాథాలజిస్ట్…
ఎంఎస్ రాజు గారు ‘అగధ’ సీక్వెల్ ఎప్పుడు అంటారో చూడాలి - హీరో శ్రవణ్ రెడ్డి శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్…
హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని…