ఫిబ్రవరి 15న గ్రాండ్‌గా సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్

ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది. ఈ కాన్సర్ విశేషాల్ని తెలియజేసేందుకు మూవ్78 లైవ్ సంస్థ సీఈవో నితిన్ కనకరాజ్, సింగర్ సిధ్ శ్రీరామ్ మీడియా ముందుకు వచ్చారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో..

సింగర్ సిధ్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘గత పదేళ్ల నుంచి తెలుగు ఆడియెన్స్ ఎంతో ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. నాకు తెలుగులోనే ఎక్కువ మంది అభిమానులున్నారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ చేశాను. మళ్లీ ఇప్పుడు చేయబోతోన్నాం. ఈ కాన్సర్ట్‌లో నా పాటలతో పాటుగా 80, 90వ దశకంలో వచ్చిన మెలోడీ పాటల్ని కూడా పాడతాను. నేను ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాను. నాకు ఓ ఏడాది టైం ఇవ్వండి తెలుగులో ఫ్లూయెంట్‌గా మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను’ అని అన్నారు.

నితిన్ కనకరాజ్ మాట్లాడుతూ.. ‘సిధ్ శ్రీరామ్‌తో మూడేళ్ల తరువాత మళ్లీ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నాం. ఫిబ్రవరి 15న ఈ ఈవెంట్‌ను నిర్వహించబోతోన్నాం. ఈ కాన్సర్ట్ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం, యూత్ కోసం ఏర్పాటు చేస్తున్నాం.నాకు పర్సనల్‌గా సిధ్ శ్రీరామ్ అంటే చాలా ఇష్టం. ఈ జనరేషన్‌కు సిధ్ అంటే చాలా ఇష్టం. ఈ ఈవెంట్‌, లైవ్ కాన్సర్ట్ అద్భుతంగా ఉండబోతోంది. గ్రూపుగా టికెట్లు బుక్ చేసుకుంటే డిస్కౌంట్ కూడా ఉంటుంది’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి సెల్యూట్ చేస్తూ హీరో తిరువీర్ “భగవంతుడు” మూవీ నుంచి ‘శరణమన్న శరణం’ సాంగ్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ…

20 hours ago

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకప్పుడు అగ్ర కథానాయిక గా వెలుగొందారు మంజుల. ఎన్టీఆర్ తో మనుషులంతా ఒక్కటే, మగాడు,…

2 days ago

ఫుల్ మార్క్స్ సాధించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్

'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రాబోతుందో తెలుసుకోవాలనే…

3 days ago

“ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్ లాంచ్ అగ్ర నటి పాయల్ రాజ్ పుత్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది

హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా అయినా భారతదేశంలోనే…

3 days ago

అపోలో నూతన ఆసుపత్రిని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అపోలో హాస్పిటల్స్ భారతదేశంలో తన 76వ ఆసుపత్రిని ప్రారంభించింది. హైదరాబాద్‌లో సాంకేతికంగా అధునాతనమైన ఈ ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని ఆవిష్కరించింది.…

3 days ago

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్, రిసిప్ శెట్టి ఫిలిమ్స్, బ్యానర్ లో ఎమ్ అచ్చిబాబు సమర్పణలో‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా…

5 days ago