తెలుగు సినిమా లోకానికి, తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు శివాజీ. నటుడిగా, హీరోగా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. ఎంతో మంది కుర్ర హీరోలకు తన గాత్రాన్ని ఇచ్చి నిలబెట్టారు. శివాజీ తన కెరీర్లో డబ్బింగ్ చెప్పింది కొంత మందికే అయినా అందులో ఆయన మార్క్ ఎప్పటికీ ప్రేక్షకుల్లో నిలిచే ఉంటుంది. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ, యాక్షన్ ఇలా అన్ని రకాల కథలతో ఆడియెన్స్ని ఆయన ఆకట్టుకున్నారు. అయితే సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన బిగ్ బాస్ షోతో మళ్లీ కెరీర్ను ప్రారంభించారు. బిగ్ బాస్ షోతో శివాజీ ప్రతీ ఇంటి గడపలోకి, తెలుగు వారి మనసుల్లో మళ్లీ స్థానాన్ని సంపాదించుకున్నారు.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన శివాజీకి ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు వచ్చాయి. అయితే శివాజీ మాత్రం తనకు నచ్చిన, మెచ్చిన కథల్ని ఆచితూచి ఎంచుకుంటూ ఉన్నారు. శివాజీ ఓ కథను ఒప్పుకున్నారంటే ఆ సినిమాను తప్పకుండా చూడాల్సిందే అనేలా ప్రేక్షకుల్లో నమ్మకాన్ని ఏర్పర్చుకున్నారు. శివాజీ ఓ మూవీ చేస్తున్నాడంటే.. అందులో కంటెంట్ ఎంతో గొప్పగా ఉంటుందనే పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో చేసిన ‘కోర్ట్’, ‘దండోరా’ చిత్రాలకు అవార్డులు వచ్చాయి.
90స్ మూవీతో శివాజీ ఓటీటీ ఆడియెన్స్ని సైతం మెప్పించారు. ఇక ఆ సిరీస్కు సీక్వెల్గా ‘ఎపిక్’ అనే మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ శివాజీ తన నటనతో అందరినీ ఆకట్టుకోబోతోన్నారు. అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న ‘లెనిన్’ చిత్రంలోనూ ఓ కొత్త తరహా పాత్రను పోషిస్తున్నారు. ఇవే కాకుండా ఇంకో క్రేజీ ప్రాజెక్ట్లు లైనప్లో ఉన్నాయి. ఇలా చేతినిండా ప్రాజెక్టులతో శివాజీ బిజీగా ఉన్నారు. వచ్చిన ప్రతీ కథకు ఓకే చెప్పకుండా.. తన మనసుకు నచ్చిన కథల్ని మాత్రమే చేస్తూ తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. అలాంటి శివాజీ గారు మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుందాం.
చిన్న చిత్రాలకు థియేటర్స్ లభించని పరిస్థితులు ఇండస్ట్రీలో చూస్తున్నాం. అలాగే చిన్న నిర్మాతలు తమ సినిమాలను థియేటర్స్ లో రిలీజ్…
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 'ఇరుముడి'. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం #RAPO23 అధికారికంగా లాంచ్ చేశారు. ఎన్నో ఏళ్ల పాషన్,…
సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ ప్రాజెక్ట్గా విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. స్వర్గీయ ఆర్…
అక్టోబర్ 2న వెంకటేష్-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదల తెలుగు సినీ ప్రియులు ఎంతగానో…
కర్ణాటక..చిక్కబళ్ళాపుర జిల్లా చింతామణి లో నివసించిన గాయత్రమ్మ ఆంజినప్పవాళ్ళ నిర్మాణంలో నవనారాయణ క్రియేషన్స్ బ్యానర్లో కాగితం పడవలు సినిమాను నిర్మించారు…