ఆది సాయికుమార్ నటించిన రీసెంట్ సూపర్ హిట్ మూవీ ‘శంబాల’ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చి అద్భుత ఆదరణ సొంతం చేసుకుంటోంది. గత నెల 22వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా 100 మిలియన్ మినిట్స్ ఫ్లస్ వ్యూయర్ షిప్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కించుకుంటోంది.

గతేడాది డిసెంబర్ 25న ‘శంబాల’ సినిమా మిస్టికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులు ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు యుగంధర్ ముని రూపొందించారు. అర్చన ఐయ్యర్ హీరోయిన్ గా నటించింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్స్ లో సాధించిన విజయాన్ని మరిపించేలా ఆహా ఓటీటీలో శంబాల సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తుండటం విశేషం.

