సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో విప్లవ్ కోనేటి దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రం ” తెలిసినవాళ్ళు” . విభిన్న కథాంశంతో రొమాన్స్ – ఫ్యామిలీ – థ్రిల్లర్ జోనర్స్ కలసిన ఒక కొత్త తరహా కథనంతో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా రామ్ కార్తీక్ నటిస్తుండగా అతని సరసన హీరోయిన్ పాత్రలో హేబా పటేల్ నటిస్తున్నారు.ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
ముఖ్య పాత్రలలో సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్ , జయ ప్రకాష్ నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతుంది, అందులో భాగంగా ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ టీం. ఇదివరకే జల్సా చిత్రం రీ రిలీజ్ షోస్ లో భాగంగా ఈ చిత్ర టీజర్ ను ప్లే చేసారు.అప్పుడు కూడా ఈ చిత్ర టీజర్ కు విశేష స్పందన లభించింది.ఫ్యామిలీ సూసైడ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్ర టీజర్ ఆద్యంత ఆసక్తికరంగా ఉంది. కొన్ని యదార్థ సంఘటనలు బట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మరిన్ని అప్డేట్స్ ను , రిలీజ్ ను అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం.
నటీనటులు:
రామ్ కార్తీక్, హెబ్బా పటేల్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్ ప్లే, మాటలు ,దర్శకత్వం,నిర్మాత : విప్లవ్ కోనేటి
సమర్పణ: కేఎస్వీ ఫిలిమ్స్, సిరెంజ్ సినిమా
సినిమాటోగ్రఫి: అజయ్ వి నాగ్ , అనంత్ నాగ్ కావూరి
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
మ్యూజిక్: శ్రీ చరణ్ పాకాల
లిరిక్స్: డాక్టర్ జివాగో
ఆర్ట్: ఉపేందర్ రెడ్డి
కోరియోగ్రఫీ: జావేద్ మాస్టర్
ఫైట్స్: సీ హెచ్ రామకృష్ణ
లైన్ ప్రొడ్యూసర్ : డాక్టర్ జేకే సిద్ధార్థ
కో డైరెక్టర్ : కటిగళ్ళ సుబ్బారావు
పీఆర్వో : మధు వీ.ఆర్
డిజిటల్ మీడియా : ప్రసాద్ లింగం, ధీరజ్
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…