కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కింది. రమ్య గున్నం సమర్పణలో లైట్బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. బ్లాక్ బస్టర్ మూవీ ‘సామజవరగమన’ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రేబా మోనికా జాన్ జంటగా నటించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు ఈ చిత్ర టీజర్ను సోషల్ మీడియా వేదికగా దర్శకధీరుడు రాజమౌళి రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంఛ్ ఈవెంట్లో..
శ్రీ విష్ణు మాట్లాడుతూ .. ‘‘మృత్యుంజయ్’ కంప్లీట్ థ్రిల్లర్గా నడుస్తుంది. సాంగ్స్ లేకుండా, హీరోయిన్స్ లేకుండా, కామెడీ లేకుండా ఓ హానెస్ట్ థ్రిల్లర్లు మన తెలుగులో చాలా అరుదుగా వస్తుంటాయి. హుస్సేన్ ఎంతో నిజాయితీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మంచి కంటెంట్ను తెలుగు వారికి అందించాలనే ఉద్దేశంతో సందీప్ ఈ మూవీని నిర్మించారు. ఇలాంటి కథలు చెప్పినప్పుడు ఒకలా.. చేసేటప్పుడు ఇంకోలా.. ఆర్ఆర్ అయిన తరువాత చూసుకుంటే మరోలా ఉంటుంది. ఇందులోని విజువల్స్, లొకేషన్స్ చాలా కొత్తగా ఉంటాయి. కాళ భైరవ తన సంగీతంతో మ్యాజిక్ చేశాడు. చాలా తక్కువ పాత్రలతో ఈ సినిమా నడుస్తుంది. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో నా పర్ఫామెన్స్ కూడా కొత్తగా ఉంటుంది. ట్రైలర్ తరువాత కథ మరింత అర్థం అవుతుంది.
నిర్మాత సందీప్ గున్నం మాట్లాడుతూ .. ‘శ్రీ విష్ణు ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు, సినిమాలు చేయలేదు. కెరీర్ బిగినింగ్ నుంచీ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. హుస్సేన్ సుకుమార్ టీంలో ఓ మెంబర్. ఆయన చెప్పిన కథ విన్నప్పుడు హీరోకి ఇందులో పర్ఫామెన్స్ కావాలి అని అనిపించింది. అప్పుడు నాకు గుర్తు వచ్చిన మొదటి పేరు శ్రీ విష్ణు. అద్భుతమైన కథకు, గ్రేట్ టెక్నికల్ టీం దొరికింది. కాళ భైరవ మ్యూజిక్, సాగర్ విజువల్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ .. ‘ప్రతీ ఒక్క నిర్మాత లవ్ స్టోరీ ఉందా? కామెడీ ఉందా? అని అడిగేవారు. కానీ సన్నీ మాత్రం ‘నీకు నచ్చిన కథ చెప్పు’ అని అన్నారు. అప్పుడు ఈ కథను చెప్పాను. ఇందులో సెటిల్డ్గా నటించే హీరో కావాలని అనుకున్నాం. అప్పుడు శ్రీ విష్ణుని అనుకున్నాం. కథ విన్నాక విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్గా ఉండేలా చూసుకోండి.. ఆ పాత్ర పవర్ ఫుల్గా ఉంటేనే ఇతర పాత్రలు బాగుంటాయి అని శ్రీ విష్ణు అన్నారు. శ్రీ విష్ణు గారితో వర్క్ ఎక్స్పీరియెన్స్ ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమాకి కథే హీరో. నా సోదరి మనీషా ప్రొడక్షన్ డిజైనర్గా పని చేశారు. సాగర్ ఈ మూవీ ఎంతో కష్టపడ్డాడు. కాళ భైరవ తన సంగీతంతో అద్భుతం చేశాడు. శ్రీకర్ గారు తన ఎడిటింగ్తో జీవం పోశారు’ అని అన్నారు.
నటీనటులు: శ్రీ విష్ణు, రెబా జాన్
సాంకేతిక బృందం
బ్యానర్స్: లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి
సమర్పణ: రమ్య గున్నం
దర్శకత్వం: హుస్సేన్ షా కిరణ్
సంగీతం: కాళ భైరవ
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
డీఓపీ : విద్యా సాగర్
పీఆర్వో : వంశీ కాకా
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…