కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కింది. రమ్య గున్నం సమర్పణలో లైట్బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. బ్లాక్ బస్టర్ మూవీ ‘సామజవరగమన’ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రేబా మోనికా జాన్ జంటగా నటించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు ఈ చిత్ర టీజర్ను సోషల్ మీడియా వేదికగా దర్శకధీరుడు రాజమౌళి రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంఛ్ ఈవెంట్లో..
శ్రీ విష్ణు మాట్లాడుతూ .. ‘‘మృత్యుంజయ్’ కంప్లీట్ థ్రిల్లర్గా నడుస్తుంది. సాంగ్స్ లేకుండా, హీరోయిన్స్ లేకుండా, కామెడీ లేకుండా ఓ హానెస్ట్ థ్రిల్లర్లు మన తెలుగులో చాలా అరుదుగా వస్తుంటాయి. హుస్సేన్ ఎంతో నిజాయితీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మంచి కంటెంట్ను తెలుగు వారికి అందించాలనే ఉద్దేశంతో సందీప్ ఈ మూవీని నిర్మించారు. ఇలాంటి కథలు చెప్పినప్పుడు ఒకలా.. చేసేటప్పుడు ఇంకోలా.. ఆర్ఆర్ అయిన తరువాత చూసుకుంటే మరోలా ఉంటుంది. ఇందులోని విజువల్స్, లొకేషన్స్ చాలా కొత్తగా ఉంటాయి. కాళ భైరవ తన సంగీతంతో మ్యాజిక్ చేశాడు. చాలా తక్కువ పాత్రలతో ఈ సినిమా నడుస్తుంది. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో నా పర్ఫామెన్స్ కూడా కొత్తగా ఉంటుంది. ట్రైలర్ తరువాత కథ మరింత అర్థం అవుతుంది.
నిర్మాత సందీప్ గున్నం మాట్లాడుతూ .. ‘శ్రీ విష్ణు ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు, సినిమాలు చేయలేదు. కెరీర్ బిగినింగ్ నుంచీ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. హుస్సేన్ సుకుమార్ టీంలో ఓ మెంబర్. ఆయన చెప్పిన కథ విన్నప్పుడు హీరోకి ఇందులో పర్ఫామెన్స్ కావాలి అని అనిపించింది. అప్పుడు నాకు గుర్తు వచ్చిన మొదటి పేరు శ్రీ విష్ణు. అద్భుతమైన కథకు, గ్రేట్ టెక్నికల్ టీం దొరికింది. కాళ భైరవ మ్యూజిక్, సాగర్ విజువల్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ .. ‘ప్రతీ ఒక్క నిర్మాత లవ్ స్టోరీ ఉందా? కామెడీ ఉందా? అని అడిగేవారు. కానీ సన్నీ మాత్రం ‘నీకు నచ్చిన కథ చెప్పు’ అని అన్నారు. అప్పుడు ఈ కథను చెప్పాను. ఇందులో సెటిల్డ్గా నటించే హీరో కావాలని అనుకున్నాం. అప్పుడు శ్రీ విష్ణుని అనుకున్నాం. కథ విన్నాక విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్గా ఉండేలా చూసుకోండి.. ఆ పాత్ర పవర్ ఫుల్గా ఉంటేనే ఇతర పాత్రలు బాగుంటాయి అని శ్రీ విష్ణు అన్నారు. శ్రీ విష్ణు గారితో వర్క్ ఎక్స్పీరియెన్స్ ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమాకి కథే హీరో. నా సోదరి మనీషా ప్రొడక్షన్ డిజైనర్గా పని చేశారు. సాగర్ ఈ మూవీ ఎంతో కష్టపడ్డాడు. కాళ భైరవ తన సంగీతంతో అద్భుతం చేశాడు. శ్రీకర్ గారు తన ఎడిటింగ్తో జీవం పోశారు’ అని అన్నారు.
నటీనటులు: శ్రీ విష్ణు, రెబా జాన్
సాంకేతిక బృందం
బ్యానర్స్: లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి
సమర్పణ: రమ్య గున్నం
దర్శకత్వం: హుస్సేన్ షా కిరణ్
సంగీతం: కాళ భైరవ
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
డీఓపీ : విద్యా సాగర్
పీఆర్వో : వంశీ కాకా
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…
సావిత్రి గారు అద్భుతాలకే అద్భుతం - ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో పద్మశ్రీ డా. బ్రహ్మానందం ఆంగ్లంలోకి…
‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ -మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్…