శ్రీవిష్ణు, హుస్సేన్ షా కిర‌ణ్ కాంబోలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజ‌య్‌’ టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసిన దర్శకధీరుడు రాజమౌళి

కింగ్ ఆఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. ర‌మ్య గున్నం స‌మ‌ర్ప‌ణ‌లో లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సామజవరగమన’ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రేబా మోనికా జాన్ జంటగా నటించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు ఈ చిత్ర టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా దర్శకధీరుడు రాజమౌళి రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో..

శ్రీ విష్ణు మాట్లాడుతూ .. ‘‘మృత్యుంజయ్’ కంప్లీట్ థ్రిల్లర్‌గా నడుస్తుంది. సాంగ్స్ లేకుండా, హీరోయిన్స్ లేకుండా, కామెడీ లేకుండా ఓ హానెస్ట్ థ్రిల్లర్‌లు మన తెలుగులో చాలా అరుదుగా వస్తుంటాయి. హుస్సేన్ ఎంతో నిజాయితీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మంచి కంటెంట్‌ను తెలుగు వారికి అందించాలనే ఉద్దేశంతో సందీప్ ఈ మూవీని నిర్మించారు. ఇలాంటి కథలు చెప్పినప్పుడు ఒకలా.. చేసేటప్పుడు ఇంకోలా.. ఆర్ఆర్ అయిన తరువాత చూసుకుంటే మరోలా ఉంటుంది. ఇందులోని విజువల్స్, లొకేషన్స్ చాలా కొత్తగా ఉంటాయి. కాళ భైరవ తన సంగీతంతో మ్యాజిక్ చేశాడు. చాలా తక్కువ పాత్రలతో ఈ సినిమా నడుస్తుంది. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో నా పర్ఫామెన్స్ కూడా కొత్తగా ఉంటుంది. ట్రైలర్ తరువాత కథ మరింత అర్థం అవుతుంది.

నిర్మాత సందీప్ గున్నం మాట్లాడుతూ .. ‘శ్రీ విష్ణు ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు, సినిమాలు చేయలేదు. కెరీర్ బిగినింగ్ నుంచీ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. హుస్సేన్ సుకుమార్ టీంలో ఓ మెంబర్. ఆయన చెప్పిన కథ విన్నప్పుడు హీరోకి ఇందులో పర్ఫామెన్స్ కావాలి అని అనిపించింది. అప్పుడు నాకు గుర్తు వచ్చిన మొదటి పేరు శ్రీ విష్ణు. అద్భుతమైన కథకు, గ్రేట్ టెక్నికల్ టీం దొరికింది. కాళ భైరవ మ్యూజిక్, సాగర్ విజువల్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ .. ‘ప్రతీ ఒక్క నిర్మాత లవ్ స్టోరీ ఉందా? కామెడీ ఉందా? అని అడిగేవారు. కానీ సన్నీ మాత్రం ‘నీకు నచ్చిన కథ చెప్పు’ అని అన్నారు. అప్పుడు ఈ కథను చెప్పాను. ఇందులో సెటిల్డ్‌గా నటించే హీరో కావాలని అనుకున్నాం. అప్పుడు శ్రీ విష్ణుని అనుకున్నాం. కథ విన్నాక విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉండేలా చూసుకోండి.. ఆ పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటేనే ఇతర పాత్రలు బాగుంటాయి అని శ్రీ విష్ణు అన్నారు. శ్రీ విష్ణు గారితో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమాకి కథే హీరో. నా సోదరి మనీషా ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేశారు. సాగర్ ఈ మూవీ ఎంతో కష్టపడ్డాడు. కాళ భైరవ తన సంగీతంతో అద్భుతం చేశాడు. శ్రీకర్ గారు తన ఎడిటింగ్‌తో జీవం పోశారు’ అని అన్నారు.

నటీనటులు: శ్రీ విష్ణు, రెబా జాన్

సాంకేతిక బృందం
బ్యానర్స్: లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి
సమర్పణ: రమ్య గున్నం
దర్శకత్వం: హుస్సేన్ షా కిరణ్
సంగీతం: కాళ భైరవ
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
డీఓపీ : విద్యా సాగర్
పీఆర్వో : వంశీ కాకా

TFJA

Recent Posts

“స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే” కొత్త పోస్టర్ విడుదల

హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం స్పైడర్ -మన్ : బ్రాండ్ న్యూ డే నుండి…

12 hours ago

డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయి.. సినిమా నడిస్తేనే మనందరం నడుస్తాం: తెలుగు సినీ నిర్మాతలు

ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయని తెలుగు సినీ నిర్మాతలు అన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని,…

2 days ago

దూరదర్శని చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్‌ కలుగుతుంది: హీరో సువిక్షిత్‌

సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'దూరదర్శని'. కలిపింది ఇద్దరిని…

2 days ago

మూల సమస్యలు పరిష్కరించుకోవాలి, ఇప్పటికే తగ్గిన ఆదాయ పంపకాల పోరాటంతో ఉపయోగం లేదు – నిర్మాత బన్నీవాస్

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు నిర్మాత బన్నీవాస్. పరిశ్రమలోని మూల సమస్యలకు పరిష్కారం…

3 days ago

బ్లాక్ బస్టర్ ‘శంబాల’ కాంబో రిపీట్.. బృందా రవీందర్ దర్శకత్వంలో ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్, యగంధర్ ముని నూతన చిత్రం

సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘శంబాల’తో షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు, దర్శకుడు యుగంధర్ ముని, హీరో ఆది…

3 days ago

దూరదర్శని అందరి మనసులను హత్తుకుంటుంది: దర్శకుడు కార్తికేయ కొమ్మి

సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'దూరదర్శిని'. కలిపింది ఇద్దరిని…

4 days ago