ఆస్కార్ విన్నింగ్ మూవీ RRRతో వరల్డ్ వైప్ పాపులారిటీ దక్కించుకున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఆయన యువీ క్రియేషన్స్లోని తన స్నేహితుడు విక్రమ్ రెడ్డితో చేతులు కలిపారు. కొత్త కాన్సెప్ట్ చిత్రాలను, యంగ్ టాలెంట్ను ఎంకరేజ్ చేయటానికి వీరిద్దరూ ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్ను ప్రారంభించారు. పాన్ ఇండియా ప్రేక్షకులు మెచ్చేలా విలక్షణమైన చిత్రాలను ఈ సంస్థ రూపొందించనుంది. అదే సమయంలో యంగ్ టాలెంట్ను ఎంకరేజ్ చేయటానికి వేదికగా మారుతుంది.
నిర్మాణ సంస్థ ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్లో విలక్షణమైన కథాంశాలతో పాటు తిరుగులేని వినోదాన్ని ప్రేక్షకులకు అందిచంటానికి సిద్ధంగా ఉంది. సినీ నిర్మాణంలో అసాధారణమైన ఆసక్తి తో పాటు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందించాలనే ఆలోచన ఉన్న టీమ్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణ సంస్థ ముందుకు సాగనుంది. సినీ పరిశ్రమలో ఎవరూ గుర్తించని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలనే దానికి కట్టుబడి ఉంది.
ఈ సందర్బంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ‘‘మా ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్ విలక్షణమైన ఆలోచనలను ఆవిష్కరిస్తూ సరికొత్త, వైవిధమ్యైన వాతావరణాన్ని పెంపొందించటానికి సిద్దంగా ఉన్నాం. సృజనాత్మకతతో సినిమా సరిహద్దులను చెరిపేస్తాం. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అభివృద్ధి చెందుతోన్న టాలెంట్ని ఇండస్ట్రీకి పరిచయం చేసి ఓ సరికొత్త ప్రభావాన్ని చూపించటమే లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అన్నారు.
యువీ క్రియేషన్స్ విక్రమ్ మాట్లాడుతూ ‘‘ఈ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించటం అనేది మాలో తెలియని ఆనందాన్ని కలిగిస్తోంది. ఎంతో ప్రతిభ ఉన్న నటీనటులు, రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో కలిసి “వి మెగా పిక్చర్స్” పని చేయనుంది. వెండితెరపై చూపించబోయే స్టోరీ టెల్లింగ్లో ఓ కొత్త ఒరవడిని తీసుకు రావాలనుకుంటున్నాం. దీని వల్ల సినీ ఇండస్ట్రీ హద్దులు చెరిపేయటమే మా లక్ష్యం’’ అన్నారు.
ఇటీవల ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రెండు అవార్డులు సాధించిన"కమిటీ కుర్రోళ్లు" మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్…
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు…
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…