ఆస్కార్ విన్నింగ్ మూవీ RRRతో వరల్డ్ వైప్ పాపులారిటీ దక్కించుకున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఆయన యువీ క్రియేషన్స్లోని తన స్నేహితుడు విక్రమ్ రెడ్డితో చేతులు కలిపారు. కొత్త కాన్సెప్ట్ చిత్రాలను, యంగ్ టాలెంట్ను ఎంకరేజ్ చేయటానికి వీరిద్దరూ ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్ను ప్రారంభించారు. పాన్ ఇండియా ప్రేక్షకులు మెచ్చేలా విలక్షణమైన చిత్రాలను ఈ సంస్థ రూపొందించనుంది. అదే సమయంలో యంగ్ టాలెంట్ను ఎంకరేజ్ చేయటానికి వేదికగా మారుతుంది.
నిర్మాణ సంస్థ ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్లో విలక్షణమైన కథాంశాలతో పాటు తిరుగులేని వినోదాన్ని ప్రేక్షకులకు అందిచంటానికి సిద్ధంగా ఉంది. సినీ నిర్మాణంలో అసాధారణమైన ఆసక్తి తో పాటు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందించాలనే ఆలోచన ఉన్న టీమ్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణ సంస్థ ముందుకు సాగనుంది. సినీ పరిశ్రమలో ఎవరూ గుర్తించని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలనే దానికి కట్టుబడి ఉంది.
ఈ సందర్బంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ‘‘మా ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్ విలక్షణమైన ఆలోచనలను ఆవిష్కరిస్తూ సరికొత్త, వైవిధమ్యైన వాతావరణాన్ని పెంపొందించటానికి సిద్దంగా ఉన్నాం. సృజనాత్మకతతో సినిమా సరిహద్దులను చెరిపేస్తాం. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అభివృద్ధి చెందుతోన్న టాలెంట్ని ఇండస్ట్రీకి పరిచయం చేసి ఓ సరికొత్త ప్రభావాన్ని చూపించటమే లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అన్నారు.
యువీ క్రియేషన్స్ విక్రమ్ మాట్లాడుతూ ‘‘ఈ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించటం అనేది మాలో తెలియని ఆనందాన్ని కలిగిస్తోంది. ఎంతో ప్రతిభ ఉన్న నటీనటులు, రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో కలిసి “వి మెగా పిక్చర్స్” పని చేయనుంది. వెండితెరపై చూపించబోయే స్టోరీ టెల్లింగ్లో ఓ కొత్త ఒరవడిని తీసుకు రావాలనుకుంటున్నాం. దీని వల్ల సినీ ఇండస్ట్రీ హద్దులు చెరిపేయటమే మా లక్ష్యం’’ అన్నారు.
'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…