“రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని ‘రక్త చరిత్ర’ సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ చేసిన తర్వాతే ఈ సినిమాను మొదలుపెట్టాం. నా కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా ఇది” అని సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నారు. వివేక్ ఒబెరాయ్, సూర్య, రాధికా ఆప్టే, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమా 2010లో విడుదలై, అప్పట్లో సూపర్ హిట్ అయింది. 16 ఏళ్ల తర్వాత ఈ సినిమాను త్రిపుర క్రియేషన్స్ అధినేత మురళీకృష్ణ వంకాయలపాటి, నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటెర్టైనెంట్స్ తరపున నట్టి కుమార్ రీ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, “శాంతికి, యుద్ధానికి మధ్య ఉన్నఅంతరాన్ని చర్చిస్తూ, యుద్ధం వల్ల జరిగే నష్టాన్ని ఇందులో చూపించాం. ఇక ‘రక్త చరిత్ర’ పార్ట్-3 సినిమా తీసే అవకాశం లేదు. ఎందుకంటే పార్ట్-2లో వాళ్లు అందరూ పోయారు. ఎవరూ లేరు. ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు” అని చెప్పుకొచ్చారు. ఇదే ప్రెస్ మీట్ లో పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు రామ్ గోపాల్ వర్మ తనదైన రీతిలో స్పందిస్తూ సమాధానాలిచ్చారు. ఇప్పుడు రాయలసీమలో ఫ్యాక్షనిజం కనుమరుగైంది. ఈ టైమ్ లో మళ్లీ ‘రక్త చరిత్ర’ సినిమాను రీ రిలీజ్ చేయడం ద్వారా వాళ్ళను రెచ్చగొడుతున్నారా? అన్న ప్రశ్నకు వర్మ స్పందిస్తూ…ఇప్పుడున్న వాళ్లు సోషల్ మీడియాలో మాటలు తూటాలుగా పేలినా, బయటకు వచ్చి, బాహాబాహీ తలపడే దమ్ము ఎవరికీ లేదని అన్నారు.
స్టార్ డామినేషన్ లో తప్పు లేదు
సినిమా ఇండస్ట్రీ లో ఒకప్పుడు డైరెక్టర్ కు అధిక ప్రాధాన్యం ఉండేది. డైరెక్టర్ ను కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనే వారు…మరి నేడు స్టార్ డామినేషన్ ఎక్కువైంది. దీనికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు వర్మ బదులిస్తూ…డైరెక్టర్ కు ఏమైనా కిరీటం ఉంటుందా!. స్టార్ ముఖం చూసి ప్రేక్షకులు టిక్కెట్లు కొంటున్నప్పుడు…కోట్లాది రూపాయల బిజినెస్ స్టార్ మూలంగా జరుగుతున్నప్పుడు సహజంగానే స్టార్ డామినేషన్ ఉండటంలో ఎలాంటి తప్పు లేదు. అది కరెక్ట్ కూడా. డైరెక్టర్ కు సినిమాకు సంబంధించి స్టార్ ను కన్విన్స్ చేసే కెపాసిటీ ఉందా? లేదా? అన్నదే ఇంపార్టెంట్.
ఫ్యామిలీ సెంటిమెంట్, మల్టీ స్టారర్ సినిమాలు తీయను
నా జీవితంలో ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు ఎప్పటికీ తీయను. ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు ఎవరి కోసం తీయాలి. ఒక కుటుంబం థియేటర్ కు సినిమాకు వెళితే…భర్త ఏమో హీరోయిన్ ను చూస్తాడు, భార్య ఏమో హీరోయిన్ వేసుకున్న కాస్ట్యూమ్స్ ను చూస్తుంది. ఇక కొడుకు ఏమో ఎందుకొచ్చామురా అని బోరింగ్ గా ఫీల్ అవుతాడు. అందుకే ఫ్యామిలీ సెంటిమెంట్ సబ్జెక్టుల జోలికి వెళ్లదలచుకోలేదు. ఇక పౌరాణిక సినిమాలు అంటారా? వాటిని తీసే ఓపిక నాకు లేదు. పౌరాణికాలకు భారీ కాస్ట్యూమ్స్, బోలెడంత గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ను ఉపయోగించాల్సి ఉంటుందనే కారణంగానే నేను వాటి గురించి ఎప్పటికీ ఆలోచించను. రియలిస్టిక్ డ్రామాలు మాత్రమే తీస్తాను. ప్రస్తుతం హిందీలో కాప్స్ స్టోరీతో సినిమా చేస్తున్నా. అందుకే ముంబైలో ఉంటున్నా” అంటూ వర్మ వివరించారు.
అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నాం: నట్టి కుమార్, మురళీకృష్ణ
ఒకప్పుడు రాయలసీమలో రెండు వర్గాలు ఎలా కత్తులు దూసుకున్నాయి. దానివల్ల ఎంత మారణ హోమం జరిగిందన్న అంశాన్ని రక్త చరిత్ర సినిమాలో వర్మ చాలా చక్కగా చూపించారని, అప్పట్లో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రాన్ని ఈ జనరేషన్ కి కూడా చూపించాలన్న ఉద్దేశ్యంతోనే రీ రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు నట్టి కుమార్, మురళీకృష్ణ వంకాయలపాటి తెలిపారు. అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని, శనివారం సాయంత్రం 4 గంటలకు టిక్కెట్ల బుకింగ్ ఓపెన్ చేస్తున్నామని వారు చెప్పారు.
తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా "ది మేజ్". ఈ…
▪️ తెలుగు, కన్నడ భాషల్లో జూన్లో విడుదలైన చిత్రం▪️ 300 థియేటర్లలో విడుదలై హిట్ టాక్ హారర్-యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకుల…
టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు. వనస్థలిపురంలోని రెడీ టూ సర్వ్ ఆశ్రమం నుండి…
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ చిత్ర యూనిట్ ఈరోజు (మంగళవారం) ఫస్ట్ సింగిల్…
మార్వెల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అవెంజర్స్: డూమ్స్డే' సినిమా ట్రైలర్ను బిగ్ స్క్రీన్ పై చూసే అవకాశం రానుంది.…
హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల గారు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె…