ఘనంగా ఇండియస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘పుష్ప 2 బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్ నిర్మాతలు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పై భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం 6 భాషలలో ప్రపంచవ్యాప్తంగా 12000లకు పైగా స్క్రీన్స్ లో విడుదల కావడం జరిగింది. ప్రపంచమంతట కలిపి 294 కోట్లతో డే1 వసూళ్లతో రికార్డు సాధించింది. ప్రపంచమంతటా పాజిటివ్ టాక్ తో ఈ చిత్రం దూసుకెళ్తున్న సందర్భంగా చిత్ర బృందం బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం అంతా ఈ ప్రెస్ మీట్ కు హాజరు కావడం జరిగింది.

ఈ సందర్భంగా నిర్మాత నవీన్ గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. సినిమా రిలీజ్ అయిన తరువాత పని ఎక్కువ అయిపోయింది. అందరి దగ్గరా నుండి మెసేజ్ లు వస్తూనే ఉన్నాయి. ఇదే ఈ చిత్ర విజయానికి నిదర్శనం. ఈ సినిమా ఎంతగా ఆదరించిన తెలుగు ప్రజలందరికీ థాంక్స్. ఫాస్టెస్ట్ 500 కోట్లు వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. మరింత విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఎంతటి భుజం సాధించడం భారతదేశాలందరికీ గర్వకారణం” అన్నారు.

నిర్మాత రవి మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. సినిమా ప్రీమియర్ షో చూడగానే ఇద్దరు సినిమా మాడ్నెస్ ఉన్నవాళ్ళు సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూస్తారు. రెండు రోజులకు 500 కోట్లకు పైగా సినిమా కలెక్ట్ చేసినందుకు ఆనందంగా ఉంది . అలాగే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి పేరుపేరునా మా ధన్యవాదాలు. ఇకపై థియేటర్లో టికెట్ రేట్ అందుబాటులో ఉంటుంది. అందరూ కచ్చితంగా చూడాల్సిందిగా కోరుతున్నాము” అన్నారు.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ… “అందరికీ థాంక్స్, ఈ సినిమాకు ఇంత విజయం ఇచ్చినందుకు. ముందుగా నేను రాజమౌళి గారికి థాంక్స్ చెప్పాలి. ఈ సినిమాను ఇంతగా ప్రోత్సహించింది రాజమౌళి గారు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయాలని రాజమౌళి గారు అన్నారు. ధియేటర్ కు వచ్చిన వాళ్ళు 3 గంటలు అంతా మర్చిపోయి సినిమాను చూడాలి అని నేను, నా చిత్ర బృందం చాల కష్టపడి చేశాం. ఫాహద్ ఫజల్ సినిమా కోసం చాల కష్టపడ్డారు. మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తితో పని చేయడం చాల అదృష్టం. అలాగే నాకు దొరికిన అసిస్టంట్ డైరెక్టర్స్ ఎవరికీ దొరికి అందరూ. వాళ్ళ జడ్జిమెంట్ కి చాల విలువ ఇస్తాను. అలాగే బయట నుండి ఒక రైటర్ని నా డైరెక్షన్ టీంలోకి తీసుకున్నాను. ఏమైనా సమస్య వచ్చినా చాల వేగంగా తీరుస్తారు. తిరుపతి నుండి గంగమ్మ తల్లి జాతరకు సంబంధించిన వారిని తీసుకొచ్చారు నా డైరెక్షన్ టీం. 10 నిమిషాలలో సీన్ రాసే వాళ్ళు ఉన్నారు దర్శకత్వం టీంలో. నా టీంలో ఉన్న వారు అంతా సుకుమార్ లే. అందరూ నాలాంటి దర్శకులే. సినిమా కోసం బాక్గ్రౌండ్ లో ఉండి పని చేసిన అందరి కష్టం నాకు తెలుసు. ఈ విజయానికి కారణం చిత్ర బృందం అందరిదీ. నా టీంలో నా అభిమానులు ఉండటం నా అదృష్టం. సినిమా ఎంత విజయం సాధిస్తుందో నా టీం ముందుగానే లెక్కలతో సహా చెప్పేశారు. హింది కూడా నా టీం మీద నమ్మకంతో పూర్తిగా వారికే అప్పగించాను. నా బృందంలో జర్నలిస్టు కూడా ఉండటం విశేషం. ఎడిటర్ కి స్క్రిప్ట్ ఎడిటింగ్ పై అవగాహన ఉండటం మాకు చాల హెల్ప్ అయింది. అలాగే చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు 3 రోజులుగా ఆనందంగా లేదు. ఎందుకంటే జరిగిన ఘటన అలాంటిది. వారి కుటుంబానికి మేము ఎప్పుడూ అండగా ఉంటాం. మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు” అన్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. దేశ నలుమూలల నుండి మాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి, భారతీయులకు, చిత్ర బృందానికి, నిర్మాతలకు, మీడియా వారికి ధన్యవాదాలు. ఒక సినిమా ఇలాంటి విజయం సాధించడానికి కారణం దర్శకుడు. కాబట్టి మా దర్శకుడు సుకుమార్ కి ధన్యవాదాలు. నన్ను ఒక స్థాయిలో పెట్టినందుకు నీకు రుణపడి ఉంటాను. సినిమా కలెక్షన్స్ చూస్తే నాకు సినిమాను ఎంత మంది ప్రేక్షకులు చూసారో అర్థం అవుతుంది. చిత్ర బృందం తరఫున, తెలుగు వారి అందరి తరుపున ప్రపంచ సినీ ప్రేక్షకులు అందరికీ నా థాంక్స్. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ బాబాయ్ గారికి, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు. అలాగే బీహార్ ప్రభుత్వానికి, పాట్నా ప్రజలకు, బీహార్ పోలీసులకు, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలకు, దేశంలో ఈ సినిమాకు సపోర్ట్ ఇచ్చిన అన్ని సినిమా ఇండస్ట్రీలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు. నేను ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం ఈ సినిమా అందరిని గర్వంగా చెప్పుకునేలా చేస్తుంది అనే నమ్మకంతోనే. అనుకోకుండా సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన మమ్మల్ని ఎంతగానో కదిలించింది. గత 20 సంవత్సరాలుగా ఇలాగే వస్తున్నాము కానీ ఆరోజు కొంచం ఎక్కువ జనం ఉండటంతో ఇబ్బంది అవుతుంది అని థియేటర్ యాజమాన్యం చెప్పగానే వెళ్ళిపోయాం. కానీ ఇంటికి వచ్చిన తరువాత రోజు జరిగిన సంఘటన తెలిసి చాల బాధ కలిగింది. మరొకసారి చెప్తున్నాను ఆ కుటుంబం కోసం 25 లక్షలు కేవలం ఒక సాయంగా అనుకుని ఇస్తున్నాము. అయినా ఒక మనిషి లేని లోటు ఎవరు తీర్చాలెం. అందుకు ఎంతో విచారిస్తున్నాను. అంత కుదుటపడిన తరువాత వ్యక్తిగతంగా వెళ్లి ఆ కుటుంబాన్ని కలుస్తాను” అంటూ ముగించారు.

Tfja Team

Recent Posts

అథర్వణ భద్రకాళి పిక్చర్స్ ద్వారా గ్లోబల్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కాబోతోన్న ‘రాకాస’.. ఓవర్సీస్‌లో 350కి పైగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల

అథర్వణ భద్రకాళి పిక్చర్స్ అధికారికంగా ‘రాకాస’ ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను పొందింది. ‘రాకాసా’ వరల్డ్ వైడ్‌గా ఆడియెన్స్ మీద ముద్రను…

3 days ago

హే భగవాన్‌ నవ్విస్తుంది.. హృదయానికి హత్తుకుంటుంది: సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ వంశీ నందిపాటి

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

3 days ago

“కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్రభాస్ గారు ప్రశంసించడం నేను గెలిచాననే ఫీల్ కలిగించింది – సక్సెస్ సెలబ్రేషన్స్ లో హీరో సంతోష్ శోభన్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా ఈ రోజు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు…

4 days ago

‘బ్యాండ్ మేళం’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ

మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ నిర్మించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’.…

4 days ago

కపుల్ ఫ్రెండ్లీ మూవీని ప్రశంసిస్తూ ఇన్ స్టా పోస్ట్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ…

4 days ago

పురుష: నుంచి చాటు చాటు సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ట్యూన్

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న కొత్త సినిమా ‘పురుష:’. పక్కా ఫ్యామిలీ…

4 days ago