డిసెంబర్ నెల 23 న ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్!.

జైనీ క్రియేషన్స్ పతాకంపై మూలవిరాట్, పద్మ,రాజ్ కుమార్, స్వప్న నటీ నటులుగా అమ్మ నీకు వందనం,  క్యాంపస్ అంపశయ్య’,  ప్రణయ వీధుల్లో’, వంటి  ప్రయోజనాత్మక ‘ సినిమాలు తీసిన ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్!.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 23 న విడుదలకు సిద్దమైన సందర్బంగా  

చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైనీ  మాట్లాడుతూ…మన కాలపు మహాకవి కాళోజీ గారి సందేశం, మన విద్యార్థులకైనా చేరితే, సినిమా తీసిన ప్రయోజనం నెరవేరుతుందనే ఉద్దేశ్యంతో తెలంగాణా ముఖ్యమంత్రి గారి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిగారిని కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించడం చాలా సంతోషంగా ఉంది. దీంతో ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో డిసెంబరు 23 నుండి 29 డిసెంబరు వరకు 24 థియేటర్లలో, వారం రోజుల పాటు రోజూ ఒక్క మార్నింగ్ షో మాత్రమే ఉదయం 9 నుండి 11 గంటలకు,  అదీ స్కూలు పిల్లలకు ఉచితంగా. ఈ క్రింది థియేటర్లలో ప్రదర్శిపబడుతుంది. ఇంతకంటే ఇంకా ఎక్కువగా విడుదల చేయలేనందుకు నాకూ బాధగానే ఉంది. కానీ.. ఎవ్వరు కూడా ఈ సినిమా కమర్షియల్ గా నడవదనీ, రిలీజ్ చేసే సాహసం చేయలేమని అశక్తత వ్యక్తం చేయడంతో ఈ విధంగా చేయవలసి వచ్చింది. పిల్లలకు బాగా నచ్చి, వారే రాయబారులై సినిమా అందరూ చూడాలని ఉద్యమిస్తే, రెగ్యులర్ షోస్ వేసే అవకాశం కలుగుతుంది. లేదా కనీసం OTT లో విడుదలకై అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే ఈ కార్యక్రమంలో , ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు, శ్రీ వేముల శ్రీనివాసులు(ఓ యస్ డి) , సీఎంఓ సోదరుడు మూర్తి పాత , డిప్యూటీ సెక్రటరీ తెలంగాణ గవర్నమెంట్ గారు, తెలంగాణా స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అండ్ కామర్స్ హానరరీ సెక్రెటరీ అనుపమ్ రెడ్డి గారు తమ వంతు సహకారం అందించారు. ప్రభుత్వంలో ఒక ఫైల్ అప్రూవ్ కావడానికి అనేక చిక్కులు ఉంటాయి. అవన్నీ దాటడంలో అనేక మంది మితృలు సహకరించారు. వారందరికీ నా ధన్యవాదాలు!

నటీ నటులు
కాళోజీ గారితో చిరకాలంగా సన్నిహితంగా మెదిలిన పొట్లపల్లి శ్రీనివాసరావు, నాగిళ్ళ రామశాస్త్రి, విద్యార్థి, అంపశయ్య నవీన్, డాక్టర్ వీయస్ రెడ్డి, అన్వర్, పీవీ నరసింహారావు పాత్రలో వారి సోదరుడు, పీవీ మనోహర్ రావు, ప్రముఖ కవి తుమ్మూరి రామ్మోహన్ రావు, వైభవ్ సూర్య, శంకర్, మల్లికార్జున్, ప్రియ, రాధిక, నరేశ్, రజని, దేవేందర్ రెడ్డి, లాయర్ చౌహాన్, జమీందారు పాత్రలో ఆంధ్రప్రభ చీఫ్ ఎడిటర్ వైయస్సార్ శర్మ నటించారు.  మిసెస్ ఇండియా  సుష్మా తోడేటి తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్: జైనీ క్రియేషన్స్,
నిర్మాత: విజయలక్ష్మీ జైనీ,
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రభాకర్ జైనీ.
కెమెరామెన్: స్వర్గీయ రవి కుమార్ నీర్ల;
సంగీతం: యస్.యస్.ఆత్రేయ,
నేపథ్య సంగీతం: మల్లిక్ యం.వి.కే;
ఎడిటింగ్: కొండవీటి రవి కుమార్,
సెకండ్ యూనిట్ కెమెరా:  భాస్కర్,
పి. ఆర్. ఓ : మూర్తి

Tfja Team

Recent Posts

గ్రాండ్‌గా జరిగిన ‘MRP – నీకెంత నాకెంత’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జూలై 17న రిలీజ్

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…

2 weeks ago

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను” టీజర్ రిలీజ్

తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…

2 weeks ago

నా కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా ‘రక్త చరిత్ర’-రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ

"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…

2 weeks ago

యతిరాజు పాత్రలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన శివాజీ

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…

2 weeks ago

సావిత్రి గారంటే తెలుగుతనం, అమ్మతనం ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో జయప్రద

సావిత్రి గారు అద్భుతాలకే అద్భుతం - ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో పద్మశ్రీ డా. బ్రహ్మానందం ఆంగ్లంలోకి…

2 weeks ago

‘ఐ, నోబడీ’ ప్రివ్యూ ప్రెస్ మీట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్*

‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ -మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్…

2 weeks ago