* అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మాతలుగా సినిమా
దక్షిణాది సినీ రంగం ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటి ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్. ఈ సంస్థ నిర్మించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘లవ్ టుడే’. ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే ప్రదీప్ రంగనాథన్ సినిమాను డైరెక్ట్ చేశారు. అన్నీ వర్గాల మన్ననలు అందుకుంటూ ఈ సినిమా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.
ఈ చిత్రానికి కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా మెప్పించనున్నారు. ఈ మే నెల నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రముఖ నటీనటులందరూ ఇందులో నటించనున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందుతోన్న 26వ సినిమా ఇది.
కొత్త సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోను మేకర్స్ విడుదల చేయగా, సోషల్ మీడియాలో వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రదీప్ రంగనాథన్, అశ్వత్ మారిముత్తు మధ్య ఉన్న నిజ జీవితంలోని స్నేహాన్ని తెలియజేస్తూ ఎంటర్టైనింగ్గా వీడియో ఉంది.
ఈ ఎమోషనల్ మూవీకి అర్చనా కల్పాతి క్రియేట్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తుంటే ఐశ్వర్యా కల్పాతి అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రదీప్ ఇ.రాఘవ్ ఎడిటర్గా, ఎస్.ఎం.వెంకట్ మాణిక్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా క్రియేటివ్ ప్రొడ్యూసర్ అర్చనా కల్పాతి మాట్లాడుతూ ‘‘లవ్ టుడే’ చిత్రంతో ప్రేక్షకుల హృదయాల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్తో మరోసారి కలిసి పని చేయటం ఆనందంగా ఉంది. అలాగే ఓ మై కడవులే సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం ఆనందంగా ఉంది. వీరి కలయికలో రాబోతున్న ఈ సినిమా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సూపర్ హిట్ చిత్రాల సరసన నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు.
సినిమా టైటిల్.. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ తెలియజేసింది.
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…