జాతీయ అవార్డ్ దర్శకులు నరసింహ నంది దర్శకత్వంలో వచ్చిన 1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జా లాంటి ఉత్తమ విలువలు కలిగిన సినిమాల తరువాత నరసింహ నంది తాజాగా ఎస్విఎస్ ప్రొడక్షన్స్ , శ్రీనిధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది, ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసన్న కుమార్, దర్శకులు సముద్ర, నటుడు పృద్వి తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
సెక్స్పియర్ కథలోని పాత్రల ఆధారంగా తీసుకొని తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో జరిగే పొలిటికల్ ఫ్యామిలీ ఇతివృత్తంగా పగ ద్వేషం, ఈర్ష, అసూయ, ప్రేమ మనిషిలోని వివిధ కోణాలను చూపిస్తూ ప్రభుత్వం సారాయి దుకాణం సినిమా కథను తయారు చెయ్యడం జరిగింది. 1980 నాటి పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మలచడం జరిగింది.
ఈ సందర్భంగా దర్శకులు నరసింహ నంది మాట్లాడుతూ…
మా ఈవెంట్ కు వచ్చిన ప్రసన్న కుమార్ గారికి కృతజ్ఞతలు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ గా అన్ని సమస్యలను సున్నితంగా పరిస్కరిస్తూ ఉంటారు. మల్లారెడ్డి పాత్ర చేసిన పృద్వి గారికి థాంక్స్, మా కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు వారికి అలాగే సముద్ర గారు మమ్మల్ని విష్ చెయ్యడానికి వచ్చారు, వారికి ధన్యవాదాలు, నిర్మాతలు నరేష్ గౌడ, పరిగి మల్లిక్ ఈ సినిమాను చాలా ప్యాషన్ తో చేశారు, కమర్సియల్ అంశాలతో కూడుకున్న కథ ఇది, అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ కథకు కనెక్ట్ అవుతారని తెలిపారు.
దర్శకుడు సముద్ర మాట్లాడుతూ….
నేను నరసింహ నంది మంచి స్నేహితులము, ప్రతి సినిమా విభిన్నంగా చేస్తూ వచ్చారు, ప్రభుత్వ సారాయి దుకాణం మోషన్ పోస్టర్ చాలా బాగుంది, నిర్మాతలు పరిగి మల్లిక్, నరేష్ గౌడ సినిమా పట్ల చాలా సంతోషంగా ఉన్నారు, కెమెరామెన్ మోహన్ గారు, ఎడిటర్ నాగిరెడ్డి గారు ఇలా అందరూ బాగా చేశారు, వారందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.
నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ….
నరసింహ నంది డైరెక్ట్ చేసిన 1940 లో ఒక గ్రామం సినిమాకు నేషనల్ అవార్డ్ రావడం విశేషం, తన దర్సకత్వంలో రాబోతున్న ప్రభుత్వ సారాయి దుకాణం సినిమాలో నటించిన నటీ నటులందరికి శుభాకాంక్షలు, ఈ చిత్ర యూనిట్ చాలా క్రమశిక్షణతో కనిపిస్తున్నారు, టాలెంట్ తో పాటు క్రమశిక్షణ చాలా అవసరం, ఈ సినిమా వీరందరికి మంచి పేరును తెచ్చి పెడుతుంది అనడంలో సందేహం లేదు, ఆర్టిస్ట్ గా కాకుండా గెస్ట్ గా వచ్చిన పృద్వి ఈ సినిమా చాలా బాగుందని చెపుతున్నారు, తప్పకుండా ఆయన మాటలు నిజం కాబోతున్నాయని తెలిపారు.
నటుడు పృద్వి మాట్లాడుతూ….
ఎస్విఎస్ ప్రొడక్షన్స్ లో వస్తోన్న ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా ను డైరెక్ట్ చేసిన నరసింహ నంది దర్శకత్వంలో నటించాలని ఎప్పటినుండో అనుకున్నాను, ఇప్పటికి నాకు ఇతని డైరెక్షన్ లో మంచి పాత్రలో నటించాను, ఎంతో మంది మంచి ఆర్టిస్ట్ లను పరిచయం చేసిన నరసింహ నంది ఈ సినిమాలో మరింతమంది కొత్త నటీనటులను పరిచయం చేసారు, ఈ సినిమాలో మా అమ్మాయి శ్రీలు చక్కటి రోల్ లో ఈ సినిమాలో నటించింది తనతో పాటు అందరికి ఈ సినిమా ఒక మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
నిర్మాత నరేష్ గౌడ మాట్లాడుతూ….
మమ్మలి ఆశీర్వదించడానికి వచ్చిన ప్రసన్న కుమార్ గారికి, పృథ్వి గారికి, సముద్ర గారికి కృతజ్ఞతలు, మా అన్న గురువు పరిగి మల్లిక్ గారితో కలిసి ఈ సినిమా నిర్మిచడం సంతోషంగా ఉంది, నరసింహ నంది గారు సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు రేపు అందరూ అదే ఫీల్ అవుతారు, త్వరలో మా ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా థియేటర్స్ లో అందరిని అలరించబోతోందని తెలిపారు.
నిర్మాత పరిగి మల్లిక్ మాట్లాడుతూ…
అతిథులకు మీడియా మిత్రులకు ఇక్కడికి విచ్చేసిన అందరికి కృతజ్ఞతలు, ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా మా మూడేళ్ళ జర్నీ, ఎంతో కష్టపడి నాతో కలిసి నరేష్ గౌడ ఈ సినిమాను నిర్మించారు, నరసింహ నంది గారు ప్రాణం పెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు, అందరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది, అందరూ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం బెస్ట్ ఇచ్చారని తెలిపారు.
హీరో విక్రమ్ మాట్లాడుతూ…
ఆడిషన్స్ లో నన్ను సెలెక్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చిన దర్శకులు నరసింహ నంది గారికి కృతజ్ఞతలు, ప్రభుత్వ సారాయి దుకాణం చిత్రం తప్పకుండా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.
హీరో సదన్ మాట్లాడుతూ…
ఈ సినిమా నా కెరీర్ లో ఒక మంచి సినిమాగా మిగిలిపోతుందని నమ్మకం ఉంది, ఒక సినిమాలో నటించానాన్న తృప్తి ఉందన్నారు
హీరో వినయ్ మాట్లాడుతూ…
ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా అందరిని ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను, ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ నరసింహ నంది గారికి నిర్మాతలు నరేష్ గౌడ గారికి పరిగి మల్లిక్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
హీరోయిన్ అధితి మైకేల్ మాట్లాడుతూ…
ప్రభుత్వ సారాయి దుకాణం సినిమాను డైరెక్టర్ నరసింహ నంది గారు అద్భుతంగా తెరకెక్కించారు, ఈ సినిమా లో నటించినందుకు గర్వాంగా ఉంది. ఇలాంటి మంచి సినిమాలను ఆడియన్స్ ఆధరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.
హీరోయిన్ శ్రీలు దాసరి మాట్లాడుతూ…
నరసింహ నంది గారి దర్శకత్వంలో ప్రభుత్వ సారాయి దుకాణం సినిమాలో ఒక మంచి రోల్ లో నటించాను, తప్పకుండా నా పాత్ర మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.
హీరోయిన్ మోహన సిద్ది మాట్లాడుతూ…
ఈ సినిమా లో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు నరసింహ నంది గారికి కృతజ్ఞతలు. ఒక మంచి సినిమాలో నటించానన్న హ్యాపీ నెస్ ఉంది, త్వరలో రాబోతున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.
నటుడు తిలక్ మాట్లాడుతూ….
ఎన్నో సినిమాల్లో మంచి రోల్స్ లో నటించిన నాకు ఈ సినిమాలో మరో గుర్తిండిపోయే పాత్రలో నటించాను, ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా ఆలోచింపజేసే విధంగా ఉంటుంది, డైరెక్టర్ నరసింహ నంది, నిర్మాతలు నరేష్, మల్లిక్ కు ఈ మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
నటీనటులు: ఆర్.విక్రమ్ , సదన్ హాసన్, వినయ్, నరేష్ రాజ్, అదితి మైకేల్, శ్రీలు దాసరి, మోహన సిద్ది, రంగరాజు, పృద్వి, తిలక్, బాలు నాయక్, స్వప్న, జ్యోతి, బలగం సహాదేవ్, బలగం రమేష్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: ఎస్విఎస్ ప్రొడక్షన్, శ్రీనిధి సినిమాస్
నిర్మాతలు: దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్
ఎడిటర్ : వి . నాగిరెడ్డి
సంగీతం: ఎస్ ఎస్
కెమెరామెన్: ఎస్.మురళి మోహన్ రెడ్డి
రచన , దర్శకత్వం: నరసింహ నంది
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…