టి.డి.ఆర్ సినిమాస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్.1 గా కుంచం శంకర్ దర్శకత్వంలో తలారి దినకరణ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు గురువారం (ఆగస్ట్ 21) నాడు ఘనంగా జరిగాయి. ముహుర్తపు సన్నివేశానికి రామ్ అబ్బరాజు క్లాప్ నివ్వగా, ప్రశాంత్ కుమార్ దిమ్మెల కెమెరా స్విచాన్ చేసి గౌరవ దర్శకత్వం వహించారు. రామ్ అబ్బరాజు, ప్రశాంత్ దిమ్మెల, అడిదాల విజయ్పాల్ రెడ్డి స్క్రిప్ట్ అందించారు. పవన్ కేసరి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించనుండగా.. కెమెరామెన్గా సాయి పని చేయనున్నారు. ఇక ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా…
డైరెక్టర్ కుంచం శంకర్ మాట్లాడుతూ .. ‘మా చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియాకు థాంక్స్. నాకు సహకరించి ఇక్కడకు వచ్చిన మా మూవీ టీంకు థాంక్స్’ అని అన్నారు.
విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ .. ‘మా మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నేను ఇంత వరకు కొత్త దర్శకులతోనే పని చేశాను. శంకర్ గారు మంచి కథను రాసుకున్నారు. ఈ కథ నాకు చాలా నచ్చింది. మంచి ట్యూన్స్ వస్తున్నాయి. పవన్ పెద్ద హీరో అవుతాడని అనిపిస్తోంది. కావ్య గారు ఈ మూవీకి పెద్ద ఎస్సెట్ అవుతారు. విప్లవ్ గారితో బేబీ మూవీకి పని చేశాను. మాలాంటి కొత్త వారిని ఎంకరేజ్ చేస్తున్న దినకరణ్ గారికి థాంక్స్’ అని అన్నారు.
త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మిగిలిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
నటీనటులు: పవన్ కేసరి, కావ్యా కళ్యాణ్ రామ్, సుగుణ, సుప్రియ, దివిజ ప్రభాకర్, మొయిన్ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: టి.డి.ఆర్.సినిమాస్
దర్శకత్వం: కుంచం శంకర్
నిర్మాత: తలారి దినకరన్ రెడ్డి
మ్యూజిక్: విజయ్ బుల్గానిన్
ఎడిటర్: విప్లవ్
ఆర్ట్: క్రాంతి ప్రియం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఐ.జి.సంతోష్
కాస్ట్యూమ్స్: శ్రీదేవి తెతాలి
పి.ఆర్.ఒ: వంశీ కాకా
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…
"టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026" జ్యూరీ ఛైర్ పర్సన్ గా నటి ఇంద్రజ వ్యవహరిస్తారు: టీఎఫ్…
మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' నిర్మిస్తున్న 'ఇరుముడి' చిత్రం కోసం దర్శకుడు…
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 'సింగ్ గీతం' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక…