షర్మన్ జోషి, శ్రియా శరణ్, షాన్, సుహాసిని మూలే, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతంసంగీత సారథ్యం వహిస్తోన్న మల్టీ లింగ్వువల్ మ్యూజికల్ మూవీ మే 12న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో మేకర్స్ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా మ్యూజిక్ స్కూట్ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ను గమనిస్తే శ్రియా శరన్ కొంత మంది పిల్లలతో కలిసి గోవా సముద్ర తీరంలో కారు డ్రైవింగ్ చేస్తూ అల్లరి చేస్తుంది. ఈ సందర్భంగా…
దిల్ రాజు మాట్లాడుతూ ‘‘ సినిమాపై ప్యాషన్ ఎలా ఉంటుందనటానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ పాపారావుగారు. ఆయన అపాయింట్మెంట్ కోసం అందరూ తిరుగుతుంటారు. అలాంటి వ్యక్తి సినిమాపై ప్యాషన్తో తన జాబ్కి రిజైన్ చేసి సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్లో చాలా ప్రెజర్ ఉంటోంది. అందుకు మరో ఎగ్జాంపుల్ నా మనవడే. తనకు ఆరేళ్లు. తను ఉదయం ఆరేడు గంటలకే స్కూల్కి బయలుదేరితే సాయంత్రం ఐదు గంటలకు ఇంటికొస్తాడు. అంటే తెలియకుండా అంత ఒత్తిడి పిల్లలపై ఉంది. ఇది అన్ని ఫ్యామిలీస్లోఉండే సమస్య. ఇప్పుడు పిల్లలపై ఎడ్యుకేషన్ వల్ల ఎంత ప్రెషర్ పడుతుందనేది తెలియజేసే చిత్రమే మ్యూజిక్ స్కూల్. శ్రియా శరన్ మెయిన్ లీడ్గా, అందరు చిన్న పిల్లలతో ఈ సినిమాను చేశారు. ఇదొక సీరియస్ పాయింట్ కానీ దాన్ని వినోదాత్మకంగా మ్యూజికల్ ఫిల్మ్గా చేశారు పాపారావుగారు. గ్రేట్ ఇళయరాజాగారు సంగీతాన్ని అందించారు. మే 12న మూవీ రిలీజ్ అవుతుంది. చాలా రోజుల ముందు అభినందన సినిమాలో ఎనిమిది పాటలు, ఇంకా ఎక్కువ పాటలతో హమ్ ఆప్ కే హై కౌన్ సినిమాను ప్రేక్షకులు చూశారు. అలా 11 పాటలతో మ్యూజిక్ స్కూల్ ఓ మ్యూజికల్ ఎంటర్టైనర్గా వస్తుంది. ఈ సినిమాను తెలుగులో మేం రిలీజ్ చేస్తున్నాం. మిగతా నేషనల్ వైడ్ పి.వి.ఆర్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో పాపారావుగారు చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమ్కు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పాటలను ఆదిత్య వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. అందుకు నిరంజన్గారికి, ఉమేష్గారికి థాంక్స్’’ అన్నారు.
ఐఏఎస్ ఆఫీసర్, సినిమా అంటే ప్యాషన్ ఉన్న పాపారావు బియ్యాల మ్యూజిక్ స్కూల్ చిత్రం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా తల్లిదండ్రులు, టీచర్స్, సమాజం పిల్లలపై చదువు పేరుతో ఒత్తిడిని పెంచేస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల వారిలో అభివృద్ధి జరగటం లేదు, సరి కదా అదే వారి ఎదుగుదలకు సమస్యగా మారుతుంది. నిజానికి ఇదొక సీరియస్ పాయింట్, అయితే దాన్ని సంగీత రూపంలో వినోదాత్మకంగా చెప్పటానికి ప్రయత్నించాం’’ అన్నారు.
కిరన్ డియోహన్స్ సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేసిన ఈ చిత్రానికి అద్భుతమైన డాన్సులను కంపోజ్ చేశారు ఆడమ్ ముర్రు, చిన్ని ప్రకాష్, రాజు సుందరం.
ఓజూ బారువా, గ్రేసీ గోస్వామి కీలక పాత్రల్లో నటించారు. ఇంకా బెంజిమిన్ జిలాని, సుహాసిని మౌలే, మోన, లీలా సామ్సన్స్, బగ్స్ భార్గవ, వినయ్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, వకార్ షేక్, ఫణి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
యామిని ఫిల్మ్స్ బ్యానర్పై ఈ చిత్రానికి హిందీ, తెలుగు చిత్రీకరించి తమిళలో అనువాదం చేసి మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్చేస్తున్నారు. హిందీలో పి.వి.ఆర్, తెలుగులో దిల్ రాజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…