ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “స్కై” సినిమా నుంచి ‘నిన్ను చూసిన..’ లిరికల్ సాంగ్ రిలీజ్

Must Read

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా “స్కై”. పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న “స్కై” సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Ninnu Choosina - Lyrical | SKY | Murali Krishnam Raju | Shruti Shetty | Pridhvi Pericherla

తాజాగా ఈ చిత్రం నుంచి ‘నిన్ను చూసిన..’ అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు పృథ్వీ పెరిచెర్ల మంచి లిరిక్స్ రాయగా, మనీష్ కుమార్, వైష్ణవి ఆకట్టుకునేలా పాడారు. శివప్రసాద్ బ్యూటిఫుల్ ట్యూన్ తో కంపోజ్ చేశారు. “స్కై” సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ‘తపనే తెలుపగ..’, ‘పోయేకాలం నీకు..’ సాంగ్స్ ఛాట్ బస్టర్స్ గా మారి మిలియన్ వ్యూస్ రీచ్ అయ్యాయి. తాజాగా రిలీజ్ చేసిన ఈ ‘నిన్ను చూసిన..’ సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ ఆదరణ పొందుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

నటీనటులు – మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ భారతి, రాకేశ్ మాస్టర్, ఎంఎస్, కేఎల్ కే మణి బమ్మ, తదితరులు

టెక్నికల్ టీమ్

బ్యానర్ – వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – పృథ్వీ పెరిచెర్ల
డీవోపీ – రసూల్ ఎల్లోర్
ఎడిటర్ – సురేష్ ఆర్స్
పబ్లిసిటీ డిజైనర్ – కృష్ణ డిజిటల్స్
డిజిటల్ మీడియా – వినీత్ గౌడ్
ప్రొడ్యూసర్స్ – నాగిరెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు
డైలాగ్స్ , స్టోరీ – పృథ్వీ పెరిచెర్ల, మురళీ కృష్ణంరాజు
మ్యూజిక్ – శివ ప్రసాద్
లిరిక్స్ – పృథ్వీ పెరిచెర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – స్వాతి పెన్మెత్స, లిఖిత గుంటక
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News