యంగ్ అండ్ డైనమిక్ యాక్టర్ నిఖిల్ సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్వామి రారా, కేశవ వంటి సూపర్ డూపర్ సక్సెస్ల తర్వాత నిఖిల్, సుధీర్ వర్మ కాంబోలో రూపొందుతోన్న హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ఇది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, రెండు సాంగ్స్కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా ప్రారంభమైన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో సినిమా థియేట్రికల్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ను గమనిస్తే ఇందులో హీరో నిఖిల్ రిషి అనే రేసర్ పాత్రలో కనిపించనున్నారు. తనకు లవ్ స్టోరీస్ ఉంటాయి. రుక్మిణి వసంతన్ డబ్బు కోసం ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అలాగే దివ్యాంశ కౌశిక్తోనూ మరో ప్రేమ కథ ఉంటుంది.
రిషికి అనుకోకుండా డబ్బు మరో పని చేయడానికి ఒప్పుకుంటాడు. దీంతో అసలు గందరగోళం ప్రారంభమవుతుంది. ఓ చచ్చిన వ్యక్తిని తరలించటానికి రిషి సిద్ధమైనప్పుడు ఏం జరుగుతుంది. ఓ వైపు పోలీసులు, మరో వైపు గూండాలు అతన్ని వెంబడిస్తారు. చాలా సమస్యలు చుట్టుముడతాయి. అప్పుడు తన రేసింగ్ నైపుణ్యంతో వారి నుంచి రిషి ఎలా బయటపడ్డాడు. ఇంతకీ రిషి ఎవరి డెడ్ బాడీని తరలించాలని అనుకున్నాడు? అజయ్, జాన్ విజయ్.. రిషిని వెంబడించటానికి ఏ పరికరాన్ని వాడుతుంటారు? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
ఇదే ట్రైలర్లో సత్య, సుదర్శన్ పాత్రలను కూడా మనం చూడొచ్చు. నరాలు బిగపట్టేలా చేజింగ్ సన్నివేశాలు సినిమాలో ఉండబోతున్నాయి. సినిమాను ఉత్కంఠభరితమైన యాక్షన్ ప్యాక్డ్ మూవీగా తెరకెక్కించారు. యాక్షన్, రొమాన్స్, ఫన్ వంటి అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు ఈ సినిమాతో ఓ సరికొత్త థియేట్రికల్ ఎక్స్పీరియెన్స్ను పొందనున్నారు.
బాపినీడు.బి సమర్పణలో శ్రీవెకంటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి సంస్థపై ప్రముఖ సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ దీన్ని నిర్మించారు. రుక్మిణి వసంత్ ఈ చిత్రంతో తెలుగులోకి పరిచయం అవుతున్నారు. యోగేష్ సుధాకర్, సునీల్, షా, రాజా సుబ్రమణ్యం సహ నిర్మాతలు. సింగర్ కార్తీక్ ఈ చిత్రంలోని పాటలకు సంగీతాన్ని అందించగా సన్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్ను అందించారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్, నవీన్ నూలి ఎడిటర్గా వర్క్ చేశారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…