యంగ్ అండ్ డైనమిక్ యాక్టర్ నిఖిల్ సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్వామి రారా, కేశవ వంటి సూపర్ డూపర్ సక్సెస్ల తర్వాత నిఖిల్, సుధీర్ వర్మ కాంబోలో రూపొందుతోన్న హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ఇది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, రెండు సాంగ్స్కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా ప్రారంభమైన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో సినిమా థియేట్రికల్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ను గమనిస్తే ఇందులో హీరో నిఖిల్ రిషి అనే రేసర్ పాత్రలో కనిపించనున్నారు. తనకు లవ్ స్టోరీస్ ఉంటాయి. రుక్మిణి వసంతన్ డబ్బు కోసం ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అలాగే దివ్యాంశ కౌశిక్తోనూ మరో ప్రేమ కథ ఉంటుంది.
రిషికి అనుకోకుండా డబ్బు మరో పని చేయడానికి ఒప్పుకుంటాడు. దీంతో అసలు గందరగోళం ప్రారంభమవుతుంది. ఓ చచ్చిన వ్యక్తిని తరలించటానికి రిషి సిద్ధమైనప్పుడు ఏం జరుగుతుంది. ఓ వైపు పోలీసులు, మరో వైపు గూండాలు అతన్ని వెంబడిస్తారు. చాలా సమస్యలు చుట్టుముడతాయి. అప్పుడు తన రేసింగ్ నైపుణ్యంతో వారి నుంచి రిషి ఎలా బయటపడ్డాడు. ఇంతకీ రిషి ఎవరి డెడ్ బాడీని తరలించాలని అనుకున్నాడు? అజయ్, జాన్ విజయ్.. రిషిని వెంబడించటానికి ఏ పరికరాన్ని వాడుతుంటారు? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
ఇదే ట్రైలర్లో సత్య, సుదర్శన్ పాత్రలను కూడా మనం చూడొచ్చు. నరాలు బిగపట్టేలా చేజింగ్ సన్నివేశాలు సినిమాలో ఉండబోతున్నాయి. సినిమాను ఉత్కంఠభరితమైన యాక్షన్ ప్యాక్డ్ మూవీగా తెరకెక్కించారు. యాక్షన్, రొమాన్స్, ఫన్ వంటి అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు ఈ సినిమాతో ఓ సరికొత్త థియేట్రికల్ ఎక్స్పీరియెన్స్ను పొందనున్నారు.
బాపినీడు.బి సమర్పణలో శ్రీవెకంటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి సంస్థపై ప్రముఖ సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ దీన్ని నిర్మించారు. రుక్మిణి వసంత్ ఈ చిత్రంతో తెలుగులోకి పరిచయం అవుతున్నారు. యోగేష్ సుధాకర్, సునీల్, షా, రాజా సుబ్రమణ్యం సహ నిర్మాతలు. సింగర్ కార్తీక్ ఈ చిత్రంలోని పాటలకు సంగీతాన్ని అందించగా సన్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్ను అందించారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్, నవీన్ నూలి ఎడిటర్గా వర్క్ చేశారు.
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…