యంగ్ అండ్ డైనమిక్ యాక్టర్ నిఖిల్ సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్వామి రారా, కేశవ వంటి సూపర్ డూపర్ సక్సెస్ల తర్వాత నిఖిల్, సుధీర్ వర్మ కాంబోలో రూపొందుతోన్న హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ఇది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, రెండు సాంగ్స్కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా ప్రారంభమైన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో సినిమా థియేట్రికల్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ను గమనిస్తే ఇందులో హీరో నిఖిల్ రిషి అనే రేసర్ పాత్రలో కనిపించనున్నారు. తనకు లవ్ స్టోరీస్ ఉంటాయి. రుక్మిణి వసంతన్ డబ్బు కోసం ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అలాగే దివ్యాంశ కౌశిక్తోనూ మరో ప్రేమ కథ ఉంటుంది.
రిషికి అనుకోకుండా డబ్బు మరో పని చేయడానికి ఒప్పుకుంటాడు. దీంతో అసలు గందరగోళం ప్రారంభమవుతుంది. ఓ చచ్చిన వ్యక్తిని తరలించటానికి రిషి సిద్ధమైనప్పుడు ఏం జరుగుతుంది. ఓ వైపు పోలీసులు, మరో వైపు గూండాలు అతన్ని వెంబడిస్తారు. చాలా సమస్యలు చుట్టుముడతాయి. అప్పుడు తన రేసింగ్ నైపుణ్యంతో వారి నుంచి రిషి ఎలా బయటపడ్డాడు. ఇంతకీ రిషి ఎవరి డెడ్ బాడీని తరలించాలని అనుకున్నాడు? అజయ్, జాన్ విజయ్.. రిషిని వెంబడించటానికి ఏ పరికరాన్ని వాడుతుంటారు? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
ఇదే ట్రైలర్లో సత్య, సుదర్శన్ పాత్రలను కూడా మనం చూడొచ్చు. నరాలు బిగపట్టేలా చేజింగ్ సన్నివేశాలు సినిమాలో ఉండబోతున్నాయి. సినిమాను ఉత్కంఠభరితమైన యాక్షన్ ప్యాక్డ్ మూవీగా తెరకెక్కించారు. యాక్షన్, రొమాన్స్, ఫన్ వంటి అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు ఈ సినిమాతో ఓ సరికొత్త థియేట్రికల్ ఎక్స్పీరియెన్స్ను పొందనున్నారు.
బాపినీడు.బి సమర్పణలో శ్రీవెకంటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి సంస్థపై ప్రముఖ సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ దీన్ని నిర్మించారు. రుక్మిణి వసంత్ ఈ చిత్రంతో తెలుగులోకి పరిచయం అవుతున్నారు. యోగేష్ సుధాకర్, సునీల్, షా, రాజా సుబ్రమణ్యం సహ నిర్మాతలు. సింగర్ కార్తీక్ ఈ చిత్రంలోని పాటలకు సంగీతాన్ని అందించగా సన్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్ను అందించారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్, నవీన్ నూలి ఎడిటర్గా వర్క్ చేశారు.
విజయ్ ఆంటోని, శశి దర్శకత్వంలో వచ్చిన ‘బిచ్చగాడు’, అందులోని అమ్మ పాటకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇప్పటికీ అమ్మ…
ప్రఖ్యాత దర్శకులు దాసరి నారాయణరావు మరణానంతరం ఆయన పేరిట ప్రతి ఏటా ఘనంగా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తున్న ప్రముఖ నిర్మాత…
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది…
యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ…
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకప్పుడు అగ్ర కథానాయిక గా వెలుగొందారు మంజుల. ఎన్టీఆర్ తో మనుషులంతా ఒక్కటే, మగాడు,…
'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రాబోతుందో తెలుసుకోవాలనే…