తన గత రెండు చిత్రాలు దసరా, హాయ్ నాన్నలతో పాన్ ఇండియా విజయాల్ని ఆస్వాదిస్తున్న నేచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’తో వస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్తో హ్యుజ్ కాన్వాస్పై ఈ యూనిక్ అడ్రినలిన్ ఫిల్డ్ అడ్వంచర్ ని నిర్మిస్తున్నారు.
ఇంతకుముందు విడుదల చేసిన టీజర్ కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ నాని, సాయి కుమార్లతో కూడిన బ్రాండ్ న్యూ పోస్టర్ను విడుదల చేశారు. ఉగాది రోజున ఇది పర్ఫెక్ట్ పోస్టర్. సూర్యగా నాని, శంకరంగా సాయి కుమార్ ఇద్దరూ ఎథ్నిక్ వేర్లో చిరునవ్వుతో కనిపించారు. పోస్టర్లో మనం నిజంగా ఒక పండగ వాతావరణాన్ని చూడవచ్చు.
ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా, ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. మురళి జి డీవోపీగా చేస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
బ్యానర్: డివివి ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మురళి జి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్
ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్తో ము. మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా చేస్తున్న చిత్రం ‘నాన్న కుట్టి’. యాక్షన్,…
సినీ కార్మికులకు అండగా నిలబడటంలో ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ నిర్మాత, దర్శకులు చదలవాడ శ్రీనివాసరావు. చిత్రపురి కాలనీకి కోట్లాది రూపాయల…
వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఆయన హీరోగా…
రాకింగ్ మంచు మనోజ్ స్టైలిష్ కమ్బ్యాక్కు రంగం సిద్దమైంది. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 'వడ్డీ కాసుల…
హాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్’ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్ను…
టాలీవుడ్లో ప్రముఖ స్టార్ హీరో రా కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్ని అలరించారు. ఎప్పుడూ ప్రయోగాత్మక…