తన గత రెండు చిత్రాలు దసరా, హాయ్ నాన్నలతో పాన్ ఇండియా విజయాల్ని ఆస్వాదిస్తున్న నేచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’తో వస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్తో హ్యుజ్ కాన్వాస్పై ఈ యూనిక్ అడ్రినలిన్ ఫిల్డ్ అడ్వంచర్ ని నిర్మిస్తున్నారు.
ఇంతకుముందు విడుదల చేసిన టీజర్ కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ నాని, సాయి కుమార్లతో కూడిన బ్రాండ్ న్యూ పోస్టర్ను విడుదల చేశారు. ఉగాది రోజున ఇది పర్ఫెక్ట్ పోస్టర్. సూర్యగా నాని, శంకరంగా సాయి కుమార్ ఇద్దరూ ఎథ్నిక్ వేర్లో చిరునవ్వుతో కనిపించారు. పోస్టర్లో మనం నిజంగా ఒక పండగ వాతావరణాన్ని చూడవచ్చు.
ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా, ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. మురళి జి డీవోపీగా చేస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
బ్యానర్: డివివి ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మురళి జి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్
హైదరాబాద్:ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలను ఎండగట్టే ఉత్కంఠ రేపుతూ ఆసక్తికరంగా సాగే కథనంతో తెలుగు తెరపైకి ఓ సినిమా రాబోతుంది. రాజేష్…
▪️తెలుగు సినీ పరిశ్రమలో తొలి పూర్తి స్థాయి AI మూవీ▪️విడుదలకు సిద్ధమవుతూ ప్రచార పర్వం ప్రారంభంహైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో…
జూలై 2 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్న కామెడీ-డ్రామాలో కుక్కుటేశ్వరరావు పాత్రలో మురళీ శర్మ మూడు దశాబ్దాలకుపైగా హిందీ, తెలుగు,…
ఆంధ్రుల ఆరాధ్య దైవంగా వెండితెరపై మూడున్నర దశాబ్దాల పాటు వెలిగి తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన నందమూరి తారక…
భద్ర సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక చిత్రం సంచలనం…
తెలుగు సినిమా లోకానికి, తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు శివాజీ. నటుడిగా, హీరోగా ఎన్నో విలక్షణమైన…