తన గత రెండు చిత్రాలు దసరా, హాయ్ నాన్నలతో పాన్ ఇండియా విజయాల్ని ఆస్వాదిస్తున్న నేచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’తో వస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్తో హ్యుజ్ కాన్వాస్పై ఈ యూనిక్ అడ్రినలిన్ ఫిల్డ్ అడ్వంచర్ ని నిర్మిస్తున్నారు.
ఇంతకుముందు విడుదల చేసిన టీజర్ కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ నాని, సాయి కుమార్లతో కూడిన బ్రాండ్ న్యూ పోస్టర్ను విడుదల చేశారు. ఉగాది రోజున ఇది పర్ఫెక్ట్ పోస్టర్. సూర్యగా నాని, శంకరంగా సాయి కుమార్ ఇద్దరూ ఎథ్నిక్ వేర్లో చిరునవ్వుతో కనిపించారు. పోస్టర్లో మనం నిజంగా ఒక పండగ వాతావరణాన్ని చూడవచ్చు.
ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా, ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. మురళి జి డీవోపీగా చేస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
బ్యానర్: డివివి ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మురళి జి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్
'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…