ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్లోనూ ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్న అరుదైన నటుడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం నాని నటిస్తున్న ‘దసరా’ చిత్రం మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్లో ఆయన్ని ప్రెజెంట్ చేయబోతోంది. విలక్షణమైన కథలను ప్రయత్నించే నాని తన మైల్ స్టోన్ 30వ ప్రాజెక్ట్ను ప్రకటించారు.
#నాని30 వైర ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా రూపొందబోతుంది. మోహన్ చెరుకూరి (సివిఎం) తన స్నేహితులు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ ..మంచి కంటెంట్ సినిమాలు తీయడానికి, బిగ్ స్క్రీన్పై వారి కథ-కథనంతో వైవిధ్యం చూపాలనే దృక్పథంతో ఈ బ్యానర్ను ప్రారంభించారు.
ఈ ముగ్గురూ వివిధ సొంత వెంచర్లు కలిగివున్నారు. చిన్ననాటి నుండి వీరికి సినిమాలపై ప్రధాన ఆసక్తి. వారి నిర్మాణంలో మల్టీపుల్ ప్రాజెక్ట్స్ ని సెట్ చేశారు. తొలి చిత్రంగా నాని 30వ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమకు అవకాశం ఇచ్చిన నానికి కృతజ్ఞతలు తెలిపారు.
నాని కథానాయకుడిగా నటించబోతున్న ఈ చిత్రం ఖచ్చితంగా విలక్షణమైన చిత్రం అవుతుంది. మేకర్స్ జనవరి 1వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు #Nani30 వరల్డ్ ని ఆవిష్కరిస్తారు.
ఈ బ్లాక్ అండ్ వైట్ పోస్టర్లో, నాని కుర్చీలో కూర్చుని తన ఫోన్లో బ్రౌజ్ చేస్తున్నాడు.
#నాని30కి సంబంధించిన దర్శకుడు, ఇతర ముఖ్యమైన వివరాలు న్యూ ఇయర్ సందర్భంగా తెలియజేస్తారు.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్హిట్ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్. ఈయన…
తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…
ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ కల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు…
దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…
అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్…