మైత్రీ మూవీ మేకర్స్ ప్రజెంట్స్, సత్య, రితేష్ రానా, క్లాప్ ఎంటర్టైన్మెంట్ ‘జెట్లీ’ హ్యుమర్ ఫిల్డ్ యాక్షన్ గ్లింప్స్ రిలీజ్
టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ చిత్రంతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా తెలుగులో పరిచయం కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ ఈరోజు సినిమా గ్లింప్స్ను లాంచ్ చేశారు.
సత్య వాయిస్ లో వేమన శతకంతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. అకస్మాత్తుగా అల్లకల్లోలం ప్రయాణికులను భయాందోళనకు గురికావడం, తుపాకీ కాల్పులు, హైజాక్ గురించి సూచిస్తూ, సత్య పరిచయం కావడం ఆకట్టుకుంది
సత్య పాత్రను పూర్తిగా హ్యూమర్ టచ్తో డిజైన్ చేశారు. మేకోవర్ తో అతని స్క్రీన్ ప్రెజెన్స్ మరింత హైలైట్ అవుతూ, సత్య ట్రేడ్మార్క్ కామిక్ టైమింగ్ అదిరిపోయింది.
సత్య–వెన్నెల కిషోర్ మధ్య వచ్చే డైలాగ్స్ గ్లింప్స్కు మరింత చార్మ్ని యాడ్ చేశాయి. నివ్వు ఏ టైర్ హీరో అని అడిగినప్పుడు, “జనరల్ కంపార్ట్మెంట్” అంటూ సత్య అన్సర్ ఇవ్వడం ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయ్యింది.
ఈ గ్లింప్స్లో లీడ్ హీరోయిన్ రియా సింఘా, అజయ్, హర్షతో పాటు ఇతర ముఖ్య పాత్రలన్నింటినీ కూడా ఎఫెక్టివ్గా పరిచయం చేశారు.
మత్తు వలదరా వెనుక ఉన్న మెయిన్ టీం ఈ సినిమా క్రియేటివ్ ఇంజిన్ గా పని చేస్తున్నారు. మ్యూజిక్ కాల భైరవ, సినిమాటోగ్రాఫర్ సురేష్ సారంగం, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్ నార్ని శ్రీనివాస్ తో కలిసి రితేష్ రానా మరోసారి యూనిక్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశారు.
ఈ గ్లింప్స్ రితేష్ రాణా స్టైల్కు సిగ్నేచర్గా నిలిచే హ్యూమర్తో పాటు హై-ఎనర్జీ యాక్షన్ మేళవించిన ఒక ఫన్-ప్యాక్డ్ ఎక్స్ పీరియన్స్ ని ప్రామిస్ చేస్తోంది.
గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో సత్య మాట్లాడుతూ.. రితేష్, చెర్రీ గారితో మళ్ళీ కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా మధ్య మంచి క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఇందులో స్పెషల్ హీరోలా అంటూ ఏమీ ఉండదు. యాక్షన్ లో కూడా కామెడీని ఫీల్ అవుతారు. మత్తు వదలరా సక్సెస్ తర్వాత నాకు వచ్చిన అవకాశాలు పెరిగాయి. చెర్రిగారితో సినిమా అనగానే నేను ఇంకేది ఆలోచించలేదు. నేను కథని డైరెక్టర్ నే ఫాలో అవుతాను. ఆ క్యారెక్టర్ తగ్గట్టు స్పాట్లో నాకు ఏదైనా అనిపిస్తే అది చెప్తాను. అయితే మొత్తం అంతా డైరెక్టర్ మీదే ఉంటుం.ది ఈ సినిమా కోసం యాక్షన్ చేశాను. నాన్చక్ నేర్చుకున్నాను.
డైరెక్టర్ రితేష్ రానా మాట్లాడుతూ .. ఇక్కడి విచ్చేసిన సత్య గారి ఫ్యాన్స్ కి నమస్కారం, సత్యతో మూవీ అనగానే రియా సైన్ చేసింది. తన అందం అభినయం సత్యాతో సరి సమానంగా ఉంది. ఈ సినిమా డిఓపి సురేష్ సారంగం సత్య క్లోజప్స్ తీస్తున్నప్పుడు కెమెరా కనిపెట్టింది ఇతని కోసమే ఏమో అని చెప్పాడు. కార్తీక్ శ్రీనివాస్ సత్య కాకుండా వేరే వాళ్ళ సీన్స్ ఎలా ఎడిట్ చేయాలని ఎడిట్ రూమ్ లో తంటాలు పడుతున్నారు. ఆల్రెడీ సత్య యాక్టింగ్ తో వాయిస్తున్నాడు నేనెందుకు మళ్లీ వాయించడం అని కాలభైరవ అన్నాడు. కాస్ట్యూమ్ డిజైనర్ తేజ తన డిజైన్ చేసిన కాస్ట్యూమ్ కి సత్య వల్లే అందం వచ్చిందని ఫీలయ్యాడు. ఫైట్ మాస్టర్ అంజి సత్య దగ్గర చాలా ఫైటింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నానని చెప్పాడు. ప్రొడక్షన్ డిజైనర్స్ మేము ఎన్ని సెట్స్ వేసిన ఈ సినిమాకి పెద్ద ఎసెట్ సత్య అని అన్నారు. ఒక డైరెక్టర్ గా నాకు జన్మనిచ్చింది సత్య. నా గాడ్ ఫాదర్ సత్య గారే. ఆయన బ్రేక్ ఇవ్వడం వల్లే నేను లంచ్ చేసి వచ్చాను( నవ్వుతూ). సత్య అభిమానులందరికీ ఒక మాట చెప్తున్నాను. మీకు మార్నింగ్ హెవీ బ్రేక్ ఫాస్ట్ చేసే అలవాటు లేకపోతే మార్నింగ్ సోకి రాకండి. ఎందుకంటే మేము మార్నింగ్ షో నే ఫుల్ మీల్స్ పెడతాం.
నిర్మాత చెర్రీ మాట్లాడుతూ.. నవంబర్ 17న ఈ సినిమా మొదలుపెట్టాం. ఇప్పటికే 60శాతం షూటింగ్ పూర్తయింది. బ్యాలెన్స్ జనవరి ఫెబ్రవరి నాటికి పూర్తయిపోతుంది. సమ్మర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం. ఇది అవుట్ అఫ్ ది బాక్స్ మూవీ. యూనిక్ కాన్సెప్ట్. సినిమా అంతా ఫ్లైయిట్ లో షూట్ చేశాం. సినిమా చాలా ఎక్సయిటింగ్ గా వుంటుంది. రితేష్ రానా, సత్యతో మరోసారి కలిసి పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి కంటెంట్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అందరికీ థాంక్.
రియా సింఘా మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం చాలా అనందంగా వుంది. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. టీం అందరికీ థాంక్ యూ. ఈ సినిమాతో తెలుగులోకి రావడం హ్యాపీగా వుంది.
తారాగణం: సత్య, రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: రితేష్ రానా
నిర్మాతలు: క్లాప్ ఎంటర్టైన్మెంట్, చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్ (నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి)
కథ – స్క్రీన్ప్లే: రితేష్ రానా & జయేంద్ర ఎరోలా
డైలాగ్స్: రితేష్ రానా
సంగీతం: కాల భైరవ
D.O.P: సురేష్ సారంగం
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్: తేజ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్
యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చున్ అంజి
కో-డైరెక్టర్: చుక్కా విజయ్ కుమార్
డైరెక్షన్ గ్యాంగ్: ప్రభావ్ కర్రి, పి.వి.సాయి సోమయాజులు, విక్రమ్ రామిరెడ్డి, కౌశిక్ రాజు
పోస్టర్స్: శ్యామ్
PRO: వంశీ – శేఖర్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…