ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకత్వంలో హ్రిదు హరూన్ ను హీరోగా పరిచయం చేస్తూ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం ‘కోనసీమ థగ్స్’. సింహ, ఆర్ కె సురేష్, మునిష్ కాంత్, అనస్వర రంజన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ షిబు తమీన్స్ తనయురాలు రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై జియో స్టూడియోస్ భాగస్వామ్యంతో భారీ స్థాయిలో నిర్మించారు.
టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఇటీవలే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ ఎల్ పి పేరిట పంపిణీ రంగంలోకి కూడా ప్రవేశించారు. సంక్రాంతి కి విడుదలై ఘనవిజయం సాధించిన భారీ చిత్రాలు వాల్తేర్ వీరయ్య, వీర సింహా రెడ్డి లను నిర్మించడమే కాకుండా ఒకే సమయంలో నైజాం ఏరియాలో రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు మైత్రి సంస్థ వారు. ఆద్యంతం ఉత్కంఠ రేపేలా రూపొందిన కోనసీమ థగ్స్ సంబంధించి ట్రైలర్, పోస్టర్స్, అమ్మన్ సాంగ్ చూసి ఇంప్రెస్ అయ్యి తెలుగు వెర్షన్ ను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ ఎల్ పి ద్వారా అన్ని ఏరియాల్లోనూ రిలీజ్ చేస్తున్నారు.
ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన కోనసీమ థగ్స్ ఇటీవల విడుదలైన అమ్మన్ పాటతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో సినిమా పట్ల మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మైత్రి సంస్థ జత కలవడంతో, చిత్రం భారీ స్థాయిలో ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ కానుంది. చిత్ర బృందం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఈ నెల 19న నిర్వహించనుంది.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…