టెంపుల్ మీడియా పతాకంపై సి. జగన్మోహన్ ( మాయాబజార్ జగన్మోహన్ ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘S-99 ‘. ఇటీవలే ఫస్ట్ లుక్ ను ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ రిలీజ్ చేసిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే.. కాగా ఈ చిత్ర మొదటి టీజర్ ను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేయగా, రెండవ టీజర్ ను నేడు మురళీమోహన్ విడుదల చేసారు.
ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ’ గతంలో మాయాబజార్ ను కలర్ చేసి ఈ సినిమా విజయాన్ని అందుకున్న జగన్మోహన్ గారు తాజాగా S-99 చిత్రానికి డైరెక్షన్ చేయడం జరిగింది.S-99 టీజర్ 2 విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మాయాబజార్ లాగా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నాను’అని అన్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జగన్మోహన్ మాట్లాడుతూ, ‘S-99 ‘ రెండవ టీజర్ను మురళీమోహన్ గారు లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది.ఇంకా ఈ సినిమాకు సంబంధించిన నాలుగు టీజర్ లను సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ నెలలో రిలీజ్ చేసి, సినిమాను త్వరలోనే రిలీజ్ చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్వేతా వర్మ, ప్రొడ్యూసర్ యతీష్ పాల్గొన్నారు.
హీరో: జగన్మోహన్
హీరోయిన్: శ్వేతా వర్మ
కెమెరా:వీ. శ్రీనివాస్
ఎడిటర్: సనాల్ అనిరుదన్
డైరెక్టర్: జగన్మోహన్
ప్రొడ్యూసర్స్: యతీష్ అండ్ నందిని
పి ఆర్ ఓ :బి. వీరబాబు
'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…