ఆక్వా మెరైన్ కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పిన సినీ ప్ర‌ముఖులురేపు హైకోర్ట్ లో విచార‌ణ‌

సామాజిక ప్ర‌యోజ‌నాలు కాపాడుకోవ‌డం ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ పోరాడ‌టం అనేది అంద‌రి బాధ్య‌త‌.ఆ బాధ్య‌త‌ను స్వ‌చ్చందంగా చేప‌ట్టి పోరాడుతున్నారు కొంద‌రు సినీప్ర‌ముఖులు. కొత్వాల్ గూడ లో దేశంలోనే భారీ ఆక్వా మెరైన్ పార్క్ కు ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఆహ్లాదం కోసం నిర్మిస్తున్న ఈ పార్క్ ప‌ర్యావ‌ర‌ణానికి పెద్ద ముప్పు కాబోతుంద‌ని సినీ న‌టులు రేణూదేశాయ్, శ్రీదివ్య , ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ తిక్కా తో పాటు మ‌రికొంద‌రు ప్ర‌ముఖులు ప్ర‌జా ప్రయోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేసారు.


ఏటువంటి ప‌ర్యావ‌ర‌ణ అధ్య‌య‌నం లేకుండా చేప‌ట్టిన ఈ అక్వా మెరైన్ పార్క్ నిర్మాణం ఆపివేయాలంటూ కోర్ట్ ను ఆశ్ర‌యించారు. ఇటువంటి పార్క్ ల నిర్మాణం సింగ‌పూర్ , మ‌లేసియా వంటి దేశాల‌లో జ‌రిగాయి మ‌న దేశంలో ఎందుకు సాధ్యం కాద‌ని కోర్ట్ ప్ర‌శ్నించింది. అయితే వీటికి స‌మాధానం గా పిటీష‌న‌ర్ త‌రపున న్యాయ‌వాది శ్రీర‌మ్య వాద‌న‌లు వినిపిస్తూ ఎటువంటి ప‌ర్యావ‌ర‌ణ అధ్య‌య‌నం లేకుండా ఏర్పాటుచేసే ఈ పార్క్ ల‌తో జ‌ల‌చ‌రాల‌కు, వ‌న్య ప్రాణుల‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌నే వాద‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న ధ‌ర్మాస‌నం ప్ర‌భుత్వానికి, హెచ్ ఎమ్ డీ ఏ ల‌కు నోటీసులు జారీ చేసింది. ప్ర‌ధాన న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ఉజ్జ‌ల్ భుయాన్ , జ‌స్టిస్ తుకారంజీలు ఆధ్వ‌ర్యంలో ఈ కేసు విచార‌ణ జ‌రుగుతుంది.

ఈ సంద‌ర్భంగా పిటీష‌న‌ర్స్ లో ఒక‌రైన ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ తిక్కా మాట్లాడుతూః
ప‌ర్యావ‌ర‌ణానికి చేటు చేసే విధంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ పై మేము చేస్తున్న ఈ పోరాటం కు మీ మ‌ద్ద‌తు కూడా కావాలి. వేలాది జ‌ల‌చ‌రాల మ‌నుగ‌డ కు ముప్పు వాటిల్లే ఆక్వా మైరైన్ పార్క్ లు ప‌ర్యావ‌ర‌ణాన్ని దెబ్బ తీస్తాయి. వాటిని ఆహ్లాదం కోసం మ‌న‌ముందుకు తీసుకొచ్చే ప్ర‌య‌త్నంలో చాలా చ‌నిపోతాయి. త‌రువాత క‌త్రిమంగా ఏర్పాటు చేసిన లైట్స్ లో వాటి జీవ‌నం అత్యంత బాధాక‌రంగా మారుతుంది. వేల గ్యాల‌న్ల నీటితో న‌డిచే ఈ ఆక్వా పార్క్ లు నీటి స‌మ‌స్య‌కు కార‌ణం అవుతాయి. ఇలాంటి పార్క్ ల నిర్మాణం చాలా దేశాలు వ్య‌తిరేకిస్తున్నాయి. అన్నారు.

న‌టి స‌ద మాట్లాడ‌తూః

ఇప్ప‌టికే న‌గ‌రంలో నీటి స‌మ‌స్య చాలా పెరుగుతుంది. మూడు వేల గ్యాల‌న్ల నీటితో నిర్మాణం అయ్యేఇలాంటి ఆక్వా పార్క్ లు నీటి స‌మ‌స్య కు కార‌ణం అవుతాయి. స‌హాజంగా స‌ముద్రాల‌లో పెరిగేజ‌ల‌చ‌రాలును ప‌ట్టి క‌త్రిమంగా నిర్మాణం అయ్యే ఇలాంటి పార్క్ ల‌లో ఉంచ‌డం వాటి ప్రాణాల‌కే ప్ర‌మాదంగా మారుతుంది. వాటిని ప‌ట్టి తెచ్చే ప్ర‌క్రియ‌లోనే చాలా జ‌ల‌చరాలు ప్రాణాలు కోల్పోతాయి.ఇలాంటి పార్క్ లు కాకుడా ఎన్విరాన్ మెంట్ పై అవ‌గాహాన పెంచే పార్క్ ల‌ను ఎచ్ ఎమ్ డి ఎ వారు ఏర్పాటు చేస్తే మంచిది. అన్నారు.

Tfja Team

Recent Posts

హీరో సుడిగాలి సుధీర్ “సుధీర్స్ జోకర్” సినిమా నుంచి వెర్సటైల్ యాక్టర్ మురళీశర్మ బర్త్ డే పోస్టర్ రిలీజ్

-"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్…

2 days ago

ఫ్రెండ్లీ ఘోస్ట్ టీజర్ విడుదల !!!

ఫోనిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై, మాస్టర్ జియాన్స్ సమర్పణలో సత్యం రాజేష్, రియా సచ్యదేవ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న “ఫ్రెండ్లీ ఘోస్ట్”…

3 days ago

ఘనంగా ‘శివ గాడి జింద‌గీ’ మూవీ టైటిల్, సాంగ్ లాంచ్!

ఐశ్వర్య సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సింధుసూర్య నిర్మిస్తున్న నూతన చిత్రం 'శివ గాడి జింద‌గీ'. సచిన్ రామ్ ప్రతాప్, హాసిని…

3 days ago

హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) “ది మేజ్” చిత్రంతో దర్శకుడిగా ప్రతిభ చాటనున్న డా. రవికిరణ్ గడలాయ్

ది మేజ్" చిత్రంతో దర్శకుడిగా డాక్టర్ కాబోయి యాక్టర్ కావడం చూస్తుంటాం కానీ డా. రవికిరణ్ గడలాయ్ ఎం.డి, పాథాలజిస్ట్…

3 days ago

‘అగధ’ డివైన్ మిస్టిక్ థ్రిల్లర్‌గా చాలా అద్భుతంగా ఉంటుంది – హీరో శ్రవణ్ రెడ్డి

ఎంఎస్ రాజు గారు ‘అగధ’ సీక్వెల్ ఎప్పుడు అంటారో చూడాలి - హీరో శ్రవణ్ రెడ్డి శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్…

3 days ago

పాతబస్తీ మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో బంగారు బోనం ఎత్తిన సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల

హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని…

3 days ago