▪️ ఉపాధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా మోహన్ వడ్లపట్లకు అత్యధిక మెజార్టీ
▪️ ‘మన ప్యానెల్’ ప్రభంజనం
హైదరాబాద్: తెలుగు చిత్ర నిర్మాతల మండలి (TFPC) 2026 ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్ష (వైస్ ప్రెసిడెంట్) పదవి కోసం నలుగురు అభ్యర్థులు—మోహన్ వడ్లపట్ల, జీవిత, దామోదర్ ప్రసాద్, భరత్ చౌదరి పోటీ పడ్డారు. వీరిలో ‘మన ప్యానెల్’ తరఫున నిలబడిన మోహన్ వడ్లపట్ల అందరికంటే అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించి మొత్తం 15 స్థానాల్లో ‘మన ప్యానెల్’కు చెందిన 12 మంది అభ్యర్థులు విజయం సాధించారు.
మొత్తంగా నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ ఆధిపత్యం స్పష్టంగా కనిపించగా, నలుగురి పోటీలో మోహన్ వడ్లపట్ల సాధించిన భారీ విజయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనపై నిర్మాతల సమస్యల పరిష్కారం, పరిశ్రమ ప్రయోజనాల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉంది.
NRIగా మోహన్ వడ్లపట్లకు సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు
మోహన్ వడ్లపట్ల NRIగా ఉంటూ తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. దర్శకుడు, నిర్మాతగా ఆయన పలు వైవిధ్యమైన చిత్రాలను రూపొందించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సైకాలజికల్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘M4M’ (Motive For Murder) అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందింది.
అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సైకో-కిల్లర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రం విడుదలకు ముందే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా ఈ చిత్రం 15కి పైగా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.
‘M4M-2’ సీక్వెల్ ప్రకటన
‘M4M’ అమెరికాలో విజయవంతంగా 60 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై 2026లో శాన్ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో చిత్ర బృందం అధికారిక సీక్వెల్ను ప్రకటించింది. ‘M4M-2: Killer Games’ పేరుతో ఈ సీక్వెల్ రూపొందనుంది. ఇందులోనూ మోహన్ వడ్లపట్ల, హీరోయిన్ జో శర్మ కలిసి పనిచేయనున్నారు.
OTTలోనూ ‘M4M’కు ఆదరణ
థియేట్రికల్ రన్ ముగిసిన అనంతరం ‘M4M’ చిత్రం జూన్ 19, 2026 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. Lionsgate Play, Amazon Prime Video వంటి ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారమ్లలో ఈ చిత్రం OTT ప్రేక్షకులను అలరిస్తోంది.
నిర్మాతగా పలు వైవిధ్యమైన చిత్రాలు
మోహన్ వడ్లపట్ల తన సొంత బ్యానర్ *‘మోహన్ మీడియా క్రియేషన్స్’*పై పలు తెలుగు చిత్రాలను నిర్మించారు.
‘మల్లెపూవు’ (2008): భూమిక చావ్లా, మురళీ కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన అందమైన ప్రేమకథా చిత్రం.
‘మెంటల్ కృష్ణ’ (2009): నటుడు సత్యం రాజేష్ హీరోగా, శ్రీహరి ముఖ్య పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా చిత్రం.
‘కలవరమాయే మదిలో’ (2009): కలర్స్ స్వాతి, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో నటించగా, సతీష్ కాశెట్టి దర్శకత్వం వహించిన మ్యూజికల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం.
నిర్మాతగా, దర్శకుడిగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న మోహన్ వడ్లపట్ల తాజాగా తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో, నిర్మాతల సమస్యలు, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేపడతారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. '90s'…
జెజె ఆర్ట్ మూవీస్, పవనసుత ప్రొడక్షన్స్, గాయత్రి సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా మహేష్ కుమార్ సంక, భగవాన్ నిర్మాతలుగా మణికంఠ…
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…
తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal