మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ‘సంబరాల యేటిగట్టు (SYG)’ గ్లింప్స్.. గూస్ బంప్స్ తెప్పించేలా విజువల్స్, యాక్షన్స్, హీరో లుక్

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు (అక్టోబర్ 15) సందర్భంగా ప్రెస్టీజీయస్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ‘సంబరాల యేటిగట్టు (SYG)’ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. అసుర ఆగమన అంటూ రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. దాదాపు ₹125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ ప్రాజెక్ట్ సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రంగా మారనుంది. ఈ మూవీ వరల్డ్‌ని పరిచయం చేసేందుకు తేజ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ మాత్రం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద ఈ మూవీని కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు నిర్మించారు. రోహిత్ కె.పి దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ‘అసుర సంధ్య వేళ మొదలైంది’ అంటూ తేజ్ చివర్లో చెప్పిన డైలాగ్, అంతకు ముందు చూపించిన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉన్నాయి. ఇక తేజ్ ఈ మూవీ కోసం ఎంత కష్టపడ్డాడు.. ఎంతలా తన శరీరాకృతిని మార్చుకున్నాడు.. అందుకోసం ఎంత కష్టపడ్డాడు అన్న విషయాలు అర్థం అవుతున్నాయి.

కండలు తిరిగిన ఆ దేహాన్ని చూస్తుంటే సాయి దుర్గ తేజ్ ఎంతలా శ్రమించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘సంబరాల ఏటి గట్టు’ మూవీలో ఓ యోధుడిలా కనిపించేందుకు తేజ్ వ్యాయామం, కఠినమైన డైట్ అంటూ చాలా కష్టపడుతున్నారు. ‘అసుర ఆగమనం’ అంటూ ఒక్క గ్లింప్స్‌తోనే నేషనల్ వైడ్‌గా మంటలు పుట్టించేశారు. పాన్ ఇండియా స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగా విజువల్స్, బీజీఎం, యాక్షన్ సీక్వెన్స్ కనిపిస్తున్నాయి.

ఈ మూవీని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు టీం శ్రమిస్తోంది. సినిమాటోగ్రాఫర్ వెట్రివేల్ పళనిసామి కెమెరా పనితనం గురించి గ్లింప్స్ చెబుతోంది. యాక్షన్ కొరియోగ్రఫీ మరింత ప్రత్యేక ఆకర్షణీయంగా మారనుందనిపిస్తోంది. అజనీష్ లోక్‌నాథ్ బీజీఎం అయితే గూస్ బంప్స్‌‌లా ఉంది. ఎడిటర్ నవీన్ విజయ కృష్ణ, ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్ ఈ ప్రాజెక్ట్ కోసం ప్రాణం పెట్టి పని చేస్తున్నారు.

ఈ గ్లింప్స్‌తో సంబరాల యేటిగట్టు (SYG) ఓ భారీ యాక్షన్, ఎమోషనల్, పీరియాడిక్ డ్రామాగా ఉంటుందని అర్థం అవుతోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో పాన్-ఇండియా వైడ్‌గా విడుదలకు సిద్ధం అవుతోంది.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

17 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago