ప్రస్తుతం మన తెలుగు సినిమా ఖ్యాతి, తెలుగు హీరోల స్థాయి ప్రపంచ దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన దేవర సినిమాను జపాన్లో భారీ ఎత్తున ప్రమోట్ చేశారు. ఆర్ఆర్ఆర్ తరువాత అక్కడ మ్యాన్ ఆఫ్ మాసెస్కు విపరీతమైన క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. అందుకే అక్కడి అభిమానుల్ని అలరించేందుకు దేవరను జపాన్లో రిలీజ్ చేశారు. ఈ క్రమంలో అక్కడి మీడియా, అభిమానులతో ఎన్టీఆర్ ముచ్చటించారు.
ఈ క్రమంలో ఓ అభిమాని ఎన్టీఆర్ వద్దకు వచ్చి తెలుగులో మాట్లాడారు. జపాన్లో ఇలా తెలుగు మాట్లాడటం ఏంటి? అని ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. దీంతో ఆ ఎమోషనల్ వీడియోని పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత ఒక జపనీస్ అభిమాని తెలుగు నేర్చుకోవడం ప్రారంభించారట. ఆ అభిమాని గురించి చెబుతూ ఎన్టీఆర్ ఓ పోస్ట్ వేశారు. సినిమా అనేది భాషా సరిహద్దుల్ని చెరిపేస్తుందని, అందరినీ ఏకం చేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అన్నట్టుగా చెప్పుకొచ్చారు.
‘నేను జపాన్కి వచ్చినప్పుడల్లా అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి. అయితే ఈ సారి మాత్రం కాస్త భిన్నమైన అనుభూతి కలిగింది. ఒక జపనీస్ అభిమాని ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత తాను తెలుగు నేర్చుకున్నానని చెప్పడం విని నిజంగా నన్ను కదిలించింది. సంస్కృతుల మధ్య వారధిగా ఉండటానికి సినిమా అనేది ఓ శక్తిలా ఉంటుందని చాటి చెప్పారు. సినిమా, భాషల ప్రేమికుడిగా ఒక అభిమానిని భాష నేర్చుకోవడానికి ఆ సినిమా ప్రోత్సహించింది అని చెప్పడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలాంటి వాటి కోసమే మన ఇండియన్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామ’ని ఎన్టీఆర్ అన్నారు.
'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…