ఆవిష్కరణముఖ్యఅతిథులుగా జయేష్ రంజన్, భవేశ్ మిశ్రా, తనికెళ్ల భరణి
హైదరాబాద్ వేదికగా టీ-వర్క్స్ కొత్త ఆవిష్కణలకు నాంది పలికింది. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి మేక్ ఇట్ మెట్రో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈవెంట్లో ముఖ్యఅతిథులుగా ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. భవిష్యత్లో నూతన ఆవిష్కరణలకు టీ-వర్క్స్ గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్ను అద్భుతంగా తీర్చిదిద్దారని, తాను మెట్రో రైలు ఎక్కి చాలా రోజులైందని తెలిపారు. టీ-వర్క్స్ ప్రతినిధి అజయ్ మాట్లాడుతూ… హైదరాబాద్లో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు మెట్ర్రో ఎక్కుతున్నారన్నారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో టీ-వర్క్స్ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
▪️ వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'వనజీవి రామయ్య' మూవీ టీమ్ సమక్షంలో ఘనంగా వనజీవి 90 వ జయంతి సందర్భంగా…
హైదరాబాద్:ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలను ఎండగట్టే ఉత్కంఠ రేపుతూ ఆసక్తికరంగా సాగే కథనంతో తెలుగు తెరపైకి ఓ సినిమా రాబోతుంది. రాజేష్…
▪️తెలుగు సినీ పరిశ్రమలో తొలి పూర్తి స్థాయి AI మూవీ▪️విడుదలకు సిద్ధమవుతూ ప్రచార పర్వం ప్రారంభంహైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో…
జూలై 2 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్న కామెడీ-డ్రామాలో కుక్కుటేశ్వరరావు పాత్రలో మురళీ శర్మ మూడు దశాబ్దాలకుపైగా హిందీ, తెలుగు,…
ఆంధ్రుల ఆరాధ్య దైవంగా వెండితెరపై మూడున్నర దశాబ్దాల పాటు వెలిగి తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన నందమూరి తారక…
భద్ర సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక చిత్రం సంచలనం…