ఆవిష్కరణముఖ్యఅతిథులుగా జయేష్ రంజన్, భవేశ్ మిశ్రా, తనికెళ్ల భరణి
హైదరాబాద్ వేదికగా టీ-వర్క్స్ కొత్త ఆవిష్కణలకు నాంది పలికింది. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి మేక్ ఇట్ మెట్రో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈవెంట్లో ముఖ్యఅతిథులుగా ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. భవిష్యత్లో నూతన ఆవిష్కరణలకు టీ-వర్క్స్ గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్ను అద్భుతంగా తీర్చిదిద్దారని, తాను మెట్రో రైలు ఎక్కి చాలా రోజులైందని తెలిపారు. టీ-వర్క్స్ ప్రతినిధి అజయ్ మాట్లాడుతూ… హైదరాబాద్లో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు మెట్ర్రో ఎక్కుతున్నారన్నారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో టీ-వర్క్స్ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…