మిథున్, అర్జిత్తో కలిసి ప్రజలంతా గుర్తు పెట్టుకునే ఓ పాటను ఇవ్వాలని అనుకున్నాను..
‘సయారా’ నుంచి రానున్న ‘ధన్’ కోసం అర్జిత్ సింగ్, మిథున్, మోహిత్ సూరి సంగీత త్రయం తిరిగి వచ్చింది. ఈ ముగ్గురూ హిందీ చిత్ర పరిశ్రమలో అతిపెద్ద చారిత్రాత్మక చార్ట్బస్టర్లను సృష్టించారు. ఆషికి 2 నుంచి ‘తుమ్ హి హో’ వంటి గీతాన్ని ఈ ముగ్గురూ కలిసి సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ పాట ఇప్పటికీ ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.
‘సమయం కలిసి వచ్చినప్పుడు ఓ మాయాజాలం జరుగుతుందని చెబుతుంటారు. నా జీవితంలో మిథున్, అరిజిత్ సింగ్ వంటి వారు నాకు దొరకడం అదృష్టం. మన దేశంలోని ఈ ఇద్దరు కళాకారులతో నా ఉత్తమ సంగీతాన్ని సృష్టించే అదృష్టం నాకు కలిగింది. మిథున్ మరియు నా సహకారం, నేను కలిసి 2005లో ‘జెహెర్’, ‘కలియుగ్’ సినిమా చేశాం. మా ఇద్దరి జర్నీ మొదలై 20 సంవత్సరాలు అయింది. 2005 నుంచి మిథూన్తో కలిసి ‘మర్డర్ 2’, ‘ఆషికి 2’, ‘ఏక్ విలన్’, ‘హమారి అధూరి కహానీ’, ‘హాఫ్ గర్ల్ఫ్రెండ్’, ‘మలంగ్’ వంటి చిత్రాలు చేశాము. మేం ఎన్నో కల్ట్ క్లాసిక్ రొమాంటిక్ పాటల్ని అందించాం.
“మిథున్, నేను కలిసి పనిచేసినప్పుడల్లా గొప్ప ట్రాక్ అందించాలని ప్రయత్నిస్తుండేవాళ్లం. మా మీద ఎప్పుడూ పెద్ద అంచనాలుంటాయి. ఆ ఒత్తిడిని మేం ఆస్వాధిస్తుంటాం. అర్జిత్ సింగ్ నాకు ఈ జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన జ్ఞాపకాలను ఇచ్చిన గాయకుడు. ‘ఆషికి 2’ నుంచి ‘తుమ్ హి హో’, ‘చాహున్ మై యా నా’, ‘హమ్ మార్ జాయేంగే’, ‘ఏక్ విలన్’లోని ‘హమ్దార్ద్’, ‘హమారీ అధూరి కహానీ’ టైటిల్ ట్రాక్ వరకు, ‘హాఫ్ గర్ల్ఫ్రెండ్’లోని ‘ఫిర్ భీ తుమ్కో చాహుంగా’, ‘మలాంగ్’లోని ‘చల్ ఘర్ చలేన్’ వంటి పాటలెన్నో క్లాసిక్గా నిలిచాయి.
మిథున్, అరిజిత్, నేను కలిసి పని చేస్తున్నప్పుడు ప్రజలు గుర్తుండిపోయే పాట ఇవ్వాలని కోరుకుంటారు. ప్రజల్లో మాపై ఉండే అంచనాల గురించి తెలుసు. మేము ముగ్గురం మళ్ళీ ‘సయారా’లో ‘ధన్’ కోసం జతకట్టాం. ఈ ట్రాక్ మాకు చాలా ప్రత్యేకమైనది. ప్రేమలో, జీవితంలో జరిగే పోరాటాన్ని జరుపుకునే పాట. జీవితం పూల పాన్పు కాదు. ధన్ అనే పాట స్పూర్తిని నింపేలా ఉంటుంది’ అని మోహిత్ సూరి అన్నారు.
‘సయారా’ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన నాలుగు పాటలు చార్ట్ బస్టర్లు నిలిచాయి. ఇక ఇప్పుడు ‘ధన్’ అనే పాటను రిలీజ్ చేయబోతోన్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో మోహిత్ సూరి దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రంతో అహాన్ పాండేను హీరోగా పరిచయం చేయనున్నారు. అనీత్ పడ్డా హీరోయిన్గా ఈ చిత్రంలో నటిస్తున్నారు. సయారా సినిమాను అక్షయ్ విధాని నిర్మించారు. ఈ చిత్రం జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. '90s'…
జెజె ఆర్ట్ మూవీస్, పవనసుత ప్రొడక్షన్స్, గాయత్రి సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా మహేష్ కుమార్ సంక, భగవాన్ నిర్మాతలుగా మణికంఠ…
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…
తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal