సినీ ప్రేమికులకు ఎప్పటికప్పుడు భారీ చిత్రాలు, విజువల్ వండర్స్ చిత్రాలనే కాదు.. వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్ను కూడా అందిస్తోన్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. ఓ వైపు స్టార్ హీరోలు, దర్శకులతో సినిమాలు చేస్తూనే యంగ్ టాలెంట్ను ఎంకరేజ్ చేయటంలో ఈ సంస్థ ఎప్పుడూ ముందుటుంది. తాజాగా లైకా ప్రొడక్షన్ తమ బ్యానర్లో కొత్త సినిమాను రూపొందించనున్నట్లు అధికారిక ప్రకటననను విడుదల చేసింది. ఆ సినిమాను డైరెక్ట్ చేయబోయేదెవరో కాదు.. మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ జూడ్ ఆంథని జోసెఫ్.
రియల్ కాన్సెప్ట్తో ‘2018’ వంటి ఓ విభిన్నమైన సినిమాను తెరకెక్కించిన జూడ్ ఆంథని జోసెఫ్ అందరి దృష్టిని ఆకర్షించారు. 2018లో కేరళలో వరద బీభత్సాన్ని ఎవరూ మరచిపోలేరు. అయితే ప్రభుత్వానికి, ప్రజలు అండగా నిలవటంతో భయానక పరిస్థితుల నుంచి అందరూ బయటపడ్డారు. ఈ నిజ ఘటనను కళ్లకు కట్టినట్లు చూపించిన ఆంథని జోసెఫ్ .. మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులను మెప్పించటానికి రెడీ అయ్యారు.
ఈసారి ఆయనతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ చేతులు కలిపింది. కచ్చితంగా ప్రేక్షకులను అంచనాలను మించేలా ఓ మెస్మరైజింగ్ మూవీతో రాబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని లైకా ప్రతినిధులు తెలియజేశారు.
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…
సావిత్రి గారు అద్భుతాలకే అద్భుతం - ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో పద్మశ్రీ డా. బ్రహ్మానందం ఆంగ్లంలోకి…
‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ -మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్…