గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా మలయాళంలో ఓ హ్యూజ్ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి “ఆవేశం” ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో “మంజుమ్మెల్ బాయ్స్” చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా
నిర్మాత వెంకట్ కె నారాయణ మాట్లాడుతూ – భాషలకు అతీతంగా ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వాలనేది మా సంస్థ లక్ష్యం. ఈ క్రమంలోనే మలయాళ చిత్ర పరిశ్రమలోకి భారీ చిత్రాన్ని తీసుకురాబోతున్నాం. మా సంస్థ నుంచి ప్రేక్షకులు ఆశించే హై క్వాలిటీ మూవీని టాలెంటెడ్ టీమ్ తో కలిసి నిర్మించనున్నాం. అన్నారు.
డైరెక్టర్ చిదంబరం మాట్లాడుతూ – ఇలాంటి గొప్ప మూవీ కోసం నేను ఎదురుచూస్తున్నాను. ప్యాషనేట్ టీమ్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మా విజన్ ను త్వరలోనే ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమవుతున్నాం. అన్నారు.
స్క్రిప్ట్ అందించిన జితూ మాధవన్ మాట్లాడుతూ – నా మనసుకు దగ్గరైన కథ ఇది. ఇలాంటి బ్యూటిఫుల్ టీమ్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులకు ఒక మంచి మూవీని అందిస్తామని చెప్పగలను. అన్నారు.
త్వరలోనే ఈ చిత్రానికి సంధించిన కాస్టింగ్, రెగ్యులర్ షూటింగ్ వివరాలు మూవీ మేకర్స్ వెల్లడించనున్నారు.
ఎడిటర్ – వివేక్ హర్షన్
డీపీవో – షైజు ఖాలిద్
మ్యూజిక్ – సుషిన్ శ్యామ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన – జితూ మాధవన్
నిర్మాతలు – వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్
దర్శకత్వం – చిదంబరం
'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…