ఎఫ్ టీ పీ సి ఇండియా – తెలుగు సినిమా వేదిక సంయుక్త నిర్వహణ
కృష్ణంరాజు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎఫ్ టీ పీ సి ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలు సినిమా, విద్య వైద్య సామాజిక రంగాలకు చెందిన పలువురిని రెబెల్ స్టార్ కృష్ణం రాజు ప్రతిభాపురస్కారం తో సత్కరించారు. సంస్థ అధ్యక్ష కార్యదర్సులు చైతన్య జంగా , విజయ్ వర్మ పాకలపాటి లు మాట్లాడుతూ విద్య వైద్య సామాజిక రంగాలను ప్రోత్సహించిన కృష్ణం రాజు గారి ఆశయాలు రాబోయే తరాలు గుర్తించుకొనేలా ఈ అవార్డు ల కార్యక్రమాన్ని ప్రతిఏటా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నామని ఈ ఏడాది నిర్వహించిన కార్యక్రమం లో దుబాయ్ కి చెందిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు జితేంద్ర మైథలానే ని ప్రత్యేకంగా సత్కరించామని తెలిపారు. ప్రభుత్వ విప్ రామచంద్రులు నాయక్, ఘజల్ శ్రీనివాస్ , మాజీ ఎం ఎల్ సి ప్రభుత్వ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు , దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ , నటుడు గౌతమ్ రాజు, కృష్ణుడు, హెచ్ ఆర్ ఓ వరల్డ్ చైర్మన్ నేమ్సింగ్ ప్రేమి , తదితరులు విచ్చేసి పలురంగాల వారికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు.బాలీవుడ్ నటీమణులు ధని బోస్,మోక్ష , అనీషా ముఖర్జీ , నేహా షా లకు ప్రత్యేక పురస్కారాన్ని అందజేశారు.
భీమవరం లో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న కారణంగా హైదరాబాద్ లో జరిగే ఈ ప్రతిభ పురస్కారాల కార్యక్రమానికి రాలేకపోతున్నానని, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న విజయ్ వర్మ , చైతన్యలకు తమ కుటుంభం తరుపున అభినందనలు తెలుపుతున్నట్లు స్వర్గీయ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి వీడియో విడుదల చేయడమే కాక కార్యక్రమం జరిగే సమయంలో ఫోన్ చేసి నిర్వాహకులను , అతిధులను , అవార్డు గ్రహీతలను అభినందించారు.
ఎఫ్ టీ పీ సి ఇండియా కు అమెరికన్ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేషన్ రావడంపట్ల సంస్థ అధ్యక్ష కార్యదర్సులు హర్షం వ్యక్తం చేశారు.ఇండియా లోనే ఈ సర్టిఫికేషన్ వచ్చిన ఏకైక సంస్థ ఎఫ్ టీ పీ సి ఇండియా కావడం విశేషం .
హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లోని సురవరం ప్రతాపరెడ్డి హాల్ లో ఈకార్యక్రమం జరిగింది .
విజయ్ ఆంటోని, శశి దర్శకత్వంలో వచ్చిన ‘బిచ్చగాడు’, అందులోని అమ్మ పాటకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇప్పటికీ అమ్మ…
ప్రఖ్యాత దర్శకులు దాసరి నారాయణరావు మరణానంతరం ఆయన పేరిట ప్రతి ఏటా ఘనంగా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తున్న ప్రముఖ నిర్మాత…
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది…
యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ…
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకప్పుడు అగ్ర కథానాయిక గా వెలుగొందారు మంజుల. ఎన్టీఆర్ తో మనుషులంతా ఒక్కటే, మగాడు,…
'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రాబోతుందో తెలుసుకోవాలనే…