మల్టీ లేయర్ స్క్రీన్ ప్లేతో సరికొత్త సైఫై థ్రిల్లర్ గా ప్రతి ప్రేక్షకుడినీ “కిల్లర్” సినిమా ఆకట్టుకుంటుంది – టీజర్ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ సుకు పూర్వాజ్

Must Read

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “కిల్లర్”. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

లైన్ ప్రొడ్యూసర్ సీతారామరావు మాట్లాడుతూ– “కిల్లర్” చిత్రం కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. టీజర్ లాగే సినిమాకు కూడా మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

లైన్ ప్రొడ్యూసర్ దశరథ మాధవ్ మాట్లాడుతూ – మంచి కంటెంట్ ఉన్న చిత్రమిది. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ తో ఆకట్టుకునేలా మూవీ ఉంటుంది. ఈ చిత్రంలో నేను బ్రదర్ రోల్ లో నటించాను. చిన్న సినిమా అయినా “కిల్లర్” పెద్ద విజయం సాధిస్తుంది. అన్నారు.

యాక్టర్ మనీష్ గిలాడ మాట్లాడుతూ – ఈ చిత్రంలో నేను విలన్ క్యారెక్టర్ లో నటించాను. నన్ను ఒక పవర్ ఫుల్ విలన్ గా చూపించిన డైరెక్టర్ సుకు పూర్వాజ్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాకు మేమంతా టీమ్ వర్క్ చేశాం. ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాం. అన్నారు.

యాక్టర్ గౌతమ్ చక్రధర్ మాట్లాడుతూ – “కిల్లర్” సినిమాలో జ్యోతి పూర్వజ్ గారి యాక్షన్, ఆమె ట్రాన్సఫర్మేషన్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. నేను కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్సులు పర్ ఫార్మ్ చేశాను. ఈ సినిమా టెక్నికల్ గా మంచి క్వాలిటీతో మా డైరెక్టర్ రూపొందించారు. ఇది టీజర్ మాత్రమే సినిమాతో పెద్ద సక్సెస్ అందుకుంటామనే నమ్మకం ఉంది.అన్నారు.

యాక్టర్ విశాల్ రాజ్ మాట్లాడుతూ – మా సినిమా టీజర్ చూస్తేనే టెక్నికల్ గా మూవీ ఎంత క్వాలిటీగా ఉండబోతుందో మీ అందరికీ అర్థమై ఉంటుంది. జ్యోతి గారిని మనం సీరియల్స్ లో చూశాం. ఇప్పుడీ మూవీలో ఆమె పర్ ఫార్మ్ చేసిన విధానం సర్ ప్రైజ్ చేస్తోంది. డైరెక్టర్ పూర్వాజ్ నాకు మంచి ఫ్రెండ్. ఈ చిత్రంలో ఒక కీ రోల్ చేసే అవకాశం కల్పించారు. ఈ సినిమా మా టీమ్ అందరికీ మంచి గుర్తింపు తీసుకొస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.

యాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ – జ్యోతి పూర్వజ్ గారిని కొత్తగా ఈ చిత్రంలో స్క్రీన్ మీద చూడబోతున్నాం. టెక్నికల్ వండర్ గా ఈ సినిమా ఉంటుంది. తెలుగు నుంచి వస్తున్న అరుదైన సినిమాల్లో ఒకటిగా కిల్లర్ పేరు తెచ్చుకుంటుంది. అన్నారు.

యాక్టర్ చందు మాట్లాడుతూ – కిల్లర్ మూవీలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న సుకు గారికి థ్యాంక్స్. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఏంటనేది సస్పెన్స్. అందుకే టీజర్ లో కూడా రివీల్ చేయలేదు. కథలో ఆద్యంతం నా క్యారెక్టర్ ట్రావెల్ అవుతూనే ఉంటుంది. ఈ చిత్రంతో నాకు నటుడిగా మంచి గుర్తింపు వస్తుంది. అన్నారు.

యాక్టర్ కాళీచరణ్ మాట్లాడుతూ – మా సినిమా టీజర్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి గారికి థ్యాంక్స్. నేను నటించిన ఓం బీమ్ భుష్ చిత్రంలాగే ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి. జ్యోతి గారు యంగ్ ఐశ్వర్య రాయ్ లా కనిపిస్తున్నారు. ఇలాంటి హై క్వాలిటీ మూవీని థియేటర్స్ లోనే మీరంతా చూడాలి. అన్నారు.

హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ – నేను సీరియల్స్ లో రొటీన్ క్యారెక్టర్స్ చేస్తూ విసిగిపోయి ఉన్న టైమ్ లో డైరెక్టర్ సుకు పూర్వజ్ నన్ను స్క్రీన్ మీద కొత్తగా చూపించేందుకు ముందుకొచ్చారు. నేను ఆరేడు క్యారెక్టర్స్ ఉన్న ఇలాంటి మూవీ చేస్తానని అనుకోలేదు. ఎవరైనా డ్యూయల్ రోల్ చేస్తారు కానీ ఆరేడు క్యారెక్టర్స్ లో పర్ ఫార్మ్ చేసే అవకాశం రావడం ఏ యాక్టర్ కైనా డ్రీమ్ అనుకోవచ్చు. ఈ సినిమాలో నాతో యాక్షన్ కూడా చేయించాడు డైరెక్టర్. విజయశాంతి గారిలా యాక్షన్ చేయాలని నాకూ డ్రీమ్ ఉండేది. అలాంటి అవకాశం “కిల్లర్” చిత్రంతో దక్కింది. పూర్వజ్ ఇచ్చిన సపోర్ట్ తోనే నేను ఈ సినిమా చేయగలిగాను. ఈ మూవీ కోసం డైరెక్టర్ పూర్వజ్ చాలా కష్టపడ్డాడు. పెళ్లయ్యాక చాలా మంది పర్సనల్ వెకేషన్ కు వెళ్తారు. కానీ మనం సినిమా చేద్దామని పూర్వాజ్ నాతో అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా రూపొందించడం ద్వారా చాలా మందికి ఎంతో కొంత ఉపాధి కల్పించినవారం అవుతాం అనుకున్నాను. జ్యోతి అంటే మంచి పర్ ఫార్మర్ అని, పూర్వాజ్ అంటే మంచి డైరెక్టర్ టెక్నీషియన్ అని ఈ చిత్రంతో ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. పూర్వాజ్ లో అమేజింగ్ యాక్టర్ ఉన్నాడు. రీసెంట్ గా అనిల్ రావిపూడి గారు మా సినిమా టీజర్ రిలీజ్ చేసి పూర్వాజ్ లో మంచి యాక్టర్ ఉన్నాడని చెప్పారు. మాకున్న లిమిటేషన్స్ దాటి ఈ సినిమాను రూపొందించాం. ఈ చిత్రంతో డబ్బులు చేసుకుందామని కాదు మేకర్స్ గా ఒక ఫౌండేషన్ వేసుకోవాలనే ప్రయత్నిస్తున్నాం. మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అన్నారు.

డైరెక్టర్ సుకు పూర్వాజ్ మాట్లాడుతూ – ఐదారేళ్ల కిందట అనుకున్న స్క్రిప్ట్ ఇది. మేము గతంలో గ్లింప్స్ ద్వారా చూపించింది చాలా తక్కువ అని చెప్పాను. ఇప్పుడు టీజర్ లో చాలా జాగ్రత్తగా కట్ చేసి మేము చూపించిన కంటెంట్ 40 పర్సెంట్ మాత్రమే. త్వరలో రాబోయే ట్రైలర్ లో 80 పర్సెంట్ చూపిస్తాం. థియేటర్ లో హండ్రెడ్ పర్సెంట్ సినిమా కథేంటి అనేది తెలుస్తుంది. మేము టీజర్ లో చెప్పినట్లు మీ మేధస్సును ఉపయోగించండి అనేది ఎందుకు చెప్పామో మూవీ చూస్తే తెలుస్తుంది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ డ్రామా, బ్రదర్ సిస్టర్ బాండింగ్, రివేంజ్, సబ్ కాన్షియస్ ఐడెంటిటీ.. ఇలాంటి ఎలిమెంట్స్ తో సైఫై థ్రిల్లర్ గా కిల్లర్ సినిమాను రూపొందించాం. మల్టీలేయర్ స్క్రీన్ ప్లే ఉన్నా ప్రతి సెక్షన్ ఆడియెన్ కు మూవీ ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది. వుమెన్ సెంట్రిక్ చిత్రమిది. కిల్లర్ లో ఆర్ అక్షరం రక్తిక అనే వ్యాంపైర్, రనియా అనే టెర్రరిస్ట్, రియా అనే స్పై, రై అనే విషపూరిత వుమెన్..ఈ క్యారెక్టర్స్ తో పాటు మేము రివీల్ చేయని మరో క్యారెక్టర్ ఉంటుంది. త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాం. అది ఇంకా హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. మా టెక్నికల్ టీమ్ అందరికీ థ్యాంక్స్. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ టీజర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి మా అందరి తరుపున థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.

నటీనటులు – జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ , మనీష్ గిలాడ, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి, తదితరులు

టెక్నికల్ టీమ్

రచన, ఎడిటింగ్, దర్శకత్వం – పూర్వాజ్
సమర్పణ – ఉర్వీశ్ పూర్వజ్
ప్రొడ్యూసర్స్ – పూర్వాజ్, పద్మనాభరెడ్డి.ఎ.
డీవోపీ – జగదీశ్ బొమ్మిశెట్టి
స్క్రీన్ ప్లే ఎడిటర్ – పూర్వాజ్
మ్యూజిక్ – ఆశీర్వాద్, సుమన్ జీవ
చీఫ్ ఎడిటర్ – బి.మనోజ్ కుమార్
మాస్టర్ చీఫ్ ఎడిటర్ – శివ శర్వాణి
కాస్టూమ్ డిజైన్ – ఉదయశ్రీ పూర్వజ్
ఆర్ట్ డైరెక్షన్ – మణి
యాక్షన్ కొరియోగ్రఫీ – రాజ్ కుమార్ గంగపుత్ర
లైన్ ప్రొడ్యూసర్స్ – దశరథ మాధవ్, సీతారామారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – డీఎస్ బాష
డీఐ – మయసభ స్టూడియోస్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News