సెన్సిబుల్ డైరెక్టర్ కె క్రాంతి మాధవ్ యూనిక్ అండ్ వైడ్ రేంజ్ ఎమోషనన్స్ వున్న మూవీస్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆర్తీ క్రియేటివ్ టీమ్ బ్యానర్పై గంటా కార్తీక్ రెడ్డి నిర్మించనున్న తన న్యూ ప్రాజెక్ట్ను ఇప్పుడు అనౌన్స్ చేశారు.
క్రాంతి మాధవ్ తన లేటెస్ట్ మూవీ కోసం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ని సిద్ధం చేశారు, ఇది వాస్తవ సంఘటనల స్ఫూర్తి పొందిన కథ. ఈ చిత్రానికి DGL అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. టైటిల్ పోస్టర్లో హీరో తన టీ-షర్ట్ని వెనుక నుంచి లిఫ్ట్ చేసి డిఫరెంట్ ఫోజ్ లో కనిపించారు. కాజీపేట జంక్షన్లోని రైల్వే ట్రాక్పై నిలబడి ఉండగా, అతని చుట్టూ వివిధ ట్రాక్లపై రైళ్లు వెళుతున్నాయి. పోస్టర్లో జర్నీ బిగిన్స్ అని రాసుంది.
టీమ్ విడుదల చేసిన మరో పోస్టర్లో స్నేహితుల గ్యాంగ్ రైల్వే బ్రిడ్జి పైన ఎంజాయ్ చేస్తున్నట్టు ప్రజెంట్ చేస్తోంది. రెండు పోస్టర్లు క్యురియాసిటీని పెంచాయి.
DGL సినిమా షూటింగ్ నవంబర్ 2024లో ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.జ్ఞాన శేఖర్ వీఎస్ కెమెరా మ్యాన్. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ క్లాసిక్ తర్వాత క్రాంతి మాధవ్, జ్ఞాన శేఖర్ VS కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన తారాగణంతో పాటు ఇతర టెక్నీషియన్స్ల వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
సాంకేతిక సిబ్బంది:
రచన,దర్శకత్వం: కె క్రాంతి మాధవ్
నిర్మాత: గంటా కార్తీక్ రెడ్డి
బ్యానర్: ఆర్తి క్రియేటివ్ టీమ్
డీవోపీ: జ్ఞాన శేఖర్ VS
పీఆర్వో: వంశీ-శేఖర్
'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…